Srikakulam

News August 16, 2024

ఆమదాలవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆమదాలవలస మండలం దివాంజీపేట వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన పేడాడ రాము(37) కొత్తూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్టీల్ పాంట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News August 16, 2024

ఆమదాలవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస ప్రభుత్వ ఆసుపత్రి సమీపం రాధాకృష్ణ పురం వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం కలిగాం గ్రామానికి చెందిన పేడాడ రాము (37) కొత్తూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.స్టీల్ పాంట్‌లో విధులు నిర్వహిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News August 15, 2024

శ్రీకాకుళం: ఈ నెల 17న జాబ్ మేళా

image

శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఈ నెల 17 వ తేదీ శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కె.ఎల్ గ్రూప్ (అమెజాన్ వేర్ హౌస్) కంపెని పాల్గొంటుందని వెల్లడించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తయ్యి 18 నుంచి 35 సంవత్సరాల అర్హత కలిగిన స్త్రీ/పురుషులు అర్హులని తెలిపారు. 200 పోస్టులను భర్తీ చేయనున్నారని వివరించారు.

News August 15, 2024

సంతబొమ్మాళి: ఆర్మీ మేజర్ రాంగోపాల్‌కు కీర్తిచక్ర అవార్డు

image

సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామానికి చెందిన ఆర్మీ మేజర్ మల్లా రాంగోపాల్ ప్రతిష్ఠాత్మకమైన ఆర్మీ కీర్తిచక్ర అవార్డుకు ఎంపికయ్యారు. మరాఠా లైట్ ఇన్ ఫ్రాంటరీ 56వ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్ మేజర్ గా ఉన్న రాంగోపాల్ గత ఏడాది జమ్మూకాశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించి తన సైన్యంతో దాడి చేసి ఉగ్రవాదులను హతమార్చడంలో ప్రత్యేక పాత్ర పోషించినందుకు గాను కీర్తిచక్ర అవార్డుకు ఆర్మీ అధికారులు ఎంపిక చేశారు.

News August 15, 2024

టెక్కలి: చాక్‌పీస్‌పై మహాత్మా గాంధీ రూపం

image

టెక్కలి మండలం స్థానిక మెట్ట వీధికి చెందిన సింహాద్రి రాజు అనే యువకుడు స్వాతంత్‌ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహాన్ని సుద్ధ మొక్క పై చెక్కి తన దేశభక్తిని చాటుకున్నాడు. సుద్ధ ముక్కపై గాంధీజీ విగ్రహం చెక్కటానికి 6 గంటల సమయం పట్టిందని యువకుడు తెలిపాడు. రాజు కార్పెంటర్ పని చేస్తూ జీవనోపాధి సాగిస్తూ ఇలా సుద్ద ముక్క పై విగ్రహాలు చెక్కుతూ తన ప్రతిభను కనబరుస్తుంటాడు. దీంతో పలువురు అభినందిస్తున్నారు.

News August 15, 2024

SKLM: స్వాతంత్ర్య సమర యోధుడు అప్పయ్య

image

స్వాతంత్ర్య సమరంలో సిక్కోలు జిల్లా యోధుల కృషి మరువలేనిది. వారిలో పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన అన్నెపు అప్పయ్య ఒకరు. క్విట్ ఇండియా ఉద్యమం సహా ఎన్నో స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొన్నందుకు ఆయన కృషి చేశారు. బొడ్డేపల్లి నారాయణ, నంద ఆదినారాయణ, గురుగుబెల్లి సత్యనారాయణ, నంద కృష్ణమూర్తి, బొడ్డేపల్లి రాములు, కూన యర్రయ్య, కూన బుచ్చి తదితరులున్నారు.

News August 15, 2024

శ్రీకాకుళం పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీ

image

శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్లో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎంతోమంది మహనీయులు త్యాగాలు ఫలితమే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నల్ దినకర్, ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

News August 15, 2024

శ్రీకాకుళం: ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

image

78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగాయి. ముందుగా పోలీసు గౌరవ వందనాన్ని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచి పెట్టారు.

News August 15, 2024

శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది ఈరోజే..!

image

నేడు శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు. విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా 1950 ఆగస్టు 15న ప్రత్యేక జిల్లాగా అవతరించింది. బ్రిటిషు వారికి అప్పటి ఈ ప్రాంత రైతులు పన్నును గుడ్డ సంచిలో సమర్పించేవారు. బ్రిటిష్ వారు ఆ మూటల మూతికట్టు విప్పమని చెప్పడానికి చికాకోల్ అనేవారు. అంటే “మూతికట్టువిప్పు” అని అర్థం. ఈ మాట క్రమంగా “చికా కోల్” అయి, శ్రీకాకుళంగా స్థిరపడింది అని అంటారు.

News August 15, 2024

శ్రీకాకుళం జాతీయ జెండా ఆవిష్కరించిన కలెక్టర్

image

78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహమ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.