India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాలపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఒంగోలు పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లోని పోలీసు జూడో క్లస్టర్లో తైక్వాండో, కరాటే, పెంచాక్ సిలాట్ గేమ్స్ కోసం, నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్డోర్ హాల్ను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. ఈ క్యాంప్కు వివిధ జిల్లాల నుంచి పోలీసు క్రీడాకారులు వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ నిమిత్తం కావాల్సిన వసతుల గురించి పోలీస్ క్రీడాకారులను అడిగి ఎస్పీ తెలుసుకున్నారు.
ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీమతి మాగుంట పార్వతమ్మ దశదినం సందర్భంగా.. బుధవారం నెల్లూరులోని మాగుంట నివాసంలో పార్వతమ్మ చిత్రపటానికి మంత్రి స్వామి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి పనులు, ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ డీఎస్సీలో తుర్లపాడుకు చెందిన సయ్యద్ రహిమున్ సత్తా చాటారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించారు. దీంతో నాన్ లోకల్ కేటగిరీ కింద సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయిని (ఉర్దూ) గా ఎంపికయ్యారు. తండ్రి టైలర్ కాగా తల్లి గృహిణి. పట్టుదలతో తెలంగాణలో ఉద్యోగం సాధించడం పట్ల పలువురు ఆమెను అభినందించారు.
పొన్నలూరు (మం) ముళ్లమూరివారిపాలెం విద్యార్థి మైథిలి గతనెల 29న రోడ్డు ప్రమాదంలో మరణించింది. దీనికి సంబంధించి నలుగురి ఉపాధ్యాయులపై డీఈవో సుభద్ర సస్పెండ్ చేశారు. 28న బాలిక పల్నాడు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 ఫుల్ బాల్ పోటీలో పాల్గొని, 29న ఒంగోలుకు చేరుకుంది. బస్టాండు నుంచి ఓ వ్యక్తి బైకుపై వెళుతుండగా..ప్రమాదంలో కన్నుమూసింది. దీంతో క్రీడాకారుల పట్ల సరైన రక్షణ తీసుకోలేదని వేటు వేశామన్నారు.
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల్ని మరింత పెంపొందించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థతో, ఏపీ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో మంగళవారం న్యూఢిల్లీలో ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పందాలలో భాగంగా ఒంగోలులలో ప్రాథమిక ఆహార పరీక్షల ప్రయోగశాల రూ. 7.5 కోట్లతో నెలకొల్పనున్నాట్లు మంత్రి తెలిపారు.
ప్రకాశం జిల్లాలోని అన్ని రైతు బజార్ కేంద్రాలలో నిన్నటి నుంచి రాయితీపై టమాటాలు అందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒక కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నామన్నారు. ఒక కుటుంబానికి రెండు కిలోలు మాత్రమే అందిస్తామని, తమ వెంట ఆధార్ జిరాక్స్ లేదా రేషన్ కార్డు జిరాక్స్ను తమ వెంట తీసుకుని రావాలని కోరారు. అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలన్నారు.
రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మంగళవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పనలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్లో భాగంగా జిల్లాను ఏ విధంగా అభివృద్ది చేసుకోవాలన్న విషయంపై ప్రతిఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. అలాగే సి.ఎస్.ఆర్ నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో పరిష్కరించడంతోపాటు తగిన విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వడం కూడా ముఖ్యమని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరించి ఎండార్స్మెంట్ ఇవ్వడంపై ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రివ్యూ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.
గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో పరిష్కరించడంతోపాటు తగిన విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వడం కూడా ముఖ్యమని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరించి ఎండార్స్మెంట్ ఇవ్వడంపై ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రివ్యూ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.
Sorry, no posts matched your criteria.