Srikakulam

News August 22, 2025

శ్రీకాకుళంలో స్పెషల్స్ కోర్టు ఏర్పాటుకు ఆమోదం

image

శ్రీకాకుళంలో స్పెషల్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గురువారం విజయవాడలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భారత ఉన్నత న్యాయస్థానం క్రిమినల్ రిట్ పిటీషన్ నెంబరు 511 ఆఫ్ 2024లో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోర్టు ఏర్పాటు చేయనున్నారు. మావోయిస్ట్ కేశవరావుపై విచారణ చేస్తున్న16 కేసులపై 7 వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టుగా నియమించే ప్రతిపాదనకు ఆమోదం దక్కింది.

News August 22, 2025

ఎచ్చెర్ల: నేడు పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్

image

ఎచ్చెర్లలోని చిన్నరావుపల్లి వద్ద పోలీస్ ఫైరింగ్ గ్రౌండ్‌లో శుక్రవారం జిల్లా పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేయనున్నట్లు రిజర్వ్ ఇన్స్పెక్టర్ శంకర్ ప్రసాద్ తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్షిక శిక్షణలో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరవుతారన్నారు.

News August 22, 2025

శ్రీకాకుళం SC యువతకు హెవీ వాహన డ్రైవింగ్ శిక్షణ

image

జిల్లాకు చెందిన షెడ్యుల్డ్ కులాల యువతీ–యువకులకు భారీ వాహన డ్రైవింగ్ శిక్షణ కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు చెందిన 10 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల వయస్సు 20-40 ఏళ్లతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వివరాలకు జిల్లా షెడ్యుల్డ్ కులాల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News August 22, 2025

శ్రీకాకుళం SC యువతకు హెవీ వాహన డ్రైవింగ్ శిక్షణ

image

జిల్లాకు చెందిన షెడ్యుల్డ్ కులాల యువతీ–యువకులకు భారీ వాహన డ్రైవింగ్ శిక్షణ కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు చెందిన 10 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల వయస్సు 20-40 ఏళ్లతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వివరాలకు జిల్లా షెడ్యుల్డ్ కులాల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News August 22, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే న్యూస్ ఇవే..!

image

జిల్లాలోని పలు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద అంగన్వాడీల నిరసన.
శ్రీకాకుళం జిల్లాకు మళ్లీ వర్షసూచన.
గణేష్ మండపాలపై అనుమతి తప్పనిసరి: జిల్లా ఎస్పీ.
బారువ: పర్యాటక ప్రాంతంపై పర్యవేక్షణ కరువు.
కోటబొమ్మాళి జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి.
దైవ దర్శనానికి వెళ్లినా తప్పుగా చిత్రీకరించారు: ఎమ్మెల్యే కూన.
కొత్తూరు: పీడిస్తున్న బురదనీటి సమస్య.

News August 21, 2025

టెక్కలి: సెప్టెంబర్ 1 నుండి డిగ్రీ తరగతులు ప్రారంభం!

image

ఎట్టకేలకు డిగ్రీ ఫస్టియర్ కోర్సులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 20 నుండి 26 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్స్ కొరకు 24 నుండి 28 లో తేదీ వరకు, సీట్ల కేటాయింపు 31 వ తేదీన ఉంటుంది. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జిల్లాలో ఉన్న 15 ప్రభుత్వ, 74 ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు రావడంతో ప్రవేశాలపై ప్రిన్సిపాళ్ళు, సిబ్బంది దృష్టి సారిస్తున్నారు

News August 21, 2025

పైడిభీమవరంలో బాలికతో అసభ్య ప్రవర్తన: ఎస్సై

image

రణస్థలం (M) పైడిభీమవరానికి చెందిన 9వ తరగతి బాలికతో ఇప్పిలి సతీశ్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో J.R.పురం పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక మంగళవారం రాత్రి ఇంటి వద్ద ఉన్న సమయంలో కనిమెట్టకు చెందిన సతీశ్ మద్యంతాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై ఎస్సై చిరంజీవి పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News August 21, 2025

శ్రీకాకుళం జిల్లా పశువైద్యాధికారికి రాష్ట్ర స్థాయి పురస్కారం

image

మూగజీవాల వైద్య సేవలో విశేష సేవలందించినందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన డా. లిఖినేని కిరణ్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశువైద్యాధికారి పురస్కారం అందుకున్నారు. బుధవారం విజయవాడలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డైరెక్టర్ దామోదర్ నాయుడు ఆయనకు ఈ అవార్డును శాలువాతో సన్మానించి బహుకరించారు. పశువైద్య రంగంలో చేసిన కృషికి మరింత గుర్తింపు లభిస్తుందని అధికారులు అభినందించారు.

News August 20, 2025

జలుమూరు: ఉపరాష్ట్రపతి పోటీలో నాయుడు గారి రాజశేఖర్ నామినేషన్ ఆమోదం

image

భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసిన నాయుడు గారి రాజశేఖర్ నామినేషన్ బుధవారం రాజ్యసభ ఎన్నికల అధికారి ఆమోదించారు. నామినేషన్ అనుమతి పత్రం అందుకున్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తాను పోటీ చేసే ప్రధాన కారణం తన గ్రామాన్ని ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమేనని చెప్పారు. దక్షిణకాశీగా పేరుగాంచిన పవిత్ర శ్రీముఖలింగ క్షేత్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాజశేఖర్ స్పష్టం చేశారు.

News August 20, 2025

ట్రంప్ నిర్ణయాలతో ఆక్వా ఎగుమతులకు దెబ్బ: పివిఎన్ మాధవ్

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల ఐదు వేల కోట్ల రూపాయల ఆక్వా కల్చర్ ఉత్పత్తులు ఎగుమతులకు నోచుకోలేకపోయాయని తెలిపారు. సముద్రంలోనే అవి నిలిచిపోయాయని అన్నారు. నేటి సమాజానికి స్వదేశీ ఉద్యమం మళ్లీ రావాలని ఆకాంక్షించారు.