India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో మద్ది జగన్మోహిని (34) అనే మహిళ సోమవారం మృతి చెందింది. టెక్కలి మండలం భగవాన్ పురం గ్రామానికి చెందిన మహిళ డెంగ్యూ జ్వరంతో కొన్ని రోజులుగా రిమ్స్లో చికిత్స పొందుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా భగవాన్పురం గ్రామంలో జ్వరాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, వైద్య శిబిరాలు నిర్వహించినా ఫలితం కనిపించడం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
మెలియాపుట్టి(M) సానిపాలెం, సవర సానిపాలెం గ్రామాల పేర్లు మార్చాలని సోమవారం ఆయా గ్రామస్థులు జిల్లా అధికారులకు వినతిపత్రం అందించారు. తమ గ్రామాల పేర్లు పలికేందుకు అసభ్యకరంగా ఉండడంతో గ్రామస్థులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పూర్వం ఒరిస్సా రాష్ట్రం పర్లాఖిమిడి రాజవంశీయులు ఈ ప్రాంతంలో ఒంపుడుగత్తెలను ఉంచి వారికి మాన్యం కింద భూములు ఇచ్చారు. ఆనాటి నుంచి ఈ ఊర్లను ఆ పేర్లతో పిలిచేవారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సర ప్రవేశాలకు సెప్టెంబర్ 3వ తేదీ తుది గడువు. ఈ మేరకు అన్ని కళాశాలకు ఉన్నత విద్యా మండలి నుంచి ఆదేశాలు రావడంతో సంబంధిత ప్రిన్సిపాల్స్, సిబ్బంది ప్రవేశాలపై దృష్టి సారించారు. వాస్తవానికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా గడువు పొడిగింపుతో సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. 2025 ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు వరి, ఇతర పంటలు మొత్తం 3,73,000 ఎకరాలలో సాగు చేశారని తెలిపారు. ఈ సాగు కోసం మొదటి, రెండో విడతలలో కలిపి 20,481 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమయ్యిందని కలెక్టర్ వివరించారు. రైతుల అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన హామీ ఇచ్చారు.
జిల్లాలోని బాలబాలికల హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో బాలల సమస్యలు, పోక్సో చట్టం, మహిళలకు రక్షణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా చిల్డ్రన్ కమిటీలు, ఫిర్యాదుల బాక్స్లు, ఈగల్క్లబ్స్, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, ప్రొటెక్షన్ కమిటీ ఉండాలన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో జిల్లా అధికారులను సోమవారం మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి నదులలో ప్రవాహ పరిస్థితులపై మంత్రి అచ్చెన్న అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను కోరారు. గ్రామ స్థాయిలో అధికారులు పర్యవేక్షించాలని కోరారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే మూడు రోజులు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తన అధికార ఖాతా ద్వారా తెలిపింది. పాలకొండ, బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల్లో ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
శ్రీకాకుళం జిల్లాలోని అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, క్లినిక్లు, ల్యాబ్లు, ART సెంటర్లు తప్పనిసరిగా నైతిక, చట్టబద్ధమైన నియమ నిబంధనలను పాటించాలని డీఎంహెచ్ఓ అనిత ఆదేశించారు. ఆయా ఆసుపత్రులు అందించే వైద్య సదుపాయాలు, వైద్య పరీక్షలకు సంబంధించిన ధరల పట్టికను తప్పనిసరిగా ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని ఆమె సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో శాంతి, సామరస్యం పెంపొందించడమే మత సామరస్య కమిటీ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన జిల్లా మత సామరస్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్య అపార్థాలు, విభేదాలు రాకుండా కమిటీ కృషి చేయాలని ఆయన సూచించారు. పండుగలు శాంతియుతంగా, మత సామరస్యంతో జరుపుకోవాలని, ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని కోరారు.
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్కు జిల్లా నలుమూలల నుంచి 64 దరఖాస్తులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. అందులో రెవెన్యూ శాఖకు గరిష్ఠంగా 21, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ కి 13, పంచాయతీరాజ్ కి, పంచాయతీరాజ్ విద్యుత్తు సంస్థకు సంబంధించి 5 దరఖాస్తులు అందాయి.
Sorry, no posts matched your criteria.