Srikakulam

News April 18, 2026

అరసవెల్లి నకిలీ పాసులు ముద్రించిన నిందితుల అరెస్ట్

image

అరసవెల్లి రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసులు వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఆరుగురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న మణికంఠ జిరాక్స్‌లో నకిలీ పాసులు ముద్రించినట్లు నిర్ధారించారు. నిందితుల్లో మణికంఠ జిరాక్స్ షాప్ యజమానులు కొండలరావు, మణికంఠ, సంతోష్‌తో పాటు హరి ప్రసాద్, శీను, రాజు ఉన్నట్లు వన్ టౌన్ ఎస్ఐ హరికృష్ణ తెలిపారు.

News April 18, 2026

నాడు శ్రీకాకుళం కలెక్టర్.. నేడు స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ఉత్తమ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ చంద్ర పునేఠా నేడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. 1993-96 మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి సీఎస్ స్థాయికి చేరారు. ప్రస్తుతం విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించింది.

News April 18, 2026

శ్రీకాకుళం: పనికి రాదని పడేసే జీడి తొక్కతో లాభాలు

image

ఒకప్పుడు ఉపయోగం లేక పారబోసే జీడితొక్క ఇప్పుడు మంచి ఆదాయ వనరుగా మారింది. పలాస-కాశీబుగ్గలో జీడి ఆయిల్ పరిశ్రమలు ఏర్పడడంతో తొక్కకు డిమాండ్ పెరిగింది. గతంలో కిలో రూ.3కు అమ్మిన జీడితొక్క ధర ప్రస్తుతం రూ.15కు చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో జీడిఆయిల్ ఎగుమతులు పెరగడం దీనికి కారణం. రోజుకు వేల బస్తాల తొక్క పరిశ్రమలకు చేరుతుండగా, వ్యాపారులు గోనె సంచుల్లో నిల్వ చేసి విక్రయస్తున్నారు.

News April 18, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

✮జలం-జీవంపై దృష్టి సారించాలి: కలెక్టర్
✮మెళియాపుట్టి: రోగులకు మెరుగైన సేవలందించాలి -ఐటీడీఏ పీఓ
✮శ్రీకాకుళం జిల్లాలో ఓటర్లు ఎంతమంది అంటే?
✮గ్రామ స్థాయిలో వైసీపీ బలోపేతమవ్వాలి: మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
✮టెక్కలి: బంగారం దుకాణాల్లో చోరీ.. దొంగ అరెస్ట్
✮సోంపేటలో ఈనెల 20న జాబ్ మేళా
✮ప్రజాదర్బా‌ర్‌లో ఎమ్మెల్యే బగ్గు వినతుల స్వీకరణ

News April 17, 2026

శ్రీకాకుళం: 912 పంచాయతీల్లో ఓటర్లు ఎంతమందంటే?

image

స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. అన్ని పంచాయతీల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. జిల్లాలో 912 పంచాయతీలు ఉండగా, 16,22,067 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో, రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు జిల్లా పంచాయతీల్లో ఉన్నారు. గ్రామస్థాయిలో పారదర్శక ఓటర్ల జాబితా కూర్పుపై ఎన్నికల సంఘం కసరత్తు పెట్టింది.

News April 17, 2026

జనగణనపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

జనగణనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్, ముఖ్య జనగణన అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. స్వీయ-గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. దేశానికి స్వీయ గణన ఎంతో అవసరమన్నారు. మొబైల్ యాప్ (టెక్నాలజీ) వాడుకొనే జనగణనాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.

News April 17, 2026

జనగణనపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

జనగణనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్, ముఖ్య జనగణన అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. స్వీయ-గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. దేశానికి స్వీయ గణన ఎంతో అవసరమన్నారు. మొబైల్ యాప్ (టెక్నాలజీ) వాడుకొనే జనగణనాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.

News April 17, 2026

జనగణనపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

జనగణనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్, ముఖ్య జనగణన అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. స్వీయ-గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. దేశానికి స్వీయ గణన ఎంతో అవసరమన్నారు. మొబైల్ యాప్ (టెక్నాలజీ) వాడుకొనే జనగణనాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.

News April 17, 2026

ఎచ్చెర్ల: చేపల వేటకు బ్రేక్.. తీరాల్లో నిశ్శబ్దం!

image

చేపల వేటపై రెండు నెలల నిషేధం అమల్లోకి రావడంతో జిల్లాలోని సముద్ర తీరాలు నిర్మానుష్యంగా మారాయి. ఎచెర్ల మండలంలోని డి.మత్స్యలేశం గ్రామంలో మత్స్యకారులు బోట్లను, వలలను ఒడ్డున సురక్షితంగా ఉంచి ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది చేపల ప్రత్యుత్పత్తి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

News April 17, 2026

శ్రీకాకుళం జిల్లాలో 18న జాబ్ మేళా

image

జాబ్ మేళా వివరాలు ఇవే:
మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్‌, ఐ స్మార్ట్ సొల్యూషన్స్, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్‌లో పని చేసేందుకు ఇంటర్, ఐటీఐ, డిప్లోమో, ఆపై చదివి ఉండాలన్నారు. పోస్టుల మేరకు 18-35 ఏళ్లు కలిగి ఉండాలన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో పనిచేయాలన్నారు. రూ.8-35 వేల జీతం ఇవ్వనున్నారు.