India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం చంద్రబాబు మంత్రులకు గురువారం ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడికి 17వ ర్యాంక్ వచ్చింది. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం మంత్రికి సూచించారు.
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్సై సందీప్ వివరాల మేరకు.. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని చౌదరి సత్యనారాయణ కాలనీకి చెందిన తరుణ్ (19), పాజిల్ బేగ్ పేటకు చెందిన కార్తీక్ (21) బైక్పై వస్తూ డివైడర్ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి ఆదాయం రూ.70.39 లక్షలు వచ్చాయని ఈవో వై.భద్రాజీ తెలిపారు. గతేడాది కంటే రూ.20 లక్షలు అధికంగా వచ్చినట్లు చెప్పారు. ఈ మొత్తం టికెట్లు, క్షీరాభిషేకం, కేశఖండన ద్వారా సమకూరిందన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని అన్ని అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు ఈ నెల 10న పక్కాగా వేయించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎంపీడీఓలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంఘాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.
బెంతు ఒరియాల శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా బల్లిపుట్టుగకు చెందిన రజనీ కుమార్ దొళాయిని నియమితులయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో సంఘం సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఉన్న శ్యాంపురియా ఇటీవల మృతి చెందడంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా బెంతు ఒరియా కుల సంఘం అధ్యక్షుడిగా రజిని కుమార్ దోళాయి, ఉపాధ్యక్షుడిగా ఢిల్లీ మజ్జి, తదితరులను ఎన్నుకున్నారు.
అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా అధికారుల ప్రోద్భలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయని కొనియాడారు. ఈఏడాది సూర్యనారాయణ స్వామిని 1.20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పారు.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చాపురం మండలం అందెపల్లి గ్రామానికి చెందిన ఉదయ్(25) మృతి చెందాడు. యువకుడు లింగోజిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. మంగళవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు బైక్పై వెళ్లి తిరిగొస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఉదయ్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
పలాస మండలం రామకృష్ణాపురంలో గల ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైందని ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి మంగళవారం తెలిపారు. 5వ తరగతి చదువుతున్న గీత చరిష్మా శ్రీకాకుళంలో జరిగిన జిల్లాస్థాయి అబాకస్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ప్రిన్సిపల్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని టీచర్స్ కోరారు.
అరసవల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా భక్తుల సందర్శన, రాకపోకలను శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వీ.మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం పరిశీంచారు. ఇంద్రపుష్కరిణిని పరిశీలించి అక్కడ భవిష్యత్తులో చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు.
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 2015, 2016, 2017, 2018, 2019 ఎడ్మిట్ విద్యార్థుల మొదటి, మూడో సెమిస్టర్ షెడ్యూల్ను యూనివర్సిటీ డీన్ మంగళవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ ఫిబ్రవరి 17 నుంచి 28వ తేదీ వరకు, 3వ సెమిస్టర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.