Srikakulam

News March 30, 2025

శ్రీకాకుళం: ట్రైన్ నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

image

తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తుని- అన్నవరం స్టేషన్ మధ్య రైలు నుంచి జారిపడి ఓ వృద్ధురాలు మృతి చెందిందని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం తెలపగా.. మృతురాలు పలాసకు సమీపంలోని సైలాడ గ్రామానికి చెందిన అట్టాడ సరస్వతమ్మ (70)గా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 30, 2025

శ్రీకాకుళం: ‘అట్రాసిటీ చట్టం పటిష్ఠంగా అమలు చేయాలి’

image

అట్రాసిటీ చట్టాలను పటిష్ఠ అమలు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం (పిసిఆర్ & పిఓఏ యాక్ట్) పై జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీతో ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, నరసన్నపేట పేట శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి‌తో కలసి సమీక్ష నిర్వహించారు.

News March 28, 2025

SKLM: జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

image

శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను శుక్రవారం సాయంత్రం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన పలు పెండింగ్‌లో ఉన్న పనులపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

News March 28, 2025

SKLM: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

పలాస, శ్రీకాకుళం మీదుగా హైదరాబాద్(HYB)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07165 HYB- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

News March 28, 2025

శ్రీకాకుళం: బాలల హక్కుల కార్యదర్శి నియామకం

image

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మురపాక గ్రామానికి చెందిన వమరవెల్లి మణి బాబును జిల్లా బాలహక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శిగా శుక్రవారం రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదర్ నియమించారు. ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడుతూ.. బాలల హక్కుల కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. బాల కార్మికులను గుర్తించడం, పాఠశాలల్లో డ్రాప్ ఔట్‌లను తగ్గించడం తన ప్రథమ కర్తవ్యం అని అన్నారు.

News March 28, 2025

SLM: పక్షుల రక్షణకు విద్యార్థుల వినూత్న ఆలోచన

image

పక్షుల రక్షణకు విద్యార్థులు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బూరగాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల, గ్రామాలలో పక్షుల కోసం ప్రత్యేకంగా తొట్టెలు, కొబ్బరి చిప్పల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎండకు స్పృహ తప్పి పడిపోయిన పక్షికి విద్యార్థులు నీరు తాగించి రక్షించారు. దీంతో పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

News March 28, 2025

శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

image

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్‌ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు ఏప్రిల్ సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరతాయని వివరించారు.

News March 28, 2025

SKLM: పది పరీక్షలకు 179 మంది గైర్హాజరు- డీఈఓ 

image

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 179 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య శుక్రవారం తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 134 మంది, డిస్ట్‌న్స్ విభాగంలో 45 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని వివరించారు. వేసవి దృష్ట్యా త్రాగునీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

News March 28, 2025

వజ్రపుకొత్తూరుకు రానున్న సినీ నటి కవిత

image

వజ్రపుకొత్తూరు మండలంలోని ఒంకులూరు గ్రామానికి శుక్రవారం సినీ నటి కవిత రానున్నారు. గ్రామానికి చెందిన గుంటు వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలు సందర్భంగా ఆమె రానున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారని నిర్వాహకులు తెలిపారు.

News March 28, 2025

శ్రీకాకుళం : తమ్ముడు చనిపోతే అప్పుతీర్చలేనని అన్న సూసైడ్

image

తమ్ముడు చనిపోతాడేమోనని అన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన సిక్కోలులో గురువారం జరిగింది. రూరల్ SI కె. రాము కథనం..సారవకోటలోని అలుదుకు చెందిన సూరి(40),అతని తమ్ముడు గ్రానైట్ వ్యాపారం చేసేవారు. అయితే నష్టం రాగా.. ఉమామహేశ్వరరావు విషం తాగాడు. రాగోలు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు బతకడం కష్టమన్నారు. చేసిన అప్పులు తీర్చలేనని అన్న ఆసుపత్రి వద్ద తీసుకున్న గదిలో ఉరివేసుకున్నాడు. దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.