Srikakulam

News August 15, 2024

శ్రీకాకుళం: దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ‘స్వాభిమాన్’

image

ప్రతి నెల మూడో శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వారి సలహా మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆగస్టు 16వ తేదీ ఉదయం 10.00 గంటల నుంచి 12.00 గంటల వరకు వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు.

News August 15, 2024

ఆమదాలవలస: మహాత్ముడు నాటిన మర్రి చెట్టు

image

ఆమదాలవలస మండలం దూసి రైల్వేస్టేషన్‌లో 1942వ సంవత్సరంలో జాతిపిత గాంధీజీ చేపట్టిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా రైలులో ప్రయాణించి, రైల్వేస్టేషన్‌లో దిగి ఉద్యమం గురించి 15 నిమిషాల పాటు ప్రసంగించారు. అప్పుడే రైల్వేస్టేషన్‌ ఆవరణలోనే గాంధీజీ మర్రి మొక్కను నాటినట్లు పూర్వీకులు చెబుతున్నారు. 81 సంవత్సరాల క్రితం నాటిన మొక్క రెండెకరాల విస్తీర్ణంలో వృక్షమై ఉంది. గాంధీజీ నాటిన వృక్షంగా భావిస్తున్నారు.

News August 15, 2024

సీతంపేట: సచివాలయ సెక్రటరీ అప్పలస్వామి మృతి

image

సీతంపేట మండలం కిల్లాడ గ్రామ సచివాలయ సెక్రటరీ అల్లాడ అప్పలస్వామి అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన స్వగ్రామం వీరఘట్టం మండలం ఎం.రాజపురం. సచివాలయ సెక్రటరీగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన వ్యక్తి ఇలా అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 15, 2024

రాజాం: సూక్ష్మ స్వర్ణ భారతం తయారుచేసిన స్వర్ణకారుడు

image

రాజాం పట్టణం కాస్పావీధికి చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ స్వర్ణ కళాకారుడు ముగడ జగదీశ్ మరోసారి ప్రతిభ కనబరిచారు. 0.060 మిల్లీ గ్రాముల బంగారు తీగతో సూక్ష్మ స్వర్ణ భారతంను 30 నిముషాల వ్యవధిలో తయారుచేసి ఔరా అనిపించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీనిని తయారుచేసి దేశ భక్తిని చాటుకున్నాడు. అనేక కళాకృతులు అందంగా తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

News August 14, 2024

శ్రీకాకుళం: ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి

image

ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా ప్రతి పౌరుడు తన ఇంటి పైన మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కోరారు. బుధవారం కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అనంతరం మాట్లాడారు.

News August 14, 2024

ఎచ్చెర్ల: యోగా డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

యోగా అండ్ ఫిట్నెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆఫర్ చేస్తున్న ఆరు నెలల వ్యవధిగల యోగా డిప్లొమా కోర్సులకు ప్రవేశానికి ఈ విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డా.బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాత బుధవారం తెలిపారు. ఎటువంటి అదనపు రుసుం లేకుండా వీటిని ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలని కోరారు.

News August 14, 2024

శ్రీకాకుళం: దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతినెల మూడో శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కే కవిత బుధవారం తెలిపారు. దివ్యాంగుల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు ఈ అవకాశాన్ని దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఆగస్టు 16న ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

News August 14, 2024

ఆరో రోజుకు చేరిన దువ్వాడ వాణి నిరసన దీక్ష

image

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య వాణి ఆరో రోజు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. పిల్లలను, తనను భర్త ఇంట్లోకి రానివ్వట్లేదని కారు షెడ్డులో దీక్ష చేస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటికే దువ్వాడ శ్రీను, వాణి ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు వివాదం సద్దుమణిగేలా ఇరు కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు.

News August 14, 2024

₹75 వేల కోట్లతో రిఫైనరీ.. శ్రీకాకుళం జిల్లాలో ల్యాండ్ ఆఫర్!

image

ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ ఏర్పాటుకు ఆసక్తిగా ఉంది. రూ.75 వేల కోట్లతో ఏర్పాటు చేయనుండగా ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఆ రిఫైనరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట (శ్రీకాకుళం)లో స్థలాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి రిఫైనరీ ఏర్పాటు చేసే అవకాశముంది. దీని ద్వారా 10 వేల ఉద్యోగాలు రానున్నాయి.

News August 14, 2024

శ్రీకాకుళం: డెంగ్యూ వ్యాధితో పీజీ విద్యార్థిని మృతి

image

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ కాలనీకి చెందిన పీజీ విద్యార్థి కొంచాడ నీలమ్మ (22) డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. జ్వరం రావడంతో పీహెచ్‌స్సీకీ తరలించగా రక్త పరీక్షలు నిర్వహించి ప్లేట్‌లేట్స్‌ తక్కువగా ఉన్నాయని గుర్తించారు. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్‌ సూచించారు. అంతలోనే ఆమె మరణించింది. వైద్యులు నిర్లక్ష్యంతోనే నీలమ్మ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.