India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జలుమూరు మండలంలో పలు దేవాలయాలలో ఉగాది పర్వదినాన అన్యమత ప్రచారాలు నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలలో వివిధ అన్యమత ప్రచారకులుపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు గ్రామాలలో జరిగిన సంఘటనలపై ఆయన ఆరా తీశారు. ఆయనతోపాటు క్రైమ్ ASP శ్రీనివాసరావు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత శుక్రవారం దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు వివరాల ప్రకారం.. కవిటి (మ) ఆర్.కరపాడుకు చెందిన మీనా, భర్త దిలీప్తో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా దుండగలు బీరు సిసాలతో తమపై దాడి చేశారని దిలీప్ చెప్పాడు. గాయపడిన మీనాక్షిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ఎస్సై రవివర్మ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.
ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు శనివారం తెలిపారు. మృతుడు శ్రీకాకుళం పట్టణం గునాపాలెంకు చెందిన రమణారావు(49)గా గుర్తించారు. శుక్రవారం నుంచి రమణారావు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ట్రాక్పై విగతజీవిగా పడి ఉన్న రమణను చూసి నిశ్చేష్ఠులయ్యారు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యా విధానంలో B.A, B.Com డిగ్రీ విద్యనభ్యసించేందుకు దరఖాస్తుకు ఆఖరు తేది మార్చి 31తో ముగుస్తుందని శనివారం కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ డాక్టర్ టి. గోవిందమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల ఇంటర్మీడియట్, ఐటీఐ ఉత్తిర్ణీత అయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.
తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తుని- అన్నవరం స్టేషన్ మధ్య రైలు నుంచి జారిపడి ఓ వృద్ధురాలు మృతి చెందిందని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం తెలపగా.. మృతురాలు పలాసకు సమీపంలోని సైలాడ గ్రామానికి చెందిన అట్టాడ సరస్వతమ్మ (70)గా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు.
అట్రాసిటీ చట్టాలను పటిష్ఠ అమలు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం (పిసిఆర్ & పిఓఏ యాక్ట్) పై జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీతో ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, నరసన్నపేట పేట శాసన సభ్యులు బగ్గు రమణమూర్తితో కలసి సమీక్ష నిర్వహించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను శుక్రవారం సాయంత్రం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన పలు పెండింగ్లో ఉన్న పనులపై కలెక్టర్తో ఎమ్మెల్యే చర్చించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పలాస, శ్రీకాకుళం మీదుగా హైదరాబాద్(HYB)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07165 HYB- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మురపాక గ్రామానికి చెందిన వమరవెల్లి మణి బాబును జిల్లా బాలహక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శిగా శుక్రవారం రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదర్ నియమించారు. ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడుతూ.. బాలల హక్కుల కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. బాల కార్మికులను గుర్తించడం, పాఠశాలల్లో డ్రాప్ ఔట్లను తగ్గించడం తన ప్రథమ కర్తవ్యం అని అన్నారు.
పక్షుల రక్షణకు విద్యార్థులు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బూరగాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల, గ్రామాలలో పక్షుల కోసం ప్రత్యేకంగా తొట్టెలు, కొబ్బరి చిప్పల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎండకు స్పృహ తప్పి పడిపోయిన పక్షికి విద్యార్థులు నీరు తాగించి రక్షించారు. దీంతో పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.