India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా కోర్టుల పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక పరీక్షల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా నిరుద్యోగులను హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కంప్యూటర్ ఆధారిత పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం రాత్రి అధికారకంగా వెల్లడించారు. వాతావరణ శాఖ సూచనలతో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని మండల స్పెషల్ ఆఫీసర్స్తో నేరుగా ఫోన్లో కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ మాట్లాడారు. లోతట్టు ప్రాంతలు ప్రజలను అప్రమత్తం చేయాలని వారికి సూచించారు. ఇవాళ రాత్రి అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి సచివాలయంలో ఇద్దరు డ్యూటీలో ఉండాలని, పాటపట్నం,మెళియాపుట్టి, కంచిలి ప్రాంతాల్లో పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కంట్రోల్ రూమ్ డ్యూటీలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు.
➤ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నాగావళి, వంశధార
➤ భారీ వర్షాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
➤ ఎడతెరిపి లేని వానలకు జిల్లాలో పలు చోట్ల నీట మునిగిన పంటలు
➤ శ్రీకాకుళం: కేజీబీవీ ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం
➤రైతుల సమస్యలు పట్టవా: తిలక్
➤పలాసలో జలమయమైన రోడ్లు
➤ అధ్వానంగా కె కొత్తూరు సర్వీస్ రోడ్డు
➤మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: కలెక్టర్
➤ సంతబొమ్మాళి: వర్షాలతో నౌపాడ ఉప్పునకు ముప్పు
జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్ సోమవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు, భవనాళ శాఖ, పంచాయతీరాజ్, ఫైర్ విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు. అల్పపీడనం కొనసాగుతున్నందున ఎక్కడ నిర్లక్ష్యం వహించరాదని తెలియజేశారు.
శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు 43 వినతులు ఎస్పీకి సమర్పించారు. నిర్లక్ష్యం వహించకుండా, త్వరితగతిన ఆయా ఫిర్యాదులపై విచారణ జరిపి, అర్జీదారులు సంతృప్తి పొందేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. జూమ్ ద్వారా ఆయా పోలీస్ అధికారులతో మాట్లాడారు. న్యాయపరమైన చట్టపరమైన అంశాలను పరిశీలించాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 30 మండలాల్లో 16 మండలాల్లో కురిసిన భారీ వర్షాలు పడ్డాయి. సోమవారం మధ్యాహ్ననానికి జిల్లా మొత్తం మీద 138.6 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 4.4మి.మీ రికార్డు అయింది. వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువుల్లో, కాలువుల్లో నీరు చేరుతుంది.
పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్గా పని చేస్తూ ఇటీవల కవిటికి బదిలీ అయిన సౌమ్య సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటికే ఈమె బదిలీ వివాదం కొనసాగుతోంది. పలు యూనియన్లు ఈమెకు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సూసైడ్ కలకలం రేపుతుంది. శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తీరం దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇప్పటికే సంబంధిత అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో వర్షాల నేపథ్యంలో సోమవారం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్ చిన్నారులకు సెలవు ప్రకటించినట్లు ఐసీడీఎస్ పీడీ ఐ.విమల తెలిపారు. అయితే కార్యకర్తలు, సహాయకులు కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా స్టాక్ నిల్వలను భద్రంగా ఉంచాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. సిబ్బందిపై సూపర్వైజర్లు పర్యవేక్షణ చేయాలని ఆమె స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.