Prakasam

News January 4, 2025

ప్రకాశం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన

image

ప్రకాశం జిల్లా దొనకొండలో బ్రిటీష్ కాలంలోనే ఎయిర్ ఫోర్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇది ఎప్పుడో మూతపడింది. ఈ నేపథ్యంలో ఒంగోలుకు దగ్గరలోని కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆ ఏరియాలో 723 ఎకరాలను గుర్తించినట్లు సీఎం చంద్రబాబు నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.

News January 4, 2025

ప్రకాశం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన

image

ప్రకాశం జిల్లా దొనకొండలో బ్రిటీష్ కాలంలోనే ఎయిర్ ఫోర్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇది ఎప్పుడో మూతపడింది. ఈ నేపథ్యంలో ఒంగోలుకు దగ్గరలోని కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆ ఏరియాలో 723 ఎకరాలను గుర్తించినట్లు సీఎం చంద్రబాబు నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.

News January 4, 2025

ఒడిశా గవర్నర్‌గా ప్రకాశం జిల్లా వాసి

image

ఒడిశా గవర్నర్‌‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లా వాసే. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం ఈయన స్వగ్రామం. మిజోరం గవర్నర్‌గా ఉన్న ఈయనను ఒడిశాకు బదిలీ చేశారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్‌‌భవన్‌లో హరిబాబుతో శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా CMమోహన్ చరణ్ మాఝీ హాజరయ్యారు. ఆయన ఉన్నత చదువుల కోసం వైజాగ్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.

News January 3, 2025

ప్రకాశం: అరుదైన మొక్కల స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్

image

పక్కాగా అందిన సమాచారంతో అరుదుగా కనిపించే మొక్కలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఒంగోలులో గురువారం చోటుచేసుకుంది. నిందితుల నుంచి 9.8 కిలోల ఇంద్రజాల, 0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు, 6 శంఖాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులో ఉన్న నిందితుల సమాచారం‌ మేరకు మొక్కలు సరఫరా చేసిన వ్యక్తిని ఒంగోలులో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 6.64 కిలోల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు

News January 2, 2025

ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు ఇంచార్జ్ ఆర్ఎం ఎవరంటే?

image

ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు దక్షిణాది ప్రాంతీయ ఇన్‌ఛార్జ్ రీజనల్ మేనేజర్‌గా బి. సుబ్బారావు నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఆర్ఎంగా ఉన్న లక్ష్మణ రావు కృష్ణ శ్రీ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ప్రస్తుతం గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుబ్బారావుకు ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు.

News January 2, 2025

బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్య

image

బాపట్ల జిల్లా నగరం మండలం చిన్నమట్లపూడిలో బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన లుక్క నాగరాజు (43)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నాగరాజు భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రేపల్లె గ్రామీణ సీఐ సురేశ్ బాబు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News January 2, 2025

ఉగ్ర వినూత్న ఆలోచన.. ఆసుపత్రికి మహర్దశ

image

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నూతన సంవత్సర వేడుకల్లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి విరాళాల సేకరణ చేశారు. బొకేలకు బదులు విరాళాలను టీడీపీ శ్రేణులు, ప్రజలు, అధికారులు విరాళాలను ఆయనకు అందించారు.. విరాళాల రూపంలో రూ. 3,28,773లు సమకూర్చినట్లు ఆయన తెలిపారు. వైద్యశాల అభివృద్ధికి విరాళాలు అందించిన వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

News January 1, 2025

వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే ఉగ్ర

image

కనిగిరిలో ఎమ్మెల్యే Dr.ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ఓ వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు, అభిమానులు, అధికారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఆయన పూల దండలు, బొకేలు, స్వీట్స్, పండ్లు తీసుకురాకుండా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి సహకరించాలని హుండీ ఏర్పాటు చేసి విరాళాల సేకరణ చేపట్టారు.

News January 1, 2025

పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పు

image

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గాదె మధుసూదన రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాదె మధుసూదన రెడ్డి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా యడం బాలాజీ ఉన్న విషయం తెలిసిందే.

News December 31, 2024

న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న బాపట్ల కలెక్టర్

image

విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కలిసి వేడుకలు  జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.