Srikakulam

News August 8, 2024

పలాస: రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

శ్రీకాకుళం జిల్లా పలాస- తుమ్మాదేవి రైల్వే స్టేషన్‌ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ ఐఎస్ కే షరీఫ్ గురువారం తెలిపారు. మృతుడి వయసు సుమారుగా 35 -40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 94406 27567 నంబర్‌ను సంప్రదించాలని ఎస్సై సూచించారు.

News August 8, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి బి.టెక్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్‌అంబేడ్కర్ యూనివర్సీటీ బీటెక్ 2వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఆగష్టు 13వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.800 ప్రాక్టికల్, వైవా రూ.250 ఫీజుతో కలిపి మొత్తం రూ.1,050 లను చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధి రుసుముతో 16 వరకు రూ.2000 అపరాధ రుసుముతో 17 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.

News August 8, 2024

హీరోగా ఎంట్రీ ఇస్తున్న సిక్కోలు కుర్రాడు

image

‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాను నిహారిక కొణిదెల నిర్మించారు. శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పాలకమండలి సభ్యురాలు పేడాడ రమణి కుమారి చిన్న కుమారుడు సందీప్ సరోజ్ ఈ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. గోదావరి జిల్లాలో 11 మంది యువకుల నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు యదు వంశీ తెరక్కెకించారు. పలువురు ఆయనకు శుభకాంక్షలు తెలుపుతున్నారు.

News August 8, 2024

శ్రీకాకుళం: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు శ్రీకాకుళం, పలాస మీదుగా తిరునల్వేలి – షాలిమార్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నం.06087 TEN- SHM ట్రైన్‌ను ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 9 వరకు, నం.06088 SHM- TEN ట్రైన్‌ను ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 7 వరకు పొడిగించినట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్‌లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి,విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.

News August 8, 2024

శ్రీకాకుళం: జిల్లాలో జనసేన 61,982 సభ్యత్వాలు నమోదు

image

జిల్లాలో జనసేన సభ్యత్వాలు భారీగా నమోదుయ్యాయిని పార్టీ ప్రతినిధులు బుధవారం తెలిపారు. జూలై 18 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమై 5 వ తేది సోమవారం సాయంత్రం వరుకూ నిర్వహించారు. ఇచ్ఛాపురం -11,355 సభ్యత్వాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎచ్చెర్ల – 10,136, పలాస- 6,302, పాలకొండ-5,744, పాతపట్నం-5,404, రాజాం-5,259, ఆమదాలవలస-5,118, శ్రీకాకుళం-5,022, టెక్కలి-4,406, నరసన్నపేట- 3,236 సభ్యత్వాలు నమోదయ్యాయి.

News August 8, 2024

ఎచ్చెర్ల: డయేరియాతో వ్యక్తి మృతి

image

ఎచ్చెర్ల నియోజకవర్గం జి. సిగడాం మండలం మెట్టవలసలో డయేరియా బారిన పడి గొర్లె చిన్న అప్పాలనాయుడు (70) వృద్ధుడు మృతి చెందాడు. ఈ నెల 4న విరోచనాలు, వాంతులు కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలో బాధితుల సంఖ్య 73కు చేరింది. 34 మంది శ్రీకాకుళం, రాజం, పొందూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 28 మంది గ్రామంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు.

News August 8, 2024

శ్రీకాకుళంలో రేపు మేగా జాబ్ మేళా

image

శ్రీకాకుళం నగరంలోని బలగ జంక్షన్ ప్రభుత్వ DLTC ఐటీఐ కళాశాలలో ఈ నెల 9వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో రెండు ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, అర్హతతో (18- 40 ) సంవత్సరాల మధ్య వయస్సుగల వారు అర్హులన్నారు. సంబంధిత ధ్రువపత్రాలు ఒరిజినల్, జిరాక్స్‌లు తీసుకుని శుక్రవారం ఉదయం హాజరుకావాలన్నారు.

News August 8, 2024

శ్రీకాకుళం: నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎం‌సీ ఎన్నికలు

image

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు పోలీసు, రెవెన్యూ, మండల పరిషత్ శాఖల సమన్వయంతో విద్యా శాఖాధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ప్రతీ పాఠశాలలో ఉదయం గురువారం ఉదయం 7.గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగిస్తారు. అనంతరం 3 గంటలకు నూతన కమిటీలతో తొలి సమావేశం నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

News August 8, 2024

నందిగం: వరకట్నం కేసులో నలుగురికి జైలు, జరిమానా

image

నందిగం మండలం దొడ్ల రామచంద్రాపురం గ్రామానికి చెందిన కర్రి హేమలతను వరకట్నం కోసం వేధించిన కేసులో ఆమె భర్త నర్తు హేమరాజు, అత్త కనకమ్మ, గోపాలరావు, సరోజినీలకు జైలుశిక్ష జరిమానా విధిస్తూ బుధవారం టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌హెచ్‌ఆర్ తేజాచక్రవర్తి తీర్పును వెల్లడించారు. 2018లో నందిగంలో నమోదు అయిన వరకట్నం వేధింపుల కేసు రుజువు కావడంతో భర్తకు 11 నెలలు, మిగతా ముగ్గురికి మూడు నెలలు జైలు శిక్ష విధించారు.

News August 8, 2024

శ్రీకాకుళం: పంట వివరాలను నమోదు చేయాలి

image

రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబరు 15వ తేదీలోగా ఈ- పంట పేరిట నమోదు పూర్తి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఈ సమావేశానికి వ్యవసాయ దాని అనుబంధ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతులకు పంట సాయం, పంట నష్టరిహారం, పంటల బీమా సమాచారం సేకరించాలన్నారు.