India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జలుమూరు మండలం మర్రివలస పంచాయతీ ఎస్టీ మాకివలస గ్రామాన్ని గురువారం మధ్యాహ్నం జిల్లా ఎడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించారు. ఇటీవల జరిగిన గ్రామంలో జరిగిన గొడవలు, కొట్లాట విషయంపై ఎస్టీలు ఇచ్చిన అట్రాసిటీ కేసు దర్యాప్తుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. పలువురు గ్రామస్థులను పిలిపించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
పాతపట్నంలోని మహేంద్ర తనయ నది సమీపంలో గల రైల్వే లైన్ పై గురువారం రౌర్కెల నుంచి గుణుపూర్ వెళ్తున్న రాజా రాణి ఎక్స్ప్రెస్ ట్రైన్ నాలుగు ఆవులను ఢీ కొట్టింది. ఈ ఘటనను పాతపట్నం వాసి గంటెడు చిన్నముడు చెందిన రెండు ఆవులు చనిపోగా, మరో రెండు ఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వీఆర్వో ఘటనా స్థలాన్ని పరిశీలించి రిపోర్టు రాసుకున్నారు. ఒక్కో ఆవు విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు.
ప్రభుత్వ వసతి గృహంలో చదువుకుంటూ బచ్చల బుజ్జి ఇండియన్ నావీ ఉద్యోగం సాధించింది. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం మెళియాపుట్టి గ్రామానికి చెందిన బుజ్జి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి రాధమ్మ కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను చదివిస్తోంది. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాలలోనే విద్యాభ్యాసం చేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో నావీ పోటీ పరీక్షల్లో సత్తా చాటింది.
టెక్కలి సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన తల్లి లీలావతి, సోదరుడు దువ్వాడ శ్రీధర్లు గురువారం హాజరయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి వేసిన డొమెస్టిక్ వయలెన్స్ పిటిషన్పై వారు కోర్టుకు వెళ్లారు. కొద్ది రోజులు క్రితం దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య వాణి కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లతో పాటు సిబ్బంది 24గంటలు విధి నిర్వహణలో ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి బుధవారం ఆదేశించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వైద్య సిబ్బందితో బుధవారం జరిగిన టెలికాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. వైద్యసిబ్బందికి మంజూరు చేసిన సెలవులు గురువారం నుంచి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తక్షణమే విధుల్లోకి చేరాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్ట చేసింది. దావా తుఫాను నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ జిల్లాలోని యంత్రాలను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావం ఇచ్ఛాపురం ప్రాంతంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో వర్ష తీవ్రతను తెలుసుకునేందుకు తీర ప్రాంతంలో మండలానికి ఒక డ్రోన్ అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వివరించారు.
వైసీపీ జిల్లా అన్ని స్థాయిల కమిటీలను త్వరలోనే ఎంపిక చేయనున్నట్లు పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులతో శ్రీకాకుళంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కమిటీలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించేలా ఉండాలని అభిప్రాయాలు తీసుకున్నారు. వీలైనంత త్వరగా కమిటీలు నియమించి, ప్రకటించాలని తీర్మానించారు.
శ్రీకాకుళం నగరంలోని 80 ఫిట్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై కారును అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందినట్లు అక్కడి స్థానికులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించి, గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ KV మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డిపిఎస్, సైబర్, ఎన్బిడౌబ్లు, ప్రాపర్టీ, క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ తదితర కేసులపై సమీక్షించారు.
హైదరాబాద్లో పెయింటింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సిక్కోలు వాసి గుండెపోటుతో మృతిచెందాడు. టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ సొర్లిగాం గ్రామానికి చెందిన కూన గణపతిరావు (39) బుధవారం HYDలో గుండెపోటుతో మృతిచెందాడు. గత కొన్నేళ్లుగా జీవనోపాధి కోసం హైదరాబాద్కు వెళ్లిన ఆయన మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం నాటికి మృతదేహం స్వగ్రామం చేరుకుంటుందని గ్రామస్థులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.