India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లాలో పొగాకు నాట్లు ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల ఇటీవల కురిసిన వర్షానికి పొగనారు మల్లు కుళ్లిపోయాయి. తెగులు సోకి దెబ్బతిన్నాయి. దీంతో పొగనారు ధర పెరిగింది. గతంలో రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉండే మూట నారు ధర నేడు రూ.3 వేల నుంచి 4 వేల వరకు చేరింది. కొండపి బోర్డు పరిధిలో ఈసారి 175 హెక్టార్లలో పొగనారు సాగవుతోంది. పశ్చిమాన సాగు ప్రారంభం కాగా, తూర్పు ప్రాంతంలో కొన్నిచోట్ల పొలాలు ఇంకా ఆరలేదు.
ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా 2 రోజులు జిల్లాలో పర్యటిస్తారు. దోర్నాల క్యాంపు ఆఫీసులో జిల్లా నాయకులతో భేటీ అనంతరం ప్రాజెక్టు సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు పెండింగ్ పనులు, మార్కాపురం మండలం గొట్టిపడియ డ్యాం పరిశీలిస్తారు.
కార్తీకమాసం ప్రారంభం కానున్న సందర్భంగా నవంబర్ 3వ తేదీ నుంచి భక్తుల సౌకర్యం కోసం ప్రముఖ శైవ క్షేత్రాలకు కనిగిరి నుంచి బస్సులు ఏర్పాటు చేశారు. పంచరామాలు, అరుణాచలం, శ్రీశైలం క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కనిగిరి డిపో మేనేజర్ మహమ్మద్ సయానా బేగం ఆదివారం తెలిపారు. ప్రతి సోమవారం, పౌర్ణమి రోజులలో ఈ సర్వీసులు నడపడం జరుగుతుందని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఇటీవల ఈవీఎంలపై అనుమానాలు ఉన్న కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం జడ్జిమెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్లలో ఉన్న స్లిప్పులను లెక్కించాలని.. మాక్ పోలింగ్ కాదని హైకోర్టులో రీపిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఆగస్టు 17న వాదనలు వినిపించారు. ఇటీవలే ఆయన జనసేనలో చేరడంతో ఈ తీర్పుపై జిల్లా అంతటా ఉత్కంఠ నెలకొంది.
అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఐడీ రూపకల్పన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఈ విషయంపై శనివారం సాయంత్రం మండల విద్యాధికారులతో ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అపార్ ఐడీ జనరేషన్ పురోగతిపై కలెక్టర్ ఈ సందర్భంగా సమీక్షించారు. అడ్మినిస్ట్రేషన్ రిజిస్టర్లో వివరాలు సరిపోతే అపార్ ఐడీ జారీ చేయాలన్నారు.
యర్రగొండపాలెం వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన (1) నూర్ మహమ్మద్, (2) మొగల్ అప్రోజ్లు పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించేందుకు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో యువకుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఒంగోలులోని మంగమ్మ కాలేజీ జంక్షన్లో రూ.1.30 కోట్లతో నూతనంగా మంజూరైన రోడ్డు నిర్మాణానికి పలువురు టీడీపీ నేతలు భూమి పూజ చేశారు. మంగమ్మ కాలేజీ జంక్షన్ నుంచి, కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ వరకు గల తారు రోడ్డుకు భూమి పూజా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని భూమి పూజ చేశారు.
బాలినేని శ్రీనివాస రెడ్డికి జనసేనలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీ అధినేత పవన్తో ఆయన సమావేశమై.. జిల్లాలోని రాజకీయ పరిస్థితులను వివరించినట్లు సమాచారం. త్వరలో బాలినేని ఆధ్వర్యంలో పవన్ ఒంగోలులో సభ ఏర్పాటు చేసి, బాధ్యతలు అప్పగించనున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అపార రాజకీయ అనుభవమున్న ఆయన సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకోవాలని జనసేన ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఫొటో వైరల్ అవుతోంది. విజయవాడ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఓ సాధారణ ప్రయాణికుడిలా రైలు కోసం వేచిచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో ప్రకాశం జిల్లాలో వైరల్ అవుతోంది. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే వ్యక్తి అని చెప్పడానికి ఈ ఫొటో నిదర్శనమని ఆయన వర్గీయులు కొనియాడుతున్నారు.
అద్దంకిలో పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం యజమాని అనిల్ అద్దంకికి చెందిన వెంకటేశ్వర్లు, భార్య మల్లేశ్వరిని నియమించుకున్నారు. విదేశాలలో స్థిరపడిన అనిల్కు 3 నెలల నుంచి షాపునకు సంబంధించిన డబ్బులు అందలేదు. అనిల్ అద్దంకికి వచ్చి సదరు వ్యక్తులను డబ్బులు అడగగా.. వారు చంపేస్తా అంటూ బెదిరించారని, రూ.30 లక్షలు కాజేశారని బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అద్దంకి CI కృష్ణయ్య తెలిపారు.
Sorry, no posts matched your criteria.