India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 51 వినతులను SP మహేశ్వర రెడ్డికి సమర్పించారు. ఫిర్యాదులపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, త్వరితగతిన విచారణ జరిపి, ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయన జూమ్ ద్వారా అధికారులతో మాట్లాడి న్యాయపరమైన, చట్టపరమైన అంశాలను పరిశీలించాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ఎస్ఐలకు విఆర్కు పంపుతూ జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
దీనికి సంబంధించి ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తూరు ఎస్సై ఆలీ మహమ్మద్, హిరమండలం ఎస్సై మహమ్మద్ యాసిన్లను విఆర్కు పంపారు. ఆయా పోలీస్ స్టేషన్లో పరిపాలన పరమైన అంశల్లో లోటుపాట్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.
రైతులకు యూరియా అందివ్వని కూటమి ప్రభుత్వం తీరుపై సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. పోలాకి మండలం మబగాం కృష్ణదాస్ పార్టీ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆందోళన ప్రారంభమవుతుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలి అన్నారు.
శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలో వంశధార, బాహుదా నదుల అనుసంధానం కలగానే మిగిలింది. గొట్టాబ్యారేజీ నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. వంశధార నది నుంచి సుమారు 97,262 టీఎంసీలు బాహుదాకు మళ్లించాలని గతంలో TDP ప్రభుత్వ హయాంలో సంకల్పించారు. ఈ రెండు నదులు అనుసంధానం చేస్తే ఎనిమిది మండలాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కూటమి ప్రభుత్వం స్పందించి వంశధార, బాహుదా నదుల అనుసంధానం వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రేడియాలజీ, చర్మవ్యాధులు, జనరల్ సర్జిన్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రికి స్టాఫ్ నర్సులు, జీడీఏలు కొరత అధికంగా వేధిస్తోంది. రోగులకు తాగునీరు కోసం ఏర్పాటు చేసిన ఆర్.ఓ ప్లాంట్ తరుచూ మరమ్మతులకు గురౌతుంది. డ్రైనేజీ సమస్యతో పాటు ప్రధానంగా బయోమెడికల్ వేస్ట్ భద్రపరిచేందుకు గదిలేదు. ఆసుపత్రిలో ఇంకేమైనా ప్రధాన సమస్యలు ఉన్నాయా ? అయితే COMMENT చేయండి.
శ్రీకాకుళం జిల్లా వయోజన విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 4 సూపర్వైజర్ పోస్టులకు సెప్టెంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని DD అల్లు సోమేశ్వరరావు కోరారు. డిప్యుటేషన్ ప్రాతిపదికన ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల వయస్సు 45ఏళ్లు లోపు ఉండాలన్నారు. MRPగా కనీసం 10ఏళ్లు పనిచేసిన సెకండరీ గ్రేడ్ టీచర్లు అర్హులన్నారు.
ప్రజా సమస్యలను వదిలేసి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మబుగాం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రుషికొండ భవనాలపై చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు తీసి వారి కడుపు కొట్టొద్దని సూచించారు.
ఎస్సీ మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడి గడ్డెమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 20సంవత్సరాలు వయస్సు పైబడిన ఐదుగురు మహిళ అభ్యర్థులకు మాత్రమే హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ ట్రైనింగ్ ఉంటుందన్నారు. అర్హులైన ఎస్సీ మహిళలు జిల్లా షెడ్యుల్డ్ కులముల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.