Srikakulam

News September 16, 2024

ఓడినా అప్పలరాజుకు బుద్ధి రాలేదు: మంతెన

image

రాష్ట్రంలో ఎమ్మెల్సీ సీట్ల సంఖ్యనే తెలియని మాజీ మంత్రి అప్పలరాజు ఎంబీబీఎస్ సీట్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండడిపడ్డారు. ‘అప్పలరాజు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. అందుకే చంద్రబాబు మెడికల్ సీట్లు తగ్గించేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. పలాస ప్రజలు ఆయనను ఓడించినా బుద్ధి రాలేదు. ఇప్పటికైనా అప్పలరాజు నోరు తగ్గించుకోవాలి’ అని మంతెన సూచించారు.

News September 16, 2024

శ్రీకాకుళం: బదిలీపై జిల్లాకు ముగ్గురు డీఎస్పీలు

image

శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై ముగ్గురు డీఎస్పీలు వస్తున్నట్లు ఆదివారం మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి డీజీపీ ద్వారకాతిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. సీఐడీ డీఎస్పీగా ఉన్న ఎ.బి.జి. తిలక్ కాశీబుగ్గ డివిజన్‌కు, ఏఎన్టీఎఫ్ వెయిటింగ్ అటాచ్ గా ఉన్న డీఎస్పీ బి.రాజశేఖర్ శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్‌కు, వెయిటింగ్ డీఎస్పీగా ఉన్న ప్రసాద్ డీపీటీసీకి బదిలీపై రానున్నారన్నారు.

News September 15, 2024

LHMS సేవను ప్రజలు వినియోగించుకోవాలి: SP

image

జిల్లా ప్రజలు ఎవరైనా తమ ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లేటప్పుడు మీ ఇంటి భద్రత కోసం జిల్లా పొలీసు వారి వద్దనున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం అనే టెక్నాలజీని వినియోగించుకోవాలని SP మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఈ సేవ పూర్తిగా ఉచితమన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్స్ లో ఉన్న ” LHMS AP Police” యాప్ ను డౌన్లోడ్ చేసి మీ వివరాలను ఫిల్ చేయాలన్నారు. తద్వారా సేవలు అందుతాయన్నారు.

News September 15, 2024

SKLM: ఇక మండలానికి ఒక్క MEO ఉండనున్నారా..?

image

వైసీపీ ప్రభుత్వ హయాంలో మండలానికి ఇద్దరు ఎంఈఓలు విధానానికి తాజాగా కూటమి ప్రభుత్వం స్వస్తి పలకనుందనే సంకేతాలు కనిపిస్తాయి.. ఇక ఒక్క ఎంఈఓతోనే మండల విద్యాశాఖను పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం స్కూల్ కాంప్లెక్స్‌లను పటిష్ఠం చేయనుంది. జిల్లాలోని శ్రీకాకుళం,టెక్కలి,పలాస డివిజన్ల పరిధిలోని 38 మండలాల్లో ఇక ఒక్కరే ఎంఈఓ ఉండనున్నారు అనే సమాచారం జిల్లా అధికారులకు చేరింది.

News September 15, 2024

నరసన్నపేట: మద్యం సీసాలో బొద్దింక

image

మద్యం సీసాలో బొద్దింకని చూసి మందుబాబు నివ్వెరపోయాడు. కోమర్తి గ్రామానికి చెందిన అప్పన్న నరసన్నపేట బండివీధి సమీపంలో ఓ ప్రభుత్వ దుకాణంలో ఈ నెల 12న మద్యంసీసా కొనుగోలు చేశాడు. అనంతరం పరిశీలించగా అందులో బొద్దింక కనిపించింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎక్సైజ్ సీఐ లక్ష్మి వద్ద ప్రస్తావించగా తమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

News September 15, 2024

శ్రీకాకుళం: రేపు ఫిర్యాదులు స్వీకరణ రద్దు

image

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మీకోసం వినతుల స్వీకరణ కార్యక్రమం రేపు మిలాదిన్ నబీ ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా వినతుల స్వీకరణ కార్యక్రమం సెప్టెంబరు 16న నిర్వహించడం లేదని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 15, 2024

శ్రీకాకుళం: ఈనెల 17న విశ్వకర్మ జయంతి వేడుకలు

image

విశ్వకర్మ భగవానుడి గొప్పతనాన్ని గుర్తించి రాష్ట్ర పండుగగా 2024 సెప్టెంబర్ 17వ తేదీన “విశ్వకర్మ జయంతి”ని జరుపుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. సెప్టెంబరు 17న మంగళవారం కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, కుల పెద్దలు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

News September 15, 2024

SKLM: పర్యాటక అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని 2023-24కు గాను ప్రకటించిన వివిధ అవార్డులకు అర్హులైన పర్యాటక సంబంధిత రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మొత్తం 38 విభాగాల నుంచి 41 అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తులను ఏపీ టూరిజం వెబ్సైట్ www.aptourism.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని పూర్తి సమాచారం ఉందన్నారు.

News September 15, 2024

పోలాకి: జీడి తోటలో 12 అడుగుల కొండచిలువ హల్‌చల్

image

నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాం గ్రామంలో ఆదివారం ఉదయం కొండ చిలువ కలకలం రేపింది. మబగాం గ్రామానికి చెందిన రైతు ఆసిరినాయుడు ఉదయాన్నే జీడి తోటకు వెళ్లాడు. పొలంలో సంచరిస్తున్న12 అడుగుల కొండచిలువ రైతుపై దాడి చేసింది. చాకచక్యంగా కట్టెతో కొట్టి చంపాడు.

News September 15, 2024

SKLM: ముగిసిన లోక్ అదాలత్

image

న్యాయమూర్తులు కేసులు రాజీ చేయడంలో ఎంతగానో కృషి చేశారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైడ్‌ అహమ్మద్‌ మౌలానా అన్నారు. శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సివిల్‌ కేసులు 121, క్రిమినల్‌ కేసులు 1477, పిఎల్‌సి 121లు రాజీ అయ్యాయని అన్నారు. రాజీ ద్వారా ఇరు పార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజీయే రాజ మార్గమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని న్యాయమూర్తులు ఉన్నారు.