India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎర్రగొండపాలెం మండలం వాదంపల్లికి పుచ్చనూతల మనోహర్ DSCలో సత్తా చాటాడు. SA తెలుగులో 84.82 మార్కులతో ప్రకాశం జిల్లా మొదటి ర్యాంక్ సాధించాడు. TGTలో 74.4 మార్కులతో 28వ ర్యాంక్ పొందాడు. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో అతడిని పలువురు అభినందించారు.
ఒంగోలులో TDP సమావేశం ఆదివారం జరగనుంది. ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడి ఎంపికపై త్రీ మెన్ కమిటీ ఆధ్వర్యంలో అభిప్రాయాలు సేకరించనుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. యువనేత దామచర్ల సత్యతో పాటు మరికొందరు రేసులో ఉన్నట్లు సమాచారం. ఎవరికి అధ్యక్ష పదవి వస్తుందని మీరు అనుకుంటున్నారు?
DSC మెరిట్ జాబితాలో కనిగిరికి చెందిన ఇరువురి వెంకట హర్షిత సత్తా చాటింది. SGT సోషల్లో ప్రకాశం జిల్లా మొదటి ర్యాంక్ సాధించింది. SGT ఇంగ్లిష్లో 16వ ర్యాంక్, ఎస్జీటీలో 7వ ర్యాంక్, మోడల్ స్కూల్ టీజీటీలో 4వ ర్యాంక్ పొందింది. ఆమె తండ్రి కృష్ణారెడ్డి ప్రభుత్వ టీచర్. హర్షితను పలువురు అభినందించారు.
ఒంగోలులో తొలిసారిగా నిర్వహించిన సీపీఐ రాష్ట్ర మహాసభ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. 28వ రాష్ట్ర మహాసభకు ఒంగోలు వేదిక కావడంతో కొన్ని రోజులుగా జిల్లా సీపీఐ నాయకత్వం, మహాసభలను సక్సెస్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన ర్యాలీతో మహాసభ సూపర్ సక్సెస్ అంటూ జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. మొత్తం మీద ఒంగోలు నగరం ఎర్రజెండాలతో రెపరెపలాడింది.
జిల్లాలోని ఆయా పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పలు పాఠశాలల యాజమాన్యాలతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే విద్యార్థులు ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడితే చట్టం తీసుకునే చర్యల గురించి యాజమాన్యాలు వివరించాలన్నారు.
జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు శనివారం జిల్లా విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు కీలక సూచన చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకునే కౌంటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే బిల్లులను ఫోన్ పే, డిపార్ట్మెంట్ యాప్ ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు.
వైసీపీ నాయకుల మాదిరిగా తాము తప్పుడు పనులు చేయమని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామంటూ మంత్రి స్వామి అన్నారు. కొండేపిలో నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి స్వామి మాట్లాడారు. ఒక్కొక్క హామీని తాము నెరవేర్చుకుంటూ వస్తున్నామని, వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కృషి చేస్తున్నారన్నారు.
పొదిలి మండలం కాటూరి వారి పాలెంకు చెందిన పేదల పార్టీ అనే రాజకీయ పార్టీకి జిల్లా ఎన్నికల అధికారి తమీమ్ అన్సారియా శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శికి నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. ఆరేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయనందుకు నోటీసు జారీ చేశారు. వచ్చేనెల 8న ఎన్నికల అధికారి ముందు హాజరు కావాలన్నారు.
ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖాధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల రాజీపడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో DEO కిరణ్ పలువురు పాల్గొన్నారు.
జిల్లాలో ఎక్కడైనా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్ పలువురు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.