Srikakulam

News August 17, 2024

జలుమూరు: దర్యాప్తునకు హాజరు కావాలని దివ్యాంగులకు నోటీసులు

image

జలుమూరు మండలం సైరిగాం పంచాయతీలో పలువురు నకిలీ దివ్యాంగ ధ్రువపత్రాలతో పింఛను పొందుతున్నారని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 20న శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సదరం ధ్రువపత్రాల నిర్ధారణకు హాజరు కావాలని 33 మంది పింఛనుదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో పి.ఉమామహేశ్వరరావు శుక్రవారం తెలిపారు. దర్యాప్తునకు హాజరు కాకపోతే అనర్హులుగా గుర్తించి పింఛన్లు తొలగిస్తామన్నారు.

News August 17, 2024

శ్రీకాకుళం: రేపు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

image

రేపు జిల్లా వ్యాప్తంగా 24 గంటలు పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కత RCKAR ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలిపై జరిగిన పాశవిక హత్యాచారానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేతృత్వంలో 24 గంటలు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు IMD ఓ ప్రకటన విడుదల చేసింది.

News August 17, 2024

శ్రీకాకుళం: రేపు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

image

రేపు జిల్లా వ్యాప్తంగా 24 గంటలు పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కత RCKAR ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలిపై జరిగిన పాశవిక హత్యాచారానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేతృత్వంలో 24 గంటలు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు IMD ఓ ప్రకటన విడుదల చేసింది.

News August 16, 2024

శ్రీకాకుళం జిల్లాలోని TODAY TOP NEWS

image

➤ పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ మహేశ్వరరెడ్డి ➤ శ్రీకాకుళం రిమ్స్ పారామెడికల్ కోర్సుల్లో దరఖాస్తు ఆహ్వానం ➤ పలువురు పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ ➤ అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వండి: మంత్రి అచ్చెన్న ➤ విజయనగరం రైల్వే ట్రాక్పై జిల్లా వాసి అనుమానస్పద మృతి ➤ దివ్యాంగులకు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం ➤ కొలిక్కిరాని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం

News August 16, 2024

కోటబొమ్మాళి: యువకుడు అనుమానాస్పద మృతి

image

విజయనగరం సమీపంలోని రాళ్లమళ్లపురం గ్రామం పరిధిలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం కోటబొమ్మాళి మండలం చిన్నహరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన ఉప్పాడ జగదీశ్ (25) అనుమానాస్పదంగా మృతి చెందాడు. రైల్వే పోలీసులు వివరాల ప్రకారం.. జగదీశ్‌ విశాఖపట్నంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని వివరించారు. విజయనగరం ఎందుకు రావాల్సి వచ్చిందని, హత్యా లేక ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News August 16, 2024

కొలిక్కిరాని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య దువ్వాడ వాణి వివాదం కొలిక్కిరావడం లేదు. శ్రీనివాస్ నివాసం ఉంటున్న ప్రదేశంలో గత కొద్ది రోజులుగా ఆయన భార్య వాణి, కుమార్తెలు నిరసన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లుపై పూర్తి హక్కులు తనకు ఉన్నాయని శ్రీనివాస్ చెబుతుండగా, ఇంటిపై మాకు కూడా హక్కులు ఉన్నాయని వాణి, మాధురి అంటున్నారు. ఒకపక్క తనకు దువ్వాడ రూ.60 లక్షలు ఇవ్వాలని ఒక వ్యక్తి అంటున్నారు.

News August 16, 2024

మాజీ మంత్రి కృష్ణదాస్‌పై విచారణకు సీఐడీ ఆదేశం

image

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌పై విచారణకు గురువారం ఏపీ సీఐడీ అధికారులు ఆదేశించారు. ‘ఆడుదాం-ఆంధ్రా’, సీఎం కప్ కార్యక్రమం పేరిట అవినీతికి పాల్పడ్డారు అనే ఫిర్యాదు మేరకు విజయవాడ సీపీకి సీఐడీ ఏడీపీ సూచించారు. మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆర్‌కె రోజాలను విచారణ చేయాలని ఆదేశించారు. ధర్మాన కృష్ణదాస్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.

News August 16, 2024

స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న.. నేడు ఆయన జయంతి

image

స్వాతంత్ర్య సమరయోధుడు డా.సర్దార్ గౌతు లచ్చన్న ఆగస్టు 16, 1909లో సోంపేట మండలం బారువ గ్రామంలో జన్మించారు. 21 ఏళ్ల వయసులో పలాసలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యారు. పలుమార్లు జైలుకు వెళ్లారు. బ్రిటీష్ రాజులపై పోరాటాలు చేసినందుకు ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చింది. 1948-83 కాలంలో 35 ఏళ్లు సోంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. 2001లో “నా జీవితం” అనే ఆటోబయోగ్రఫీ రచించారు.

News August 16, 2024

ఆమదాలవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆమదాలవలస మండలం దివాంజీపేట వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన పేడాడ రాము(37) కొత్తూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్టీల్ పాంట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News August 16, 2024

ఆమదాలవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస ప్రభుత్వ ఆసుపత్రి సమీపం రాధాకృష్ణ పురం వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన పేడాడ రాము (37) కొత్తూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.స్టీల్ పాంట్‌లో విధులు నిర్వహిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.