Srikakulam

News August 27, 2024

పాలకొండ సబ్ కలెక్టర్‌గా యస్వంత్ రెడ్డి

image

పాలకొండ సబ్ కలెక్టర్‌గా సి.యస్వంత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. యస్వంత్ రెడ్డి 2022 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఐఏఎస్ అధికారి నూరల్ కమర్ పాలకొండలో సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. పాలకొండ సబ్ కలెక్టర్ ఐఏఎస్ అధికారిని నియమించడం ఇది రెండోసారి. ప్రస్తుతం పాలకొండ ఆర్‌డిఓగా విధులు చేస్తున్న వివి రమణని బదిలీ చేశారు.

News August 27, 2024

శ్రీకాకుళం జిల్లాలో రెండు కొత్త ఇసుక స్టాక్ పాయింట్లు

image

గార మండలం శాలిహుండం, బూర్జ మండలం ఖండ్యాంలో కొత్తగా రెండు ఇసుక స్టాక్ పాయింట్లను మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ స్టాకు పాయింట్ల నుంచి ఇసుక పొందేందుకు ముందుగా సంబంధిత బుకింగ్ పాయింట్ల వద్ద నమోదు చేసుకుని స్లిప్పులను పొందాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు.

News August 26, 2024

శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన

image

శ్రీకాకుళం జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ప్రజలు, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News August 26, 2024

పరవాడ సినర్జిన్ ఫార్మా ప్రమాదం.. కన్నీటిని మిగిల్చిన విషాదం

image

పరవాడ సినర్జిన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కెమిస్ట్ సూర్యనారాయణ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వంగర మండలం కోనంగిపాడు గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం మృతుడి భార్య సునీత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనారోగ్య కారణంగా అప్పటి నుంచి భార్య కుమారుడు శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News August 26, 2024

జిల్లాలో ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ పర్యటన

image

జిల్లాలో ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27 తేదీన జలుమూరు మండలం ఎస్టీ మాకివలస, హిరమండలం మండలం అంతక పిల్లి, పునుపేట, సవితి సిది, గిరిజన గ్రామాల్లో పర్యటిస్తారు. 28 తేదీన ఆమదాలవలస మండలం, అల్లిపిల్లి గూడా, పర్యటించి అక్కనుంచి పాతపట్నం మండలం, నల్ల బొంతు గిరిజన గ్రామం పర్యటిస్తారని తెలిపారు.

News August 26, 2024

సీతంపేట: అడ్డాకులగూడ సమీపంలో లారీ బోల్తా

image

సీతంపేట మండలం అడ్డాకులగూడ సమీపంలో సోమవారం ఉదయం పాలకొండ నుంచి సీతంపేట వెళ్లే రోడ్డులో ఒడిశా వెళ్తున్న భారీ పరిశ్రమల ఉపకరణాల లారీ బోల్తా పడింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న 33 కెవి విద్యుత్ తీగలు తెగిపోయి విద్యుత్ అంతరాయం జరిగింది. దీంతో ఈ భారీ వాహనాలు వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

News August 26, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి క్రీడా పోటీలు

image

శ్రీకాకుళం: ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా సోమవారం నుంచి వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు డీఎసీవో కె.శ్రీధర్‌రావు తెలిపారు. క్రీడావికాస కేంద్రాల్లో పోటీలు జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో రాణించిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.

News August 26, 2024

శ్రీకాకుళం జిల్లా స్థాయి కవి సమ్మేళనం & పాటల పోటీ

image

ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 29 న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామంలో జిల్లా స్థాయి కవి సమ్మేళనం, పాటల పోటీ నిర్వహిస్తున్నారు. కవి సమ్మేళనంలో పాల్గొనే ప్రతి కవికి జ్ఞాపిక, సర్టిఫికేట్‌ అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. పాటల పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

News August 25, 2024

రణస్థలం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

రణస్థలం మండలం బంటుపల్లి జంక్షన్ సమీపంలో బీరు ఫ్యాక్టరీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. పైడి భీమవరం నుంచి రణస్థలం వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. వీరి ఇరువురు తండ్రి కొడుకులుగా స్థానికులు భావిస్తున్నారు. మృతులు విజయనగరం జిల్లా రేగడి ఆమదాలవలస మండలానికి చెందిన వారని సమాచారం.

News August 25, 2024

శ్రీకాకుళం: రాత్రంతా పొలిమేరలోనే మృతదేహం

image

వజ్రపుకొత్తూరు మండలం తెరపల్లి గ్రామంలో శనివారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో గ్రామానికి ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా.. పురాతన కట్టుబాట్లతో రాత్రి అయిందని ఊరు పొలిమేరలో మృతదేహాన్ని గ్రామస్థులు నిలిపివేశారు. రోజులు మారినా పద్ధతులు మారలేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.