Prakasam

News September 16, 2024

చీరాల వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

చీరాల మండలం జాండ్రపేట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేటపాలెం నుంచి చీరాలకు వెళ్తున్న బైక్ పాదచారుడిని ఢీకొని అదుపుతప్పి అటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాండ్రపేట గుమస్తాలకాలనీకి చెందిన పాదచారుడు ఫణికుమార్ (55) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

News September 16, 2024

పెద్దారవీడు: కొట్లాట ఘటనపై ముమ్మర దర్యాప్తు

image

పెద్దారవీడు మండలం రాజంపల్లి పొలాల్లో <<14111250>>ఆదివారం కర్రల దాడి<<>>లో గాయపడిన బాధితులు మార్కాపురం వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, అల్లూరెడ్డిలు కర్రలతో దాడికి దిగగా.. ఈ దాడిలో కంచర్ల చెన్నకేశవులు, కంచర్ల అంజమ్మ, చరణ్, రామాంజనేయులు, రాములమ్మతోపాటు మరొకరికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటన జిల్లా వ్యప్తంగా సంచలనం రేపగా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

News September 16, 2024

ప్రకాశం: ‘మీకోసం’ తాత్కాలికంగా రద్దు

image

సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా (పబ్లిక్ హాలిడే) జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గుర్తించి దూర ప్రాంతాల నుంచి ఎవరు రావద్దని సూచించారు.

News September 15, 2024

కంభంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

కంభం పట్టణంలోని స్థానిక చెరువు కట్ట సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై ఆదివారం గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రైలు నుంచి జారిపడి మృతి చెందాడ లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News September 15, 2024

ప్రకాశం: 50కేజీల లడ్డు సొంతం చేసుకున్న షేక్ కమల్

image

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఉన్న 50 కేజీల లడ్డును కమిటీ నెంబర్లు వేలం వెయ్యగా.. గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు షేక్ కమల్ వలి రూ.26 వేలకు లడ్డును దక్కించుకున్నాడు. లడ్డును దక్కించుకున్న ముస్లిం యువకుడిని హిందువులు అభినందించారు. ఈ సంఘటన మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పలువురు అన్నారు.

News September 15, 2024

చీరాలలో దారుణం.. వివాహితపై లైంగిక దాడి

image

చీరాల మండలంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీరాల పరిధిలో ఓ మహిళ నివసిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటివద్దకు వచ్చి తలుపులు పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించి వివాహితను బంధించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై బాధితురాలు శనివారం ఈపూరుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

News September 15, 2024

ప్రకాశం: APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ANM/GNM/ BSC-నర్సింగ్ చదివిన వారికి, జపాన్‌ హాస్పిటల్స్‌లో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా అధికారి రవితేజ శనివారం తెలియజేశారు. జపాన్‌లో పనిచేయడానికి ఆసక్తి కలిగి (32)లోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. జపనీస్ బాషలో 6 నెలలపాటు శిక్షణ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఒంగోలు కొత్తపట్నం రోడ్‌లోని స్కిల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News September 14, 2024

ఒంగోలు సంఘమిత్ర వద్ద రోడ్డు ప్రమాదం

image

ఒంగోలు పట్టణంలోనిసంఘమిత్ర ఆసుపత్రి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనకనుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హైవే పోలీసులు వెంకటరామయ్య, రాజాలు, మేదరమెట్ల వద్ద లారీని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సిఉంది.

News September 14, 2024

బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం

image

బాపట్ల జిల్లా యద్దనపూడి మండల పరిధిలోని పూనూరు గ్రామంలో హృదయ విధారక ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పూనూరు గ్రామానికి చెందిన తండ్రీ, కొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఒకేసారి తండ్రీ, కొడుకులు తనువు చాలించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

తిరుపతిలో ప్రకాశం జిల్లా విద్యార్థిపై కత్తితో దాడి

image

ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన విద్యార్థి లోకేశ్‌ తిరుపతి MBU యూనివర్షిటీలో చదువుతున్నాడు. అయితే శనివారం అతను ఓ థియేటర్‌లో సినిమాకు వెళ్లగా.. లోకేశ్‌ పై కార్తీక్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం కార్తీక్‌తోపాటు మరో యువతి కావ్య పరారయ్యారని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తీక్, కావ్యది సూళ్లూరుపేటగా గుర్తించారు.