Prakasam

News March 22, 2024

ప్రకాశం: అన్నదమ్ముల దారెటు

image

ప్రకాశం జిల్లాలో ఆమంచి అన్నదమ్ములు సైలెంట్‌ ఆసక్తి రేపుతోంది. కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. 2019లో కరణం బలరాం చేతిలో ఓడిపోవడంతో ఆయన్ను పర్చూరు ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ నియమించింది. తాజాగా పర్చూరు టికెట్ యడం బాలాజీకి కేటాయించింది. మరోవైపు ఆమంచి స్వాములు జనసేన నుంచి గిద్దలూరు టికెట్ ఆశించినా దక్కలేదు. సీటు రాని ఆమంచి సోదరులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.

News March 22, 2024

సింగరాయకొండ: ముగ్గురు వాలంటీర్లపై వేటు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ముగ్గురు వాలంటీర్లపై తొలగింపులు కొనసాగుతున్నాయి. బుధవారం సింగరాయకొండలో మంత్రి సురేశ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పొన్నూరి సురేశ్, సిరిమల్లె మణికంఠ, దేపూరి శివయ్య పాల్గొన్నారు. దీనిపై అధికారులు స్పందించి.. విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో నగేశ్ కుమారి చెప్పారు. ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో తొలగింపులు జరిగాయి.

News March 22, 2024

ప్రకాశం: ‘రాజకీయ ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి’

image

రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల అబ్జర్వర్లు, ఎన్నికల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులు కనీసం 48 గంటల ముందుగా అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎన్నికల నిబంధనలో ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 21, 2024

ప్రకాశం జిల్లాలో ట్రాక్టరు బోల్తా.. డ్రైవర్ మృతి

image

త్రిపురాంతకం మండలం రాజుపాలెంకు చెందిన గంపసాని సింహాద్రి (20) ఇటుకల బట్టీలో ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. గురువారం ఇటుకల లోడు ట్రాక్టరును తీసుకుని త్రిపురాంతకం వస్తున్న క్రమంలో చెరువు చప్టాపై స్పీడ్ బ్రేకర్ వద్ద ఆదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఇటుకలు సింహాద్రిపై పడ్డాయి. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను బయటకు తీసి వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News March 21, 2024

వై.పాలెం: గ్రామ సేవకుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మృతి

image

గ్రామ సేవకుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుర్రం నాగయ్య గురువారం మృతి చెందారు. బుధవారం సాయంత్రం నాగయ్య తన ఇంటి ముందు రోడ్డు దాటుతుండగా మోటారు సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి విషయాన్ని తెలుసుకున్న గ్రామ సంఘం నాయకులు సంతాపం తెలిపారు.

News March 21, 2024

ప్రకాశం: బాలుడిపై లైంగిక దాడి

image

సంతమాగులూరుకు చెందిన బాలుడిపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బెల్లంకొండ మండలంలోని వెంకటాయపాలేనికి పనుల నిమిత్తం సంతమాగులూరు నుంచి బాలుడి కుటుంబ సభ్యులు ఇటీవల వలస వెళ్లారు. ఈ క్రమంలో వెంకటాయపాలేనికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2024

ప్రకాశం: వాలంటీర్లకు హెచ్చరిక

image

జిల్లాలో ఇటీవల ఎన్నికల కోడు అమలులోకి వచ్చింది. దీంతో ప్రచారాలు చేసుకోవాలన్నా, పోస్టర్లు వేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరని కలెక్టర్ దినేశ్ కుమార్ రాజకీయ పార్టీ నాయకులకు తెలిపారు. ఇందులో ముఖ్యంగా వాలంటీర్లు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్న, పార్టీ కండువాలు వేసుకున్నా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో కొంతమంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

News March 21, 2024

కొండపి: తొలిరౌండ్ పొగాకు అమ్మకాలు పూర్తి

image

కొండపిలోని వేలం కేంద్రంలో తొలిరౌండ్ పొగాకు అమ్మకాలు బుధవారంతో పూర్తయ్యాయని వేలం నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. రెండో రౌండ్ గురువారం నుంచి మొదలవుతుందన్నారు. ఇందులో బ్యారన్‌కు 4బేళ్ల చొప్పున విక్రయాలకు అనుమతించామన్నారు. రైతులు గ్రేడింగ్ సరిగ్గా చేసుకొని బేళ్లను వేలానికి తీసుకువచ్చి గిట్టుబాటు ధరలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News March 21, 2024

ప్రకాశం: అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు

image

జిల్లాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ఓ మైనర్ బాలికను అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అతడికి 10 జైలు శిక్ష పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. జరుగుమల్లి మండలం నందనవనానికి చెందిన మిడసాల శివకృష్ణ(32) 2014లో హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో 13 ఏళ్ల బాలికను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా పదేళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News March 20, 2024

ప్రకాశం: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పాటించాలి

image

ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించడంతోపాటు ఎన్నికలు పూర్తయ్యే వరకు నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఎన్నికల అధికారులకు సూచించారు. కొండపి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎన్నికల కమిషన్ నిబంధనలపై మండల స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అలాగే రిటర్నింగ్ అధికారులందరూ తమ బృందాల్లోని అధికారులను సిద్ధం చేయాలని తెలిపారు.