India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలికి చెందిన యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ త్రిపురాన విజయ్తో ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్లేయర్ ధోనీ ముచ్చటించారు. చపాక్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ధోనీని విజయ్ కలిశారు. ఈ సందర్భంగా మొదటిసారి ఐపీఎల్కు ఎంపికైన విజయ్ను ధోనీ అభినందించారు.
ఇటీవల విడుదల అయిన SSC CGL ఫలితాల్లో సోంపేట మండలం బారువకొత్తూరులోని మత్స్యకార కుటుంబానికి చెందిన గురుమూర్తి సత్తా చాటారు. ఆల్ ఇండియా స్థాయిలో 374వ ర్యాంక్ సాధించి కేంద్రం ప్రభుత్వంలో ఉద్యోగం సాధించారు. కస్టమ్స్ విభాగంలో ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ వచ్చినట్లు సన్నిహితులు తెలిపారు. దీంతో అతని తల్లిదండ్రులు శకుంతల, మోహనరావు ఆనందం వ్యక్తం చేశారు. అతనికి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన, పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారుల సెలవులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ రద్దు చేశారు. వచ్చే 48 గంటల పాటు కలెక్టరేట్లో 08942-20557 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోంపేట మండలంలో అధిక వర్షపాతం పడే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు.
ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఓ వివాహిత శనివారం తన అత్త వారి ఇంటి ముందు నిరసన చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బుడ్డిపేటకి చెందిన మెట్ట గోపాలకృష్ణతో పోలవరం గ్రామానికి చెందిన రాణికి 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండేళ్లుగా రాణి తన కన్నవారింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో అత్తవారి ఇంటికి వెళ్లగా వారు లోనికి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ కాంట్రాక్ట్ ఉద్యోగులు శనివారం రాత్రి నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో కలిశారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. సమగ్ర శిక్ష అభియాన్లో 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కేవలం రూ. 17 వేలను మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలకు గౌరవ వేతనం చాలడం లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం తుపాన్ ప్రభావం లేనప్పటికీ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. శనివారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.
వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో శుక్రవారం నెమళ్లు సందడి చేశాయి. గ్రామం సమీపంలోని కొండల ప్రాంతం నుంచి నెమళ్లు గ్రామానికి చేరుకుని గ్రామంలోని చెట్లపై కనిపిస్తూ కనువిందు చేశాయి. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన నెమళ్లు జనావాసాల్లోకి వస్తుండటంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా నెమళ్లు రాక గ్రామస్థులకు ఆహ్లాదాన్ని ఇచ్చింది.
పలాస, శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే షాలిమార్- వాస్కోడగామా(VSG) అమరావతి ఎక్స్ప్రెస్ రైళ్ల గమ్యస్థానంల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున ఈనెల 17- 28 వరకు నం.18047 SHM- VSG రైలు వాస్కోడగామాకు బదులుగా హుబ్లీ వరకు వెళ్లనుంది. ఈ నెల 20 నుంచి మే 1 వరకు నెం.18048 VSG- SHM రైలు వాస్కోడగామాకు బదులుగా హుబ్లీ నుంచి నడుస్తాయన్నారు.
మెగా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ, ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ) అభ్యర్థులకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ శ్రీకాకుళం ఉచిత ఆన్లైన్ శిక్షణను అందించనున్నట్లు సంస్థ సంచాలకులు ఈ.అనురాధ తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Dr.BR.అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పరిధిలోని అఫిలియేషన్ డిగ్రీ కళాశాలల 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు యూజీ ఎగ్జామినేషన్స్ డీన్ పి.పద్మారావు వివరాలు వెల్లడించారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. 54 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రెగ్యులర్, సప్లిమెంటరీ విధానంలో 9,000 మంది వరకు పరీక్షలకు హాజరు కానున్నారు.
Sorry, no posts matched your criteria.