Srikakulam

News June 28, 2024

శ్రీకాకుళం: ప్రియుడు మోసం.. బాలిక ఆత్మహత్యాయత్నం

image

ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో మోసపోయిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎచ్చెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినికి అదే గ్రామానికి చెందిన జగదీశ్ ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. శారీరకంగా దగ్గరవడంతో విద్యార్థిని గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని కోరగా జగదీశ్ ముఖం చాటేయడంతో బాలిక యాసిడ్ తాగింది. బాలిక పరిస్థితి విషమం ఉందని పోలీసులు తెలిపారు.

News June 28, 2024

జగన్ గురించి విస్తుపోయే నిజాలు తెలిశాయి: మంత్రి అచ్చెన్న

image

జగన్ వింత ప్రవర్తనపై మాజీ CS ఎల్వీ సుబ్రహ్మణ్యం ద్వారా విస్తుపోయే నిజాలు తెలిశాయని మంత్రి అచ్చెన్న ట్వీట్ చేశారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ తొలగించి అక్కడ రాజధాని కట్టేద్దామంటూ పిచ్చి సలహాను నాడు సీఎంగా ఉన్న జగన్ ఎల్వీ ముందు పెట్టారని అచ్చెన్న వ్యాఖ్యానించారు. ఈ మేరకు జగన్ మనస్తత్వం గురించి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడిన వీడియోను అచ్చెన్న Xలో పోస్ట్ చేశారు.

News June 28, 2024

కేరళలో కవిటి మండల వాసి మృతి

image

ప్రమాదవశాత్తు కవిటి మండల యువకుడు కేరళలో మృతి చెందిన ఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. జి.కరాపాడ గ్రామానికి చెందిన సురేశ్ అలియాస్ కాళీ ఉదయం తాను పని చేస్తున్న ప్రదేశం నుంచి జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సురేశ్‌కు ఇటీవల పెళ్లి నిశ్చయమైనట్లు కుటుంబీకులు తెలిపారు.

News June 28, 2024

శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త

image

జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది జిల్లాలోని మొత్తం 93 ఇంటర్ కళాశాలలోని మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 8,420 మంది ఉండగా, మొదటి ఏడాదిలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. జులై 15 నాటికి పుస్తకాలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

News June 28, 2024

సోంపేట: నాటుసారా తయారీని అరికట్టేందుకు దాడులు

image

సోంపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ జై భీమ్ సిబ్బందితో కలిసి మందస మండలంలోని కొండలోగాం పంచాయతీలోని నాటుసారా తయారీని అరికట్టేందుకు గురువారం సాయంత్రం దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బెల్లపు ఊటలను ధ్వంసం చేసినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అనంతరం గ్రామంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1900 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు.

News June 27, 2024

శ్రీకాకుళం: బీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఆగస్టు 13, 14, 16, 17 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News June 27, 2024

కంచిలి: ఎస్‌బీఐ ఫలితాల్లో యువకుడి ప్రతిభ

image

కంచిలి మండలం చిన్న శ్రీరాంపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన లోళ్ళ కాళీ ప్రశాంత్ గురువారం విడుదలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ ఫలితాలలో ప్రతిభ కనబరిచాడు. ప్రాథమిక, ఉన్నత విద్య గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి ఉన్నత చదువులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ SBIలో ఉద్యోగం సాధించాడు. యువకుడి విజయం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

News June 27, 2024

కవిటి: కేరళలో కరాపాడు వలస కూలీ మృతి

image

కవిటి మండలం జి.కరాపాడ గ్రామానికి చెందిన నర్తు కాళీప్రసాద్ మృతి చెందారు. మృతుడు 4 రోజుల క్రితం కేరళ రాష్ట్రానికి వలస కూలీగా వెళ్లి గురువారం ఉదయం తాను పనిచేస్తున్న చోట పైనుంచి జారిపడి తలకు బలమైన గాయమవ్వడంతో మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు. కాళీప్రసాద్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైందని, ఇంతలోనే ఇలా జరిగే సరికి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News June 27, 2024

శ్రీకాకుళం: ప్రత్యేక రైళ్లను పొడిగించిన రైల్వే అధికారులు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా న్యూ టిన్‌సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జూలై 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి మంగళవారం, నం.05951 SMVB- NTSK రైలును జూలై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News June 27, 2024

శ్రీకాకుళం: పీజీ పరీక్షలు రాసిన వారికి ముఖ్య గమనిక

image

ఆంధ్ర యూనివర్శిటీ పరిధిలో మే- 2024లో నిర్వహించిన MSC (హోమ్ సైన్స్)నాలుగవ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.