Srikakulam

News March 27, 2026

టెక్కలిలో 29న రగ్బీ రాష్ట్రస్థాయి పోటీల ఎంపికలు

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 29వ తేదీన 9 గం.లకు జిల్లా స్థాయి రగ్బీ మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారుల ఎంపికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పార్వతీశం నేడు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా రగ్బీ సెక్రటరీ నారాయణ రావు(85000 07272 ,78424 23423) నంబర్లను సంప్రదించాలన్నారు.

News March 27, 2026

శ్రీకాకుళం: వీరి ప్రేమ విషాదాంతం

image

SMలో పరిచయమైన యువకుడు, వివాహిత ప్రేమ కథ విషాదాంతమైంది. పోలీసుల వివరాల మేరకు.. ఏలూరు జిల్లా వాసి మావుళ్లయ్య (25)కు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వివాహిత రమ (35)తో ఇన్‌స్టాలో పరిచయమైంది. వీరి మధ్య ప్రేమ చిగురించగా ఇంట్లో చెప్పకుండా గోప్యంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో, వారు తమ ప్రేమను అంగీకరించరని చేబ్రోలు వద్ద ఉన్న గోదావరి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

News March 27, 2026

SKLM: ఉద్యోగాలిప్పిస్తామని భారీ మోసం..!

image

పలాస(M) ఉదయపురం కాలానికి చెందిన రాజాన కూర్మారావుకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు వ్యక్తులు అతని నుంచి రూ.లక్షల్లో నగదు కాజేసి మోసం చేశారు. ఈ ఘటనలో 2014లో పలాస పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం వాదనలు విన్న పలాస మున్సిప్ కోర్ట్ నేరం రుజువు కావడంతో నిందితులకు 6 నెలల జైలు శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.

News March 26, 2026

పొందూరులో 32 ఏళ్ల యువకుడు సూసైడ్

image

పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శ్రావణ్ కుమార్(32) గురువారం ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో శ్రవణ్ ఉరివేసుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రావణ్ మరణంతో తల్లిదండ్రులు, భార్య కన్నీటి పర్యంతమయ్యరు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 26, 2026

ఎచ్చెర్లలో యాక్సిడెంట్..తల్లీ, కుమారుడు మృతి

image

ఎచ్చెర్ల మండలం అక్కివలస జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు..విశాఖకు చెందిన నరేంద్ర కుమార్ తల్లితో కలిసి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఎచ్చెర్ల హైవే‌పై వెనక నుంచి లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

News March 26, 2026

శ్రీకాకుళం: 22ఏ జాబితా భూములు సవరించరా?

image

జిల్లాలో భూ సమస్యలో ప్రధానమైంది 22A సమస్య. రైతుల భూములు ప్రభుత్వ భూములుగా నమోదు కావడంతో అమ్మకాలు, కొనుగోలు నిలిచిపోతున్నాయి. నిషేధిత జాబితా సమస్య పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఎక్కువగా రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. రీ సర్వేల్లో తప్పులు వల్ల జిరాయితీ భూములు ప్రభుత్వ భూములుగా నమోదు చేశారని రైతుల అంటున్నారు. వారసత్వ భూములు, కొనుగోలు భూములు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారని అంటున్నారు.

News March 26, 2026

శ్రీకాకుళం: 22ఏ జాబితా భూములు సవరించరా?

image

జిల్లాలో భూ సమస్యలో ప్రధానమైంది 22A సమస్య. రైతుల భూములు ప్రభుత్వ భూములుగా నమోదు కావడంతో అమ్మకాలు, కొనుగోలు నిలిచిపోతున్నాయి. నిషేధిత జాబితా సమస్య పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఎక్కువగా రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. రీ సర్వేల్లో తప్పులు వల్ల జిరాయితీ భూములు ప్రభుత్వ భూములుగా నమోదు చేశారని రైతుల అంటున్నారు. వారసత్వ భూములు, కొనుగోలు భూములు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారని అంటున్నారు.

News March 26, 2026

శ్రీకాకుళం: 22ఏ జాబితా భూములు సవరించరా?

image

జిల్లాలో భూ సమస్యలో ప్రధానమైంది 22A సమస్య. రైతుల భూములు ప్రభుత్వ భూములుగా నమోదు కావడంతో అమ్మకాలు, కొనుగోలు నిలిచిపోతున్నాయి. నిషేధిత జాబితా సమస్య పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఎక్కువగా రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. రీ సర్వేల్లో తప్పులు వల్ల జిరాయితీ భూములు ప్రభుత్వ భూములుగా నమోదు చేశారని రైతుల అంటున్నారు. వారసత్వ భూములు, కొనుగోలు భూములు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారని అంటున్నారు.

News March 26, 2026

శ్రీకాకుళం: 22ఏ జాబితా భూములు సవరించరా?

image

జిల్లాలో భూ సమస్యలో ప్రధానమైంది 22A సమస్య. రైతుల భూములు ప్రభుత్వ భూములుగా నమోదు కావడంతో అమ్మకాలు, కొనుగోలు నిలిచిపోతున్నాయి. నిషేధిత జాబితా సమస్య పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఎక్కువగా రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. రీ సర్వేల్లో తప్పులు వల్ల జిరాయితీ భూములు ప్రభుత్వ భూములుగా నమోదు చేశారని రైతుల అంటున్నారు. వారసత్వ భూములు, కొనుగోలు భూములు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారని అంటున్నారు.

News March 26, 2026

ఆముదాలవలస: నిండు గర్భిణీ ఆత్మహత్య.. బిడ్డను కాపాడిన వైద్యులు

image

ఆముదాలవలసలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన యండమూరి అపర్ణ (25) అనే నిండు గర్భిణి బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అపర్ణ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వెనువెంటనే కడుపులో ఉన్న బిడ్డను కాపాడారు. భర్తతో ఉన్న కలహాలే ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోంది. బిడ్డ ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతుందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.