Prakasam

News December 4, 2024

ప్రకాశం: నాలుగేళ్ల క్రితం భర్త.. ఇప్పుడు కుమారుడు మృతి

image

నాలుగేళ్ల క్రితం భర్త అకాల మరణంతో కుటుంబ పోషిన్తున్న తల్లి లక్ష్మీకి విధి కడుపు కోత మిగిల్చింది. గారభంగా పెంచుకున్న కుమారుడిని సోమవారం పాముకాటు వేయడంతో మరణించాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలోని బురుజుపల్లె గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిద్రిస్తున్న మనోజ్ తలపై పాము కాటు వేసింది. బాలుడు అరవడంతో తల్లి పామును దూరంగా విసిరేసింది. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మరణించాడు.

News December 4, 2024

మార్కాపురం: అమ్మను రోడ్డుపై వదిలేశారు

image

బతుకుదెరువు కష్టంగా మారి అనాథగా మిగిలిన పి.కాంతమ్మ అనే వృద్ధ మహిళను మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి ఆశ్రమంలో చేర్పించారు. మార్కాపురానికి వృద్ధురాలిని కుమారుడు, బంధువులు బాగోగులు చూడకుండా వదిలేశారు. విషయం కలెక్టర్ తమీమ్ అన్సారియా దృష్టికి వెళ్లింది. దీంతో మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి కనిగిరి ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి అక్కడ ఉండేలా ఆమెకు ఏర్పాట్లు చేశారు.

News December 4, 2024

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట: ప్రకాశం కలెక్టర్

image

దివ్యాంగుల సంక్షేమానికి, విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దివ్యాంగుల విద్యార్థులకు, వారికి అవసరమైన రంగాలలో శిక్షణ ఇవ్వటంతోపాటు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

News December 3, 2024

పొన్నలూరు: తల్లితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

image

గతనెల 23న HYDలో పొన్నలూరు(M) చెరుకూరు వాసి మార్క్(26) హత్యకు గురయ్యాడు. అతడు HYDలో నివాసం ఉంటూ సంగీతను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా.. మార్క్ స్వగ్రామం చెరుకూరుకు వెళ్లాడు. తిరిగివచ్చి చూడగా భార్య లేదు. వెంటనే భార్య పుట్టింటికి వెళ్లగా.. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్య, ఆమె తల్లి లక్ష్మి, తల్లితో సహజీవనం ఉంటున్న కాశీనాథ్ కలిసి మార్క్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

News December 3, 2024

పేరెంట్ -టీచర్ మీటింగ్ పండుగలా జరగాలి: కలెక్టర్

image

ఈనెల 7వ తేదీన జరిగే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని, కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.

News December 3, 2024

ప్రజా ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత: ప్రకాశం SP

image

సమాజంలోని సామాన్య ప్రజలు, వివిధ రకాల కారణాలతో వచ్చే బాధితుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల అర్జీలను పోలీసు ఉన్నదాధికారులు స్వయంగా స్వీకరించారు. వారితో ముఖాముఖిగా మాట్లాడి త్వరగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

News December 2, 2024

ప్రకాశం: ‘ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి’

image

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీ కోసం సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుందన్నారు. అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

News December 2, 2024

ప్రకాశం జిల్లాలో 16,280 మంది HIV రోగులు

image

రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ‘ఏపీ సాక్స్’ తెలిపింది. ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. NTR జిల్లాలో అత్యధికంగా 19,865 మంది ఉండగా ప్రకాశం జిల్లాలో 16,280, బాపట్ల జిల్లాలో 11,356 మంది HIV రోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఏటా రాష్ట్రంలో 3,510 మంది దీని బారిన పడుతున్నట్లు తెలిపింది. ఇక AP ART సెంటర్ల ద్వారా 2.24లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

News December 2, 2024

బల్లికురవ: ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం

image

13 నెలల చిన్నారి ఖాన్సాకు తల్లిదండ్రులు ఎటువంటి కష్టం రాకుండా పెంచుకున్నారు. చిన్నపాటి అనారోగ్యంగా ఉండటంతో చిలకలూరిపేట ఆసుపత్రిలో చూపించుకున్నారు. తిరిగి వస్తుండగా గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తమ కళ్లెదుటే, చేతుల్లోనే చిన్నారి మృతి చెందడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన బల్లికురవ మండలంలోని వేమవరంలో ఆదివారం జరిగింది. వీరిది సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామం.

News December 2, 2024

‘ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి’

image

ఒంగోలు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటుకు రూ.700 కోట్లు కేటాయించాలని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. వర్షం వస్తే మురుగు కాలువలు పొంగి రోడ్ల మీదకు చేరుతుందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణమేనని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం నేత రమేశ్ పాల్గొన్నారు.