Prakasam

News April 8, 2024

టీచర్ల విదేశీ ప్రయాణల అనుమతులు రద్దు

image

ఎన్నికల నేపథ్యంలో టీచర్ల విదేశీ ప్రయాణ అనుమతులను రద్దు చేస్తూ పాఠశాల విద్యా కమిషనర్ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో వారిని నియమించి శిక్షణ ఇస్తున్నారు. మే 13లోపు విదేశాలకు వెళ్లేందుకు పొందిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే 13న పోలింగ్ ముగిశాక విదేశాలకు వెళ్లే అనుమతులు ఇచ్చేందుకు ఆన్‌లైన్లో సమర్పించాలని డీఈవో సుభద్ర తెలిపారు.

News April 8, 2024

ప్రకాశం జిల్లాలో నేటి జగన్ పర్యటన ఇలా…

image

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ సోమవారం ఇలా సాగనుంది. ఆదివారం రాత్రి దర్శి మండలంలోని వెంకటాచలంలో బస చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు బస్సు యాత్ర ప్రారంభిస్తారు. భోదనంపాడు, కురిచేడు, చీకటిగలపాలెం, కనమర్లపూడి మీదుగా శావల్యాపురం చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

News April 8, 2024

ప్రకాశం: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

కొరిసపాడు మండలం పమిడిపాడులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకున్నట్లు పోలీసుల తెలిపారు. అత్తింటి చిన్న అంజయ్య(50) పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

News April 8, 2024

నేటి జగన్ షెడ్యూల్ ఇలా…

image

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ సోమవారం ఇలా సాగనుంది. ఆదివారం రాత్రి దర్శి మండలంలోని వెంకటాచలంలో బస చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు బస్సు యాత్ర ప్రారంభిస్తారు. భోదనంపాడు, కురిచేడు, చీకటిగలపాలెం, కనమర్లపూడి మీదుగా శావల్యాపురం చేరుకుంటారు. అక్కడే రాత్రికి బస చేస్తారు. వినుకొండలో ఆయన రోడ్ షో నిర్వహిస్తారు.

News April 7, 2024

ఒంగోలు రైల్వే ట్రాకుపై వ్యక్తి మృతి

image

ఒంగోలు రైల్వే స్టేషన్ కొత్తపట్నం ఫ్లైఓవర్ సమీపంలో రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. రైల్వే ట్రాకుపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్న విషయాన్ని గుర్తించి రైల్వే అధికారులకు కొందరు సమాచారం అందించారన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను రాబట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 7, 2024

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి మృతి

image

కొరిసపాడు మండలంలోని పి.గుడిపాడులోని ఆశ్రమ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి రైల్వేకోడూరు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనగా, అనంతరం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు సంవత్సరాల పాప అక్కడికక్కడే మృతిచెందగా.. మిగిలిన వారికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 7, 2024

ఒంగోలు: 59 ఉద్యోగులకు సంజాయిషీ నోటీసులు

image

ఒంగోలు నగరంలోని కేంద్రియ విద్యాలయంలో ఈ నెల 5న సార్వత్రిక ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు జిల్లాలోని పీవోలు, ఏపీవోలకు తొలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే పలువురు అధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరు కాలేదు. విషయం కలెక్టర్ దినేశ్ కుమార్ దృష్టికి వెళ్లడంతో జిల్లాలోని 59 మంది పీవోలు, ఏపీవోలకు కలెక్టర్ శనివారం సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.

News April 7, 2024

కొమరోలు: అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి

image

కొమరోలులోని చర్చి వీధిలో నివాసం ఉంటున్న గర్భిణీ ప్రసన్న (30) అనుమానాస్పద స్థితిలో శనివారం సాయంత్రం మృతి చెందింది. ఆమె భర్త నారాయణ కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న బాత్రూంలో జారిపడి మృతి చెందినట్లుగా భర్త నారాయణ తెలిపాడు. ప్రసన్నను భర్త చంపి ఉంటాడని ఆమె తమ్ముడు సాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 7, 2024

ఎన్నికల నియమావళిని పాటించాలి: సబ్ కలెక్టర్

image

కందుకూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి శనివారం సమావేశం నిర్వహించారు. నేతలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పార్టీ కరపత్రాలపై ప్రింటింగ్ ప్రెస్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించాలన్నారు. కందుకూరులో 55 సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించి భద్రత పెంచామని సబ్ కలెక్టర్ తెలిపారు.

News April 6, 2024

రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ షెడ్యూల్ ఇదే

image

ప్రకాశం జిల్లాలో రేపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన వివరాలను అధికారులకు సీఎం సమాచారం అందజేసింది. రేపు ఉదయం 9గంటలకు కనిగిరి నియోజకవర్గంలో మొదలయ్యే సీఎం జగన్ పర్యటన చిన్నారికట్ల మీదుగా కొనకనమిట్ల చేరుకొంటుంది. అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్ లో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం రాత్రికి దర్శి నియోజకవర్గానికి చేరుకొని అక్కడ సీఎం బస చేయనున్నట్లుగా పేర్కొన్నారు.