Srikakulam

News February 19, 2025

పాలకొండకు జగన్ రాక రేపు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. ఇటీవల జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం చనిపోయారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు గురువారం రానున్నారు. ఈ మేరకు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.

News February 19, 2025

టెక్కలి: జేసీ సమక్షంలో పెండింగ్ అర్జీల పరిష్కారం

image

టెక్కలి సబ్ కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టెక్కలి డివిజన్‌ పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ అర్జీలు సమస్యలను పరిష్కరించారు. డివిజన్ పరిధిలోని టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాలి, పాతపట్నం, హిరమండలం, ఎల్.ఎన్ పేట, కొత్తూరు, సారవకోట మండలాల తహశీల్దార్లు, వీఆర్ఓలు, సర్వేయర్ల సమక్షంలో 260 అర్జీలు పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.

News February 18, 2025

SKLM: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. జడ్పీ మందిరంలో MLC ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై సెక్టార్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓల మొదటి విడత శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News February 18, 2025

శ్రీరాంపురంలో టవర్ ప్రారంభానికి ముహూర్తం ఎప్పుడు..?

image

కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామాలకు ఎంతో కాలంగా సెల్ సిగ్నల్స్ సమస్య వేధిస్తూనే ఉంది. ఈ మేరకు గ్రామ పరిధిలో BSNL అధికారులు సెల్ టవర్ నిర్మాణం పూర్తి చేసి ఏడాది గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సెల్ టవర్ సిగ్నల్స్ ప్రారంభం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

News February 18, 2025

SKLM: గ్రూప్-2 పరీక్షల ఏర్పాట్లపై ఆర్డీవో సమీక్ష

image

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె.సాయి ప్రత్యూష తన కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయం వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

News February 18, 2025

జి.సిగడాం: పింఛను సొమ్ముతో అధికారి జంప్

image

జి.సిగడాంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్ పింఛను సొమ్ముతో పరారైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు వారు సర్వేయర్ భాను ప్రతాప్ రూ. 49 వేలు తీసుకెళ్లాడని సోమవారం తహశీల్దార్ ఎం. శ్రీకాంత్, ఎంపీడీవో రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈనెలకు సంబంధించి రూ. 1.66 లక్షల సొమ్ములో రూ. 1.17 లక్షలు పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించినట్లు వారు ఆరోపించారు.

News February 18, 2025

టెక్కలిలోని హాస్టళ్లలో నిఘా కరవు

image

టెక్కలిలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో ఓ ఇంటర్ విద్యార్థిని గర్భం దాల్చిందన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలికల హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వార్డెన్లు, సిబ్బందితో పాటు విద్యార్థినుల రాకపోకలను గమనించడం లేదని , అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News February 18, 2025

టెక్కలి : ప్రభుత్వ హాస్టళ్లో గర్భం దాల్చిన విద్యార్థిని

image

టెక్కలిలోని ఓ ప్రభుత్వ బాలికల వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థినికి టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి వైద్య పరీక్షలు నిర్వహించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని గర్భం దాల్చిందనే ప్రచారం సోమవారం నాటికి బయటకు పొక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News February 18, 2025

SKLM: అయోడిన్ లోపంపై అవగాహన అవసరం

image

శ్రీకాకుళం నగరంలోని DM&HO కార్యాలయంలో సోమవారం ఉదయం అయోడిన్ లోపంపై ఆశా వర్కర్లకు శిక్షణా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో DM&HO మురళి హాజరయ్యారు. జిల్లాలోని 4 మండలాల్లో 40 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్‌ను ITC ఆర్థిక సహాయంతో చేస్తున్న కార్యక్రమాలను ఆశావర్కర్లకు వివరించారు. అయోడిన్ లోపంతో వచ్చే అనర్థాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

News February 17, 2025

ఇచ్చాపురం: ఇటలీలో ఉద్యోగాలంటూ మోసం

image

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. పార్వతీపురానికి చెందిన ఓ ఏజెంట్‌తో కలిసి ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి వాసి ఈ మోసానికి పాల్పడ్డారు. జిల్లాలో ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షలు చొప్పున రూ.3 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దాదాపు 350 మంది నిరుద్యోగులను ఇటలీ పంపగా.. అక్కడ సరైన ఉద్యోగం లేక మోసపోయారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!