India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బుక్క నాగరాజు గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం రాత్రి ఆయన స్వగృహంలో గుండెపోటు రావడంతో బంధువులు హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈయన హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన మృతి పట్ల జిల్లా హోంగార్డుల సంఘం సభ్యులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది.
మీకోసం కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం మీకోసం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వినతులు అందించారు. తన దృష్టికి వచ్చిన వాటిని సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 58 అర్జీలు వచ్చాయని ఎస్పీ వెల్లడించారు.
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన జంగం తరుణ్(16) ఈ నెల 17వ తేదీన సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన సంగతి తెలిసిందే. పోలీసులు నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం కొత్తపేట తీరానికి చేరిందని ఎస్సై నిహార్ తెలిపారు. దీంతో వజ్రపుకొత్తూరు మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సిడిసి)-2025 ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బాలమురళీకృష్ణ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు 14 రోజుల పాటు జరుగునున్న ఈ సర్వేలో సీహెచ్వోలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేస్తారని తెలిపారు. అదనపు డీఎంహెచ్ఓ డా. శ్రీకాంత్, డా.మేరీ కేథరిన్, డా.ప్రవీణ్, డీపీఎంఓ వాన సురేశ్ పాల్గొన్నారు.
రథసప్తమి సందర్భంగా చేస్తున్న అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం అరసవల్లి మిల్లి జంక్షన్, అరసవెల్లి రోడ్డు మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును తెలుసుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొంత మంది వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం ఆర్థిక సహాయం అందించడంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఉక్కుకర్మాగారం ఊపిరి తీసింది మాజీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన విమర్శించారు.
పాతపట్నం మేజర్ పంచాయతీ దువ్వారి వీధికి చెందిన పెద్దింటి తిరుపతిరావు పై హత్య ప్రయత్నం జరిగింది. తిరుపతి నిద్రిస్తుండగా రాత్రి 3 గంటల సమయంలో (ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం) గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో మెడ పైన దాడి చేయడం జరిగింగి. తిరుపతిరావు ఓ పత్రిక రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. వైసీపీ కార్యకర్తగా ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం రెండో పోలీసు స్టేషన్ పరిధిలో గల న్యూ కాలనీలో ఆదివారం రాత్రి సమయంలో పూజారి కళావతి అనే ఆమె హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి హత్య ప్రదేశాన్ని ఆదివారం అర్ధరాత్రి హుటాహుటిన సందర్శించి బాధితులతో హత్య ఘటనకు కారణాలు ఆరా తీశారు. అదేవిధంగా నేర ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 20 నుంచి 31వతేదీ వరకు అన్ని మండలాల్లో రోజుకు రెండు పంచాయితీల చొప్పున పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ జేడీ డాక్టర్ కె.రాజ్ గోపాల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి ఈ శిబిరాలు నిర్వహిస్తామని, పశువులకు సాధారణ చికిత్సలు, గర్భకోస వ్యాధులకు పరీక్షలు చేసి మందులు అందిస్తామన్నారు.
ఇచ్ఛాపురం పట్టణంలోని సంతపేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం బోనసాల ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంతపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు బలంగా ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, సోంపేట ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులను గాయపడ్డారు. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.