Prakasam

News March 20, 2024

గుడ్లూరు: ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడి మృతి

image

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్‌ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన గుడ్లూరు మండలంలోని రాళ్లవాగు వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పొట్లూరు గ్రామానికి చెందిన ముసలయ్య, చలంచర్ల రమణయ్యలు బైక్ పై గుడ్లూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆగిన ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈప్రమాదంలో ముసలయ్య(29) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 20, 2024

ప్రకాశం: ఇటు కొత్త.. అటు పాత

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. YCPలో ఒంగోలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులకు స్థాన చలనం కల్పించారు. TDP మాత్రం దాదాపు పాత నాయకులనే బరిలోకి దింపుతోంది. దర్శి, చీరాల అభ్యర్థులను కూటమి ఇంకా ప్రకటించనప్పటికీ అక్కడ కూడా దాదాపు లోకల్ వాళ్ల బరిలో ఉండే అవకాశం ఉంది. రెండు పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు.

News March 20, 2024

ఒంగోలు: ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి

image

ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ చెప్పారు. ఒంగోలులోని కలెక్టర్ పరిపాలనా భవనంలో ఎన్నికల సిబ్బందికి మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో అజాగ్రత్తగా ఉండొద్దని చెప్పారు. అవసరమైన సామగ్రిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని చెప్పారు.

News March 19, 2024

మర్రిపూడి: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి

image

మర్రిపూడి మండలం వెంకటక్రిష్ణాపురం వద్ద మంగళవారం రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మృతుడు కొండపి గ్రామానికి చెందిన బారెడ్డి ఏడుకొండలుగా పోలీసులు గుర్తించారు. మృతుడు ప్రతి రోజూ కొండపి నుంచి ధర్మవరం గ్రామానికి వచ్చి పాల వ్యాపారం చేస్తుంటాడని సమాచారం. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

దోర్నాల : ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వ్యక్తి మృతి

image

ప్రకాశం జిల్లా దోర్నాల చెందిన మల్లికార్జున అనే వ్యక్తి చిలకలూరిపేట వద్ద జరిగిన ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వినుకొండ సమీపంలో స్కూల్‌ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుటుంబ భారాన్ని మోసే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.

News March 19, 2024

గిద్దలూరు: గొడ్డలి దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

image

గొడ్డలి దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గిద్దలూరు మండలం పరమేశ్వర్ నగర్ గ్రామానికి చెందిన <<12881965>>TDP కార్యకర్త<<>> మునయ్యపై నలుగురు వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునయ్యను హైదరాబాద్ లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మునయ్య చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 19, 2024

ఒంగోలు: వైసీపీకి మేలు చేశారన్న అభియోగంపై టీచర్ రిలీవ్

image

రానున్న ఎన్నికలలో వైసీపీకి మేలు చేసేలా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎం.ప్రసాద్ వ్యవహరిస్తుండడంతో ఆ బాధ్యత నుంచి రిలీవ్ చేశారు. ఒంగోలులో ఆయ‌న ప్రస్తుతం సిబ్బందికి ఎన్నికల విధులు వేసే పనిలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయిస్తున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

News March 19, 2024

ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా‌ లోడు వ్యాను ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైకు మీద ఉన్న ఇద్దరు యువకులు డివైడర్‌ మీద పడి అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ భక్తవత్సల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

అనుమానస్పద ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించండి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమానస్పద ఆర్థిక లావాదేవీలు అక్రమంగా డబ్బు తరలింపును కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగము బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం తన ఛాంబర్ లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనుమానస్పద లావాదేవీలు అంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.

News March 18, 2024

ప్రకాశం: 74 మంది ఇంటర్ అధ్యాపకులకు నోటీసులు

image

జిల్లాలో ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి గైర్హాజరైన 74 మంది అధ్యాపకులకు నోటీసులు జారీ అయ్యాయి. ఒంగోలులోని ఓ జూనియర్ కళాశాలలో సోమవారం తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితం, పౌరశాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇందుకు 405 మంది అధ్యాపకులను నియమించారు. వీరిలో 331 మంది హాజరు కాగా, 74 మంది గైర్హాజరయ్యారు. వీరికి ఆర్‌ఐవో సైమన్ విక్టర్ నోటీసులు జారీ చేశారు.