Srikakulam

News April 17, 2026

శ్రీకాకుళం: ‘మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి’

image

స్వయం సహాయ సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ అన్నారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పట్టణ మహిళా సమాఖ్య నెలవారీ సమీక్ష సమావేశం మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సుస్థిర జీవనోపాధుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. రుణ ప్రణాళికలు సిద్ధం చేసి బ్యాంకు రుణాలతో అనుసంధానం చేయాలన్నారు.

News April 17, 2026

శ్రీకాకుళం: ‘మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి’

image

స్వయం సహాయ సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ అన్నారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పట్టణ మహిళా సమాఖ్య నెలవారీ సమీక్ష సమావేశం మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సుస్థిర జీవనోపాధుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. రుణ ప్రణాళికలు సిద్ధం చేసి బ్యాంకు రుణాలతో అనుసంధానం చేయాలన్నారు.

News April 17, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

మెళియాపుట్టి: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు
వ్యవసాయం రైతులకు జీవనాడి: జడ్పీ సీఈఓ
శ్రీకాకుళం: జిల్లా కేంద్రానికి చేరుకున్న నరసన్నపేట పంచాయతీ రగడ
జనగణన ప్రక్రియను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
పాలీసెట్ ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే బగ్గు

News April 16, 2026

కోటబొమ్మాళి: యాక్సిడెంట్‌లో 38 ఏళ్ల యువకుడు స్పాట్ డెడ్

image

కోటబొమ్మాళి మండలం జాతీయ రహదారి పాకివలస సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో కూరగాయల వ్యాపారి మృతి చెందాడు. బైక్‌పై కూరగాయలను అమ్ముకొని తిరిగొస్తుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడు పొన్నాడ పేటకు చెందిన మురళి (38)గా గుర్తించారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

News April 16, 2026

మెళియాపుట్టి: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు

image

భార్యను నాటు తుపాకీతో చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం సోంపేట అదనపు జడ్జి కె.కిషోర్ బాబు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తెలిపారు. మెళియాపుట్టి మండలం భరణికోట గ్రామానికి చెందిన సవర పద్మ అనే మహిళను ఆమె భర్త జగ్గారావు 2021 అక్టోబర్ 21న నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు తెలిపారు.

News April 16, 2026

నరసన్నపేట: ‘ముద్దాయిలకు న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం’

image

నరసన్నపేట‌లోని స్థానిక సబ్ జైలును జిల్లా న్యాయాధికార సేవా సంస్థ కార్యదర్శి హరిబాబు ఆకస్మికంగా పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం సబ్ జైలుకు చేరుకున్న ఆయన ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..బెయిల్ కోసం ప్రయత్నం చేసే ముద్దాయిలకు న్యాయాధికారి సేవా సంస్థ తరఫున ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ వినయ్ కుమార్ ఉన్నారు.

News April 16, 2026

పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

image

శ్రీకాకుళం జిల్లాలో ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష (పాలిసెట్-2026)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,855 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని అన్నారు. 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News April 16, 2026

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి లక్ష్యం: మంత్రి అచ్చెన్న

image

టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని మంత్రి అచ్చెన్న అధికారులను హెచ్చరించారు. గురువారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, రహదారులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన డీఈ, ఏఈలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

News April 16, 2026

శ్రీకాకుళం: సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ రేగా సురేశ్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20 వ తేదీ నుంచి 27 మధ్య ఫీజు చెల్లించాలని విద్యార్థులు సూచించారు. రీ వెరిఫికేషన్ కు సైతం 20 వ తేదీ 27 మధ్య దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 16, 2026

విధిని వెక్కిరించిన సిక్కోలు విద్యార్థి

image

పలాసకు చెందిన సకల భక్తుల వంశీకి పుట్టుకతోనే చేతులు, కాళ్లు సహకరించని పరిస్థితి. అయినప్పటికీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు 972 మార్కులు సాధించారు. తండ్రి లక్ష్మణరావు చిరు వ్యాపారి, తల్లి పార్వతి గృహిణి. స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చదివించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, టీచర్స్ , స్నేహితుల సహకారం మరువలేనిదని వంశీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.