India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిన్న ఇంటర్ రిజల్ట్స్ విడుదలైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో 63 శాతం ఉత్తీర్ణతతో 19వ స్థానం, సెకండ్ ఇయర్లో 79 శాతంతో 16వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫస్ట్ ఇయర్లో 72 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం, సెకండ్ ఇయర్లో 59 శాతంతో 15వ స్థానంలో నిలిచారు. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యార్థులు ఈ ఏడాది, గత ఏడాదికంటే మంచి మార్కులు సాధించిన ర్యాంకుల విషయంలో ఒక స్థానం కిందకి వెళ్లింది.
ఒంగోలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు తమ సత్తా చాటి జిల్లా స్థాయి ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంపీసీ గ్రూప్లో బండి హర్షిని, కావలి హేమలత, ఎనిమి రెడ్డి సిరి 991/1000 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవగా, బైపీసీలో పాలకీర్తి హారిక 991/1000 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిని కళాశాల బృందం అభినందించింది.
వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కొండపి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్ను శనివారం వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 30 మందిలో ఆదిమూలపు సురేశ్ ఒకరు. కొండపి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా మున్ముందు పనిచేస్తామన్నారు.
సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సంకటి వైష్ణవి జాతీయ స్థాయి INSTO మ్యాథమెటిక్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె శనివారం మంత్రి స్వామిని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇలాంటి విజయాలతో మున్ముందు ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
సోషల్ మీడియా మాధ్యమాలలో ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏఅర్.దామోదర్ శనివారం హెచ్చరించారు. మహిళలపై ఫోన్లలో, సోషల్ మీడియా మాధ్యమాలలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలతో అమర్యాదగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల్లో 96% ఉత్తీర్ణత సాధించిన గురుకుల పాఠశాలల విద్యార్థులకు మంత్రి స్వామి శనివారం అభినందనలు తెలిపారు. ఈ ఉత్తీర్ణత సాధనలో భాగస్వాములైన గురుకుల సంస్థ ఉన్నతాధికారులకు, ఉపాధ్యాయులకు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇలాంటి విజయాలను కొనసాగిస్తూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఇంటర్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 16236 మంది పరీక్షలు రాయగా.. 12863 మంది పాసయ్యారు. 79 శాతం పాస్ పర్సంటేజీతో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే 16వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 18715 మందికి, 11798 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 19వ స్థానంలో ప్రకాశం జిల్లా నిలిచింది.
ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దారు చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం స్వయంగా తానే కారు నడుపుతూ మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తుండగా.. పొదిలి సమీపంలో ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తహశీల్దార్ చిరంజీవికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో కారు ధ్వంసం అయింది.
ప్రకాశం జిల్లాలో ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు రానున్నాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 67 పరీక్షా కేంద్రాల్లో 42,439 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 21,624 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 20,815 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ప్రకాశం జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 67 పరీక్షా కేంద్రాల్లో 42,439 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సర విద్యార్థులు 21,624 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 20,815 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.