India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నవంబర్ నెలలో జిల్లాలో పంపిణీ చేయనున్న పెన్షన్ల పంపిణీపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష నిర్వహించారు. పెన్షన్స్ పంపిణీ గురించి మాట్లాడుతూ.. 31వ తేదీన దీపావళి పండుగ నేపథ్యంలో ఈనెల 30వ తేదీనే ముందస్తుగానే బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవాలన్నారు. 1వ తేదీన ఉదయం 5గంటలకి లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలన్నారు.
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 30న జిల్లా పర్యటన నిమిత్తం ఒంగోలు నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా నగరంలోని టీడీపీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని టూరిజం డెవలప్మెంట్ ఛైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, కూటమి నాయకులు హాజరవుతారు.
మార్కాపురం మండలం రాయవరం రైల్వే స్టేషన్ వద్ద ఓ ఇంట్లో వ్యక్తి మృతి చెందాడు. నాయుడుపల్లి వెళ్లే రహదారిలో ఉన్న రైస్ మిల్లు యజమాని గుంటక సత్యనారాయణ (75) ఐదు రోజుల క్రితం ఇంట్లో మృతి చెంది ఉన్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని తల భాగంలో బలమైన గాయమైనట్లు పోలీసులు గుర్తించారు. హత్యా లేక మరేదైనా కారణమా అన్న వివరాలు తెలియాల్సిఉంది.
నవంబర్ నెలలో జిల్లాలో పంపిణీ చేయనున్న పెన్షన్ల పంపిణీపై జిల్లా అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష నిర్వహించారు. పెన్షన్స్ పంపిణీ గురించి సమీక్షిస్తూ.. 31వ తేదీన దీపావళి పండుగ నేపథ్యంలో ఈనెల 30వ తేదీనే ముందస్తుగానే బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవాలన్నారు. 1వ తేదీన ఉదయం 5గంటలకి లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలన్నారు.
ఒంగోలు స్వార్వత్రిక ఎన్నికలలో వాడిన EVMలలో అవకతవకలు జరిగాయని బాలినేని వేసిన పిటీషన్ను కోర్టు కొట్టేసింది. EVMలలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్కు గురైందా అన్న విషయాన్ని పరిశీలించేందుకే మాక్ పోలీంగ్ నిర్వహిస్తారని కోర్టు తెలిపింది. దీనికి VV ప్యాట్ల తెక్కింపు అవసరం లేదని EC చేసిన వాదనకు న్యాయస్థానం ఏకీభవించింది. హైకోర్ట్ న్యాయమూర్తి సోమవారం తీర్పును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
వలేటివారిపాలెం మండలం చుండి అయ్యవారిపల్లి వద్ద సోమవారం రాత్రి రోడ్డు<<14477898>> ప్రమాదం జరిగింది.<<>> ఈ ప్రమాదంలో లారీ- బైక్ ఢీకొనగా బైక్ మీద ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి చుండికి చెందిన పృథ్వీరాజ్ (30)గా తెలిసింది. ఇతను వలేటివారిపాలెం సమీపంలో ఇటుక బట్టీల వ్యాపారం చేస్తుంటాడు. పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. మరో 5 నిమిషాల్లో ఇంటికి చేరాల్సి ఉండగా మృత్యువు లారీ రూపంలో ఎదురైంది.
సోషల్ మీడియాలో ప్రజలు తమ ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వంటి వివరాలు, ఇతర విలువైన వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకూడదని ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు. దీని వలన సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు.
చినగంజాం మండలంలో ఓ స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. నాగులుప్పలపాడుకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులను వారి గ్రామాల్లో దింపడానికి వెళ్తుంది. ఈ క్రమంలో చినగంజాం మండలం మున్నవారి పాలెం సమీపంలో స్టీరింగ్ తిరగకపోవడంతో బస్సు కంట్రోల్ కాక పొలాల్లోకి వెళ్లినట్లు తెలిపారు. ఈ సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేనిది కీలక పాత్ర. ఇటీవల ఈయన వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినా ఆయన ఎక్కడా కానరాలేదు. ఈనెల 30న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో ఒంగోలులో కూటమి నాయకులతో కీలకమైన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికైన బాలినేని వస్తారా? రారా? అనేది ఆసక్తిగా మారింది. మరి మీరేమంటారు కామెంట్ చేయండి.
సొంత చెల్లినే గర్భిణిని చేసిన దుర్మార్గపు ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. తాళ్లూరు మండలానికి చెందిన బాలిక(13) 8వ తరగతి చదువుతోంది. ఇంటికి సమీపంలోని ఓ బాలుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేస్తానంటూ బెదిరించి బాలిక సొంత సోదరుడు లైంగిక దాడి చేశాడు. ఆమె గర్భం దాల్చింది. ఓRMP సాయంతో గర్భం తొలగించే ప్రయత్నం చేయగా పరిస్థితి సీరియస్ అయ్యింది. ఒంగోలు ఆసుపత్రికి రావడంతో అసలు విషయం తెలిసింది.
Sorry, no posts matched your criteria.