India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం ఢిల్లీలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రితో రాష్ట్రానికి సంబంధించి పలు విషయాల పై చర్చించారు.
సోంపేట మండలం బైరిపురం గ్రామానికి చెందిన ముంజుల మోహన్ (17) విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలో ఉన్న ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామానికి వచ్చిన మోహన్ శుక్రవారం సాయంత్రం సోంపేట నుంచి విశాఖ వెళ్లే ఆర్టీసీ బస్సులో తన తండ్రి శంకర్ ఎక్కించారు. తన కుమారుడు నేటి వరకు కళాశాలకు చేరకపోవడంతో.. కుమారుని ఆచూకీ కోసం ఆనందపురం పోలీసులకు తండ్రి శంకర్ ఫిర్యాదు చేశాడు.
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో ప్రీ యూనివర్సిటీ కోర్సుల్లో మొదటి రెండో విడత కౌన్సెలింగ్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ నెల 19, 20 తేదీల్లో రిపోర్టు చేయాలని శ్రీకాకుళం ఆర్జీయూకేటీ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ సూచించారు. అనంతరం 21వ తేదీ నుంచి క్లాస్వర్క్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రెండో విడత కౌన్సెలింగ్ పూర్తైన తర్వాత మూడో విడత జాబితా విడుదల చేయనున్నారని అన్నారు.
మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులను అత్యంత అంకితభావంతో పరిష్కరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శనివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలసి ఆయన జిల్లా అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు. మీ కోసం వినతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
హిజ్రాల సమస్యలు పరిష్కరిస్తానని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రిని కలిసిన హిజ్రాలు తమ సమస్యలు వివరించారు. సమాజంలో తమ వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారన్నారు. తమ జీవనం ఏదోలా నెట్టికొస్తున్నామని, సమాజంలో తమకంటూ ఓ గుర్తింపునిచ్చేలా ప్రభుత్వం సహకరించాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా కోర్ట్ ఆవరణలో శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా జిల్లాలో గల న్యాయమూర్తులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14న జరగబోయే లోక్ అదాలత్ కక్షిదారులకు ఒక మంచి అవకాశం అని, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను, సివిల్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులను ఎక్కువ చేయాలని అతను కోరారు. కార్యక్రమంలో సన్యాసినాయుడు, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణీకి శనివారం టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులను జారీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ నివాసం ఆవరణలో నిరసన తెలుపుతున్న వాణీకి నోటీసులు అందజేసేందుకు టెక్కలి పోలీసులు వెళ్లారు. అయితే తానే స్వయంగా టెక్కలి పోలీస్ స్టేషన్కు వచ్చి నోటీసులు తీసుకుంటానని వాణి పోలీసులకు వివారించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో వాణిపై కేసు నమోదైన విషయం విధితమే.
శ్రీకాకుళం నగరంలో నెహ్రూ యువజన కేంద్రంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా తెలిపారు. ఈ జాబ్ మేళాలో KL గ్రూప్ అమెజాన్ వేర్ హౌస్ కంపెనీ పాల్గొంటుందని 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18-35 సంవత్సరాల అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులని అలాగే ఎంపికైన వారికి నెలకు 18,000 జీతం ఉంటుందని తెలిపారు.
రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ 2024 పోటీలకు శ్రీకాకుళం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పోటీలు ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు కోచ్ మేనేజర్లు 496 మంది ఈ స్పోర్ట్స్ మీట్ కు హాజరు కావాలన్నారు. ఈ పోటీలో పాల్గొనే వారికి వసతి భోజనం ఏర్పాట్లు అని కూడా అధికారులు కల్పించనున్నారు.
ఏపీఈఏపీ సెట్-2024 ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్లు పూర్తవ్వగా హాజరు కాని అభ్యర్థులుకు మూడో విడత కౌన్సెలింగ్కు మరో అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం కళాశాలలో సీటు లభించిన విద్యార్థులు బ్రాంచీలు మార్చుకునే అవకాశం కల్పించనున్నారు. సమస్య ఉంటే శ్రీకాకుళం ప్రభుత్వం పాలిటెక్నిక్ను సంప్రదించాలని సమన్వయకర్త దామోదర్ రావు తెలిపారు.
Sorry, no posts matched your criteria.