Srikakulam

News February 21, 2025

శ్రీకాకుళంలో ఇంటర్నేషనల్ రెడ్ బుక్ డే

image

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపించేది కమ్యూనిస్టు ప్రణాళికని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, బి.కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు అధ్యక్షతన ఇంటర్నేషనల్ రెడ్ బుక్ డే నిర్వహించారు. లెనిన్ రాసిన గ్రంథాన్ని అధ్యాయం చేయాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు.

News February 21, 2025

మందస: విద్యార్థిని ఆత్మహత్యపై కేసు నమోదు

image

మందస మండలం లోహరిబందలో ఇటీవల ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఎస్.ఐ కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేసినట్లు గురువారం తెలిపారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వచ్చి జీడీ తోటలోకి వెళ్లి చెట్టు కొమ్మకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మండలంలో కలకలం రేపింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 21, 2025

శ్రీకాకుళం ప్రజలారా జాగ్రత్త…!

image

శ్రీకాకుళం అంటేనే వలసలు గుర్తుకొస్తాయి. చదువు రాని వాడు చేపల వేటకు రాష్ట్రాలు దాటి వెళ్తున్నాడు. కాస్తోకూస్తో చదివినోడు దుబాయ్, ఇటలీ, మలేషియా అంటూ విమానం ఎక్కుతున్నాడు. వీళ్ల కష్టాలే కొందరికి వరంగా మారింది. విదేశాల్లో ఉద్యోగాలు తీసిస్తామంటూ రూ.లక్షలు దోచేస్తున్నారు. వీరిని నమ్మి పరాయి దేశానికి వెళ్తున్న సిక్కోలు బిడ్డలు కష్టాలు పడుతున్నారు. జిల్లాలో ఈమోసాలు ఇటీవల ఎక్కువైపోవడం ఆందోళన కలిగిస్తోంది.

News February 21, 2025

SKLM: యువతిని వేధించిన నిందితులు అరెస్టు

image

సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న ఇద్దరిని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితులను జైలుకు తరలించారు. ఈ మేరకు గురువారం టూ టౌన్ పట్టణ స్టేషన్ సీఐ పీ.ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి యువతిని వేధించినందకు గాను నిందితులను అరెస్టు చేశామని సీఐ చెప్పారు.

News February 21, 2025

SKLM: అసభ్యకరమైన పోస్టులు పెడితే జైలుకే..!

image

సోషల్‌ మీడియాలో ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి హెచ్చరించారు. ఈ విషయాన్ని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై గాని హేయమైన, అసత్య ప్రచారాలు, ట్రోలింగ్ చేసిన బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తామన్నారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News February 20, 2025

SKLM: ఆశా వర్కర్ల శిక్షణాసదస్సు పూర్తి

image

శ్రీకాకుళం జిల్లా DM&HO కార్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్(IGD) ఆధ్వర్యంలో అయోడిన్ లోపంపై ఆశావర్కర్లతో జరుగుతున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఆశా వర్కర్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ ప్రశంసా పత్రాలను అందించారు. ఆశా కోఆర్డినేటర్ రవిప్రసాద్, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేశ్ కుమార్ ఉన్నారు.

News February 20, 2025

ఏపీయూడబ్ల్యుూజే రాష్ట్ర కౌన్సిల్‌కు జిల్లా జర్నలిస్టులు

image

APUWJ రాష్ట్ర కౌన్సిల్‌కు జిల్లాకు చెందిన నలుగురు సీనియర్ జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి డీ.సోమసుందర్ వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన జర్నలిస్టులు బెండి నర్సింగరావు (టెక్కలి), ఎం.వి మల్లేశ్వరరావు(శ్రీకాకుళం), కొంచాడ రవికుమార్(పలాస), జీ.శ్రీనివాసరావు(పాతపట్నం)లు ఎన్నికయ్యారు. వీరి ఎంపిక పట్ల పలువురు జర్నలిస్టులు అభినందించారు.

News February 20, 2025

SKLM: నేడు జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు గురువారం జరగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి జడ్పీ సమావేశ మందిరంలో సమావేశాలు ప్రారంభం అవుతాయని జడ్పీ సీఈవో ఎల్ఎన్ఏవీ శ్రీధర్ రాజా తెలిపారు. 10.30 గంటల నుంచి 6వ స్థాయీ, 11.30 గంటలకు 3వ, 12.30 గంటల నుంచి 5వ, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి వరుసగా 2వ, 4వ, 1వ, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు.

News February 20, 2025

శ్రీకాకుళం: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

పెళ్లి డెకరేషన్ చేస్తూ యువకుడు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. సోంపేట మండలం బ్రాహ్మణ కొర్లాంలో పెళ్లి డెకరేషన్ కోసం పలాసకు చెందిన కొంతమంది యువకులు వెళ్లారు. నిన్న రాత్రి క్లాత్ డెకరేషన్ చేస్తుండగా చల్లా తిరుపతి(22) అనే యువకుడికి కరెంట్ వైర్ తగిలింది. తీవ్ర గాయాలు కావడంతో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే తిరుపతి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News February 19, 2025

మందస: పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య

image

మందస మండలం లోహరిబంధలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా 8వ తరగతి చదువుతుంది. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం అనంతరం సమీపంలోని జీడీ తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.