India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్పాల్ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని తాలుకా పోలీస్ స్టేషన్లోనే ఆయనను రాత్రి నుంచి ఉంచారు. అక్కడే వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించారు. గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు ఉండటంతో మరికాసేపట్లో అక్కడికి తరలిస్తారని సమాచారం.
108 ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా పోస్ట్ పోన్ అయినట్లు 108 బాపట్ల జిల్లా కార్యదర్శి, అద్దంకి 108 EMT హరిబాబు మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. 108 సమస్యలపై 108 ప్రిన్సిపల్ సీఈవో 14 డిమాండ్లపై మినిట్స్ రూపంలో హామీ ఇచ్చినట్లు. ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు.
టంగుటూరులో ఓ వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. వేరు గ్రామంలో ఉన్న భర్త తన భార్య హైమావతికి పలుమార్లు ఫోన్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వాళ్లకు ఫోన్ చేశాడు. వారు ఇంటికి తాళం ఉందని అతడికి చెప్పారు. వెంటనే బంధువులను విచారించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఇంటి తాళాలు పగలకొట్టారు. తీరా చూస్తే హైమావతి కత్తిపోటుకు గురై ఉందని తెలిపారు.
ప్రకాశం జిల్లాలో తమకంటూ ఓ ముద్ర వేసుకున్న వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి. నేడు ఆయన 77వ జన్మదినం. ఒంగోలు MPగా ఆయన పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయ నిర్మాణాలు, కళాశాలల నిర్మాణాలు వంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికీ ఆయనను గుర్తు చేస్తూనే ఉంటాయి. అయితే డిసెంబరు 1, 1995(PWG) నక్సలైట్ల దాడిలో ఆయన మృతి చెందారు. సతీమణి పార్వతమ్మ ఒంగోలు MP, MLAగా పనిచేశారు. సోదరుడు శ్రీనివాసులరెడ్డి ప్రస్తుత MPగా ఉన్నారు.
ప్రకాశం జిల్లాలో తమకంటూ ఓ ముద్ర వేసుకున్న వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి. నేడు ఆయన 77వ జన్మదినం. ఒంగోలు MPగా ఆయన పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయ నిర్మాణాలు, కళాశాలల నిర్మాణాలు వంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికీ ఆయనను గుర్తు చేస్తూనే ఉంటాయి. అయితే డిసెంబరు 1, 1995(PWG) నక్సలైట్ల దాడిలో ఆయన మృతి చెందారు. సతీమణి పార్వతమ్మ ఒంగోలు MP, MLAగా పనిచేశారు. సోదరుడు శ్రీనివాసులరెడ్డి ప్రస్తుత MPగా ఉన్నారు.
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందిన యంగ్ క్రికెటర్ మనీశ్ రెడ్డి ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్ అయ్యారు. జెడ్డాలో రెండ్రోజుల పాటు జరిగిన వేలంలో మనీశ్ను దక్కించుకునేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. రూ.30 లక్షల బేస్ ప్రైస్తో వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా నిరాశే ఎదురైంది. ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి.
తాను విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ” YSR మరణించాక మంత్రి, MLA పదవులు వదులుకున్నానన్నారు. చంద్రబాబు, పవన్ మెప్పు కోసమే నేను మాట్లాడుతున్నానని కొందరు అనడం సమంజసం కాదన్నారు. ఎవరి మెప్పు కోసమో నేను పనిచేయట్లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. YSR కుటుంబం అంటే ఒక్క జగనేనా.? ఏ షర్మిల, విజయమ్మ కాదా అని బాలినేని ప్రశ్నించారు.
పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శనివారం సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యా బోధనతో పాటు పారిశుధ్యం పైన కూడా దృష్టి సాధించాలన్నారు. తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఇంగ్లిష్, గణితంలో పిల్లల పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు.
IPL మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందిన మనీశ్ రెడ్డి రూ.30 లక్షల బేస్ ఫ్రైస్తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో మన ప్రకాశం జిల్లా ఆటగాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.
సంతనూతలపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. పిల్లల్లో అభ్యాస శక్తిని పెంపొందించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.