India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జలుమూరు మండలం కరవంజ పంచాయతీ తుంబయ్య పేట గ్రామానికి చెందిన రవికిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పలాసలో విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. గురువారం నందిగామ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల నరసన్నపేటలో జరిగిన డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లో ఎంపైర్గా సేవలు అందించారు. వైఎంసీఏ కార్యదర్శి గొద్దు చిట్టిబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం, పలాస మీదుగా హైదరాబాద్(HYD)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నం.07165 HYD- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని బోదేపల్లి రాజగోపాల్ నగర్కి చెందిన జ్యోత్స్నకి రెండు రోజులు కిందట వెలువడిన ఫలితాలో మూడు బ్యాంకు ఉద్యోగాలు, ఎల్ అండ్ టి కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్గా ఎంపికైంది. ఈమె తల్లితండ్రులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. జ్యోత్స్నకి పలువురు అభినందించారు.
విశాఖపట్నంలోని మధురవాడలో బుధవారం నవీన్ అనే ప్రేమోన్మాది దీపిక, ఆమె తల్లి లక్ష్మిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. పారిపోతున్న నిందితుడు నవీన్ను SKLM జిల్లా బూర్జలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత స్పందించారు. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి విశాఖకు తరలించారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డి హరినాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగనట్లు ఆయన చెప్పారు. ఆమె వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందన్నారు. వివరాలు తెలిస్తే ఈ నంబర్ను 9989136143 సంప్రదించాలని ఆయన చెప్పారు.
వేటకెళ్లి మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేటకెళ్లిన బుంగ ధనరాజు, వంక కృష్ణ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, మత్స్య శాఖల నుంచి వేరువేరుగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చెరో రూ. పది లక్షలను ఆ కుటుంబాలకు త్వరలో అందజేస్తామన్నారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
సముద్రంలో గల్లంతైన వజ్రపుకొత్తూరు(M) మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన మత్స్యకారుల మృతదేహాలు బుధవారం ఉదయం అక్కుపల్లి, డోకులపాడు బీచ్ల వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఏప్రిల్ 1వ తేదీన నలుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగా.. బుంగ ధనరాజు, వంక కృష్ణా గల్లంతై మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ & ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 7 వరకు 4 శిక్షణా కేంద్రాల్లో తర్ఫిదుకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు D.R.D.A ప్రతినిధి p. కిరణ్ కుమార్ తెలిపారు. ఎంపిక ప్రక్రియకు 10th, ఇంటర్మీడియట్ విద్యార్హతలు ఉండాలి అని తెలిపారు.
జలుమూరు మండలంలో మార్చి 29వ తేదీ రాత్రి వివిధ ఆలయాల గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాతలు రాశారు. ఈ మేరకు స్పందించిన ఎస్పీ, రాతలకు సంబంధించిన వ్యక్తుల వివరాలు తెలియజేసిన వారికి రూ. 25వేల నగదు పురస్కారం బహుమతిగా ఇస్తామని మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు తెలియజేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో టెన్త్ క్లాస్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. 151 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ తిరుమల చైతన్య తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 129 మంది, 22 మంది ప్రైవేట్ విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. జిల్లాలో పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.
Sorry, no posts matched your criteria.