Srikakulam

News July 31, 2024

చాకిపల్లిలో మహిళ పై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

image

టెక్కలి మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన బొమ్మాళి జ్యోతి అనే మహిళ తనపై గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు దాడి చేశారని మంగళవారం టెక్కలి పోలీసులకు పిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన పంగ చంద్రమౌళి, వాన నారాయణ, పొందర శ్రీనివాసరావు, యాళ్ల అప్పారావు, యాళ్ల హేమలత తనపై దాడి చేసి దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీకి ఓటు వేశారని అక్కసుతోనే దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

News July 31, 2024

మందస: రోడ్డు ప్రమాద మృతుల వివరాలు లభ్యం

image

శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతీ, యువకుడు మృతిచెందిన విషయం విదితమే. మృతులు మందస మండలం కడుముసాయి గ్రామానికి చెందిన సవర హర్యాని(25), సవర జీవన్ (21)గా పోలీసులు గుర్తించారు. ఇందులో వదిన, మరిది దుర్మరణం పాలయ్యారు. తణుకు నుంచి బైక్ పై గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో ఘటన జరిగింది. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

News July 31, 2024

‘రూఫ్ టాప్ నిర్మించుకొని, విద్యుత్ బిల్లును తగ్గించుకోండి’

image

రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకొని విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలని జిల్లా విద్యుత్ పంపిణీ సంస్థ సూపరిండెంట్ ఇంజినీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దీనికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం, విద్యుత్ సమస్యలు పరిష్కారం కోసం 1912 టోల్ ఫ్రీ ఏర్పాటు చేశామన్నారు.

News July 30, 2024

BREAKING: శ్రీకాకుళం జిల్లాలో యువతీ, యువకుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం గొప్పిలి ప్రాంతానికి చెందిన యువతీ, యువకుడు మృతిచెందారు. జాతీయ రహదారి ఫ్లై ఓవర్ వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డుపై పడి యువతి మృతిచెందగా.. ఫ్లై ఓవర్ పైనుంచి కిందపడి యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 30, 2024

ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ సార్వతిక విద్యాపీఠం (APOS) ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులకు అడ్మిషన్ పొందడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. పదో తరగతి చేరుటకు 14 ఏళ్లు, ఇంటర్మీడియట్ చేరుటకు 15 ఏళ్లు నిండిన వారు అర్హులు. అప్లికేషన్ ప్రారంభం తేదీ 31-07-2024, అప్లికేషన్ చివరి తేదీ 27-08-2024. వెబ్ సైట్: www.apopenschool.ap.gov.in

News July 30, 2024

ఆమదాలవలసలో ‘ఆకలి’ మూవీ షూటింగ్ ప్రారంభం

image

చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలోని పాలపోలమ్మ అమ్మవారి ఆలయం ఆవరణలో జరుగుతున్న ‘ఆకలి’ చిత్ర షూటింగ్‌ను మంగళవారం ఆయన క్లాప్ కొట్టి ప్రారంభించారు. కళింగ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అప్పారావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో చిత్ర హీరోలు, హీరోయిన్స్, నటులు సనపల అన్నాజీరావు, కృష్ణారావు, టీడీపీ నాయకులు తంబి, రమేశ్ పాల్గొన్నారు.

News July 30, 2024

శ్రీకాకుళం: సెప్టెంబర్ 23 నుంచి సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంసీఏ రెండో సెమిస్టర్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ రెండో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మంగళవారం తెలిపారు. పరీక్షల టైం టేబుల్‌ను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

News July 30, 2024

శ్రీకాకుళం టూ టౌన్ కానిస్టేబుల్ మృతి

image

శ్రీకాకుళం టూ టౌన్ ‌కానిస్టేబుల్ మాధవ్ మంగళవారం మృతిచెందారు. ఇటీవల స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడ ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం మృతిచెందారు. జిల్లాలోని పలువురు పోలీసులు ఆయనకు సంతాపం తెలిపారు. కాగా, రణస్థలం మండల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎం.సతీశ్ కూడా అనారోగ్యంతో ఈరోజు వేకువజామున మృతిచెందారు.

News July 30, 2024

REWIND: ప్రజల మేస్త్రి.. రావి శాస్త్రి

image

తన మాటలు, రచనలతో ఉత్తరాంధ్ర మాండలిక విశిష్టతను జిల్లాకు చెందిన రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి) విశ్వవ్యాప్తి చేశారు. శ్రీకాకుళంలో 1922 జులై 30న జన్మించి, న్యాయవాది వృత్తిలో స్థిరపడి తన వద్దకు వచ్చే క్లయింట్లు, అణగారిన వర్గాలు, పేదల జీవితాలనే తన కథా వస్తువులుగా చేసుకొని ఎన్నో సృజనాత్మక, కవితాత్మక రచనలు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్నో పురస్కారాలు, బిరుదులు అందుకున్నారు.

News July 30, 2024

రణస్థలం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మృతి

image

రణస్థలం మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జరిగింది. వివరాలకు వెళితే స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎం.సతీష్ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలో ఆయన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే మంగళవారం వేకువజామున ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.