Srikakulam

News March 26, 2026

శ్రీకాకుళం జిల్లాలో ఆ కేసుకు ముగింపు లేదా?

image

అరసవెల్లి రథసప్తమి వేడుకలు జనవరి 25న నిర్వహించారు. రెండు నెలలు గడుస్తోంది. అయినా నకిలీ పాసుల కేసు ముగింపు దశకు చేరలేదు. నకిలీ పాసులు ఎవరు ముద్రించారు? ఎందరి ప్రమేయం ఉంది? తెర వెనుక పాత్ర ఎవరిది? అన్న ఆధారాలు దాదాపుగా పోలీసులు సేకరించారు. మరోవైపు ఈ కేసులో ఆలయ యాజమాన్యం నుంచి ఫిర్యాదు లేకపోవడం ఒక సమస్యగా మారింది. ఈ కేసు నీరుగారుతుందా? ముగింపు ఉంటుందా? అన్నది ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు.

News March 26, 2026

శ్రీకాకుళం జిల్లా విద్యార్థులారా.. ఇలాంటి ప్రయాణం ప్రాణాంతకం

image

శ్రీకాకుళం-పొందూరు మార్గంలో బస్సు ప్రయాణం ‘కత్తిమీద సాము’లా మారుతోంది. బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు, యువత, ప్రాణాలకు తెగించి ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కిక్కిరిసిన బస్సుల్లో చోటు లేక తలుపుల వద్ద రాడ్లు పట్టుకొని ఒకే కాలిపై నిలబడి ప్రయాణించడం చూస్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని చూసేవారు ఆందోళన చెందుతున్నారు.

News March 26, 2026

SKLM: ‘జైళ్లలో కుల వివక్షకు తావుండకూడదు’

image

కారాగారాల్లో కుల ఆధారిత వివక్షకు అస్సలు తావుండకూడదని, ఖైదీలందరూ సామాజిక స్పృహతో, సద్బుద్ధితో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. బుధవారం గార (M) అంపోలులోని జిల్లా జైలును కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డిలతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ‘బోర్డ్ ఆఫ్ విజిటర్స్’ బృందంతో కలిసి జైలులోని రిజిస్టర్లు, ఇతర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

News March 26, 2026

SKLM: ‘జైళ్లలో కుల వివక్షకు తావుండకూడదు’

image

కారాగారాల్లో కుల ఆధారిత వివక్షకు అస్సలు తావుండకూడదని, ఖైదీలందరూ సామాజిక స్పృహతో, సద్బుద్ధితో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. బుధవారం గార (M) అంపోలులోని జిల్లా జైలును కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డిలతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ‘బోర్డ్ ఆఫ్ విజిటర్స్’ బృందంతో కలిసి జైలులోని రిజిస్టర్లు, ఇతర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

News March 25, 2026

నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు చేరుకోవాలి: జేసీ

image

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమని, రుణాలు అందజేయడంలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని JC పర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘DCC’, ‘DLRC’ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జిల్లా సమగ్ర ప్రగతి సాధించాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి అవసరమని, ఈ రంగాల్లోని లబ్ధిదారులకు బ్యాంకులు ఉదారంగా రుణసాయం అందించాలని సూచించారు.

News March 25, 2026

శ్రీకాకుళం: ఇంధన సరఫరాపై ఆందోళన వద్దు

image

ఇరాన్-అమెరికా యుద్ధ సంక్షోభ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంపై ఐఓసీఎల్ స్పందించింది. జిల్లాలోని అన్ని బంకుల్లో ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని సేల్స్ మేనేజర్ బి. రాజీవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ చొరవతో తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది అనవసరంగా నిల్వ చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

News March 25, 2026

SKLM: 22 ఏ భూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో ఉన్న 22ఎ భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్లుతో వర్చువల్ విధానంలో కలెక్టర్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏ మండలంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయని సంబంధిత తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. జేసీ అహమ్మద్ పర్మాన్ ఖాన్ పాల్గొన్నారు.

News March 25, 2026

SKLM: 22 ఏ భూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో ఉన్న 22ఎ భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్లుతో వర్చువల్ విధానంలో కలెక్టర్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏ మండలంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయని సంబంధిత తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. జేసీ అహమ్మద్ పర్మాన్ ఖాన్ పాల్గొన్నారు.

News March 25, 2026

SKLM: 22 ఏ భూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో ఉన్న 22ఎ భూ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్లుతో వర్చువల్ విధానంలో కలెక్టర్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏ మండలంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయని సంబంధిత తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. జేసీ అహమ్మద్ పర్మాన్ ఖాన్ పాల్గొన్నారు.

News March 25, 2026

శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు సాధ్యమంటే?

image

శ్రీకాకుళం జిల్లాలో 2009 ఎన్నికలకు పూర్వం 12 నియోజకవర్గాలుండేవి. 2009 ఎన్నికల్లో పది నియోజకవర్గాలుగా మారాయి. ప్రస్తుతం జిల్లా విభజన తరువాత 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉంది. 8 నియోజకవర్గాలు విభజన తర్వాత 12 గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల విశ్లేషణ. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, ఇచ్చాపురం, పలాస పట్టణాలు జనాభా ఆధారంగా కీలకం కానున్నాయి.