India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీలోని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్తో శుక్రవారం మంత్రి స్వామి భేటి అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించారు. PM AJAY ఆదర్శ గ్రామ్ స్కీం కింద, రాష్ట్రంలో ఎంపిక చేసిన 526 గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.110 కోట్లు విడుదల చేయాలన్నారు. 75 సాంఘిక సంక్షేమ నూతన వసతి గృహాల నిర్మాణానికి రూ.245 కోట్లు విడుదల చేయాలని కోరారు.
చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన శీను(35) గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాసిన లెటర్తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ‘నా చావుకు నా భార్య కుటుంబం. వాళ్లను వదిలిపెట్టొద్దు. నాకు న్యాయం జరిగేవరకు నా శవం కుళ్లినా తీయకండి. నాకు 10 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. మెదటి రాత్రి తర్వాతి నుంచి నా భార్యతో గొడవలు జరుగుతున్నాయి.’ అని లెటర్లో పేర్కొన్నాడు.
చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన శీను(35) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోనికి వెళ్తే.. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకి కారణం అయ్యుండొచ్చని స్థానికులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునే ముందు శీను రాసిన ఆరు పేజీల లేఖను తన జేబులో గుర్తించారు. ‘నా ఇద్దరు పిల్లలు జాగ్రత్త’ అంటూ తాను రాసిన లేక గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పాఠశాలల పునఃనిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతి మండలం నుంచి తయారు చేయబడిన పీపీటీలను కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం రివ్యూ చేశారు. మండల విద్యాశాఖాధికారులు తయారు చేసిన పీపీటీల ద్వారా వారి మండలాలలో పాఠశాల పునఃనిర్మాణం చేపట్టిన తరువాత ఏర్పాటుచేయబోయే పాఠశాలల వివరాలు తగిన ఆధారాలతో కలెక్టర్కి వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన గంగవరపు శీను(35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం భార్య జ్యోతి, అత్తమామలే కారణమని లేఖ రాసి, నా ఇద్దరూ చిన్న పిల్లలు జాగ్రత్త అంటూ చనిపోయినట్లు సమాచారం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప్రకాశం జిల్లా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి 5వ ర్యాంక్, బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ 13వ ర్యాంక్ పొందారు. పనితీరును మెరుగు పరుచుకోవాని CM సూచించారు.
ప్రకాశం జిల్లాలో బుధవారం వివిధ ఘటనలలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పొదిలి మండలం కంబలపాడు కి చెందిన సుబ్బరత్తమ్మ పొలంలో విద్యుత్ షాక్కి గురై మరణించారు. దర్శి మండలానికి చెందిన నారాయణమ్మ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మరణించారు. అలాగే వరికుంటపాడు నుంచి పామూరు వస్తున్న బాలయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు.
జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం రాత్రి వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించరాదని సూచించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
పీసీపల్లి మండలం వాటర్ షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి బుధవారం కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహరెడ్డితో కలిసి ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, MLA మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు. మొక్కలు పెంచడం వలన ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందన్నారు.
పీసీపల్లి మండలం వాటర్ షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి బుధవారం కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహరెడ్డితో కలిసి ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, MLA మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు. మొక్కలు పెంచడం వలన ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.