India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం మంత్రుల త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ఎదురుచూస్తున్న ప్రజలకు ఆశలు చిగురించాయి. 30న మంత్రులు సత్య కుమార్, నిమ్మల రామానాయుడు ప్రకాశం జిల్లాకు వచ్చి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు, ఏయే మండలాలు ప్రకాశం, మార్కాపురంలో కలపాలి అనే దానిపై మీ అభిప్రాయాలు చెప్పవచ్చు.

ప్రకాశం జిల్లాలో మూగ, చెవుడు ఉన్నవారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. అప్లికేషన్కు లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదని.. ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని సూచించారు. ఇంటర్ పూర్తి చేసి సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు కలిగిన వాళ్లు అర్హులు. www.apdascac.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లాలో హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈనెల 27లోగా సమర్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఒక సంవత్సరం కాల పరిమితి గల లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా శిక్షణ అందుతుందన్నారు. ఎస్సీ అభ్యర్థులు అర్హులని, ఇతర వివరాలకు ఎగ్జిక్యూటివ్ అధికారి నంబర్ 9849905970 ను సంప్రదించాలన్నారు.

జిల్లాలో హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈనెల 27లోగా సమర్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఒక సంవత్సరం కాల పరిమితి గల లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా శిక్షణ అందుతుందన్నారు. ఎస్సీ అభ్యర్థులు అర్హులని, ఇతర వివరాలకు ఎగ్జిక్యూటివ్ అధికారి నంబర్ 9849905970 ను సంప్రదించాలన్నారు.

ప్రకాశం జిల్లా లీగల్ మెట్రాలజీ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని జేసీ గోపాలకృష్ణ గురువారం ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని చౌక దుకాణాలపై తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని జేసీ సమావేశంలో అధికారులకు సూచించారు.

విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారికి ఉద్యోగం ఎందుకు? పద్ధతి మార్చుకోకపోతే టెర్మినేట్ చేసేస్తా అంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు. వాస్తవ వివరాలను నమోదు చేయకుండా పలువురు ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు.

జిల్లాల పునర్విభజన మార్పులపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 30వ తేదీన ప్రకాశం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం, కందుకూరును జిల్లాలో కలపడం, ఇతర అంశాలపై మంత్రుల బృందం ప్రజాభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ యాదవ్ జిల్లాకు రానున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షలు తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షల తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 2019 జనవరిలో కొత్తపట్నంలో నిందితుడు చంటి బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీనిపై విచారణ అనంతరం నిందితుడికి శిక్ష పడింది. పోలీసులను ఎస్పీ దామోదర్ అభినందించారు.
Sorry, no posts matched your criteria.