India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న బీసీ బాలికల హాస్టల్ను జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు విద్యార్థులకు సరిగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్య అవినాభావ సంబంధం కలిగి ఉండాలన్నారు.

➤ఇచ్ఛాపురంలో ముగిసిన అభ్యుదయ సైకిల్ యాత్ర
➤కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఎమ్మెల్యే గోవిందరావు
➤నందిగాం: ఆవు ప్రాణాలను కాపాడిన ప్రైవేట్ వైద్యుడు
➤టెక్కలిలో గరుడ వాహనంపై ఊరేగిన దేవదేవుడు
➤పాడి రైతుల అభ్యున్నత ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కూన
➤మందస: గోడ కూలి కార్మికురాలు మృతి
➤ ఆమదాలవలసలో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రయాణంపై శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం నుంచి పాలిటిక్స్లోకి ఆయన వచ్చారు. ఏడాది క్రితం ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురికాగా.. పలు ఇంటర్వ్యూల్లో ఇది తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. జిల్లాలో మారుతున్న పొలిటికల్ సమీకరణాల దృష్ట్యా BJPలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై దువ్వాడ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, నందిగాం, గార, కొత్తూరు, జి.సిగడాం మండలాల నుంచి రిపోర్టర్లుగా పని చేసేందుకు Way2News దరఖాస్తులను స్వీకరిస్తోంది. మీడియా రంగంలో అనుభవం ఉన్న వారు ఈ <

మందస మండలం బేతాళపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా..బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికురాలిపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన కాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 14 B.Ed కళాశాల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 17లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఈనెల 27 నుంచి పరీక్షలు నిర్వహించనున్నామని వెల్లడించారు. 1,000 మంది వరకు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. త్వరలో పరీక్ష షెడ్యూల్ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టింగ్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రహదారి డివైడర్పై శుక్రవారం ఒక వృద్ధుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మండలంలోని కంట్రగడ గ్రామానికి చెందిన వీ.ఆనంద్ (71) అనే వృద్ధుడు కొన్నేళ్లుగా టెక్కలిలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మేరకు కాంప్లెక్స్ సమీపంలోని మృతిచెంది పడి ఉండడంతో స్థానికులు టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. అనారోగ్య సమస్యతో మృతిచెంది ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.

రాష్ట్రంలో రవాణా వ్యవస్థను సులభతరం చేసి ప్రమాదాల నివారణకు రైల్వే గేట్ల రహిత ఏపీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. నిన్న వెలగపూడి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైల్వే వంతెనలు, అండర్ వే పాస్ రహదారి నిర్మాణానికి సంబంధించిన అధికారులుతో సంయుక్తంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉన్నారు.

రాష్ట్రంలో రవాణా వ్యవస్థను సులభతరం చేసి ప్రమాదాల నివారణకు రైల్వే గేట్ల రహిత ఏపీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. నిన్న వెలగపూడి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైల్వే వంతెనలు, అండర్ వే పాస్ రహదారి నిర్మాణానికి సంబంధించిన అధికారులుతో సంయుక్తంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.