Prakasam

News February 12, 2025

ప్రకాశం: టెన్త్ అర్హతతో 118 ఉద్యోగాలు

image

మార్కాపురం డివిజన్‌‌లో 57, ప్రకాశం డివిజన్‌లో 61 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News February 11, 2025

చీమకుర్తి: తండ్రిపై కొడుకు గొడ్డలితో దాడి

image

ప్రకాశం జిల్లాలో మంగళవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం బండ్లమూడుకి చెందిన లక్ష్మారెడ్డిపై కొడుకే గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. వెంటనే గ్రామస్థులు అడ్డుకొని 108 వాహనంలో క్షతగాత్రుణ్ణి ఒంగోలు హాస్పిటల్‌కు తరలించారు. తండ్రిపై దాడి చేసిన కుమారున్ని చీమకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News February 11, 2025

ఉపాధి పనులలో పురోగతి ఉండాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పనులలో ప్రతివారం స్పష్టమైన పురోగతి కనిపించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం మండల స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి కూలీల మొబిలైజేషన్, సగటు వేతనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఎంఎస్ఎంఈ సర్వేలో రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుని పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

News February 10, 2025

ప్రకాశం: తండ్రిని చంపిన కొడుకు.. BIG UPDATE

image

దొనకొండ(M) ఇండ్లచెరువులో <<15406169>>తండ్రిని కొడుకు హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. మద్యానికి బానిసైన మరియదాసు రోజూ ఇంట్లో గొడవ పడేవాడు. వారం కిందట భార్య, పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. శనివారం తండ్రి వద్ద డబ్బులు తీసుకుని మరియదాసు తాగి రోడ్డుపై పడిపోయాడు. విషయం తెలుసుకున్న తండ్రి ఏసు ఇంటికి తెచ్చాడు. అర్ధరాత్రి మెలుకువ వచ్చి రంపం బ్లేడుతో నిద్రలో ఉన్న తండ్రిని హత్యచేశాడు.

News February 10, 2025

ప్రకాశం జిల్లా ప్రజలు జాగ్రత్త..!

image

ప్రకాశం జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న ప్రకాశం జిల్లాలో గరిష్ఠంగా 33.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా నీరు, కొబ్బరినీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News February 10, 2025

రేషన్ కార్డులు, పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి: మంత్రి

image

అర్హులైన ప్రతిఒక్కరు నూతన రేషన్ కార్డులకు, పెన్షన్లకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతొక్కరు ఆయాగ్రామల్లో సచివాలయల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి స్వామి తెలిపారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు.

News February 10, 2025

పాఠశాలలపై అపోహలు వద్దు: మంత్రి స్వామి

image

పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి స్వామి అన్నారు. ఆదివారం ఒంగోలులో బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాక ఫౌండేషన్, ప్రైమరీ, హైస్కూల్ కొనసాగింపు విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పంచాయితీకి ఒకటి మాత్రమే మోడల్ స్కూల్ ఉంటుందనే అపోహ వద్దన్నారు.

News February 9, 2025

త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదు: గొట్టిపాటి

image

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలులో ఆదివారం జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, స్వామి, జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

News February 9, 2025

ప్రకాశం జిల్లా ఎస్పీ కీలక సూచనలు

image

ఒంగోలులో ఆదివారం రైజ్ కళాశాల, టెక్ బుల్ సమస్థ అధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు హెల్మెట్  రక్షణ కవచం లాంటిదన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఆయన సూచించారు.  ఈ రన్‌లో పాల్గొన్న  ప్రజలకు క్యాన్సర్, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపు నిచ్చారు.

News February 9, 2025

బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు: కలెక్టర్

image

మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. రైజ్ కళాశాల, టెక్ బుల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఒంగోలులో 5K రన్ నిర్వహించారు. క్యాన్సర్‌పై అవగాహన, మాదకద్రవ్యాల నివారణ కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ పరుగు మినీ స్టేడియం వద్ద ముగిసింది