Srikakulam

News July 27, 2024

శ్రీకాకుళం: పంట బీమాకు ప్రభుత్వం కసరత్తు

image

జిల్లాలోని దాదాపు 5,25,912 మంది రైతులకు పంట బీమా చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 6,47,504 ఎకరాల పంట భూమి ఉంది. టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య రూ.360 కోట్లను వివిధ రూపాల్లో రైతులకు లబ్ధి చేకూర్చింది. YCP ప్రభుత్వం కొందరికి బీమా చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది రైతులందరికి లబ్ధి చేకూర్చేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు.

News July 27, 2024

శ్రీకాకుళం: IIIT ప్రవేశాలకు తొలి రోజు 461 మంది హాజరు

image

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు సర్టిఫికెట్ల పరిశీలనకు 515 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 461 మంది హాజరయ్యారు. 54 మంది గైర్హాజరయ్యారు. హాజరైన వారిలో 296 బీసీ, 56 ఎస్సీ, 78 ఈడబ్ల్యూఎస్, 22 ఎస్టీ, 9 మంది ఓసీ విద్యార్థులు ఉన్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ తెలిపారు.

News July 27, 2024

శ్రీకాకుళం: ఇసుక ఉచితంగా సరఫరా చేసేందుకు చర్యలు

image

కొనుగోలుదారునికి ఇసుక రేటు అందుబాటులో ఉంటుందని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఇసుకపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు.

News July 26, 2024

శ్రీకాకుళం: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

శ్రీకాకుళం జిల్లా మీదుగా భువనేశ్వర్, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.17015/17016 విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ప్రస్తుతం 2 జనరల్ కోచ్‌లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 17016 రైలుకు నవంబర్ 14 నుంచి, 17015కు నవంబర్ 16 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News July 26, 2024

శ్రీకాకుళం: చోరీ సొమ్ముతో షార్ట్‌ ఫిల్మ్‌లు తీశాడు

image

సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలని శ్రీకాకుళం జిల్లా పొందూరు సీపానగద్దెంనాయుడుపేటకు చెందిన అప్పలనాయుడు సినిమాలో అవకాశాలు రాకపోవడంతో చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. చోరీ చేసిన డబ్బుతో జల్సాలు చేయడం, జూదమాడటమే కాకుండా షార్ట్‌ ఫిల్మ్‌లు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేవాడు. నిందితుడిని తెలంగాణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడి నుంచి 75 తులాల బంగారు, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

News July 26, 2024

శ్రీకాకుళంలో జాబ్ మేళా .. 29 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో మూడు ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూ నిర్వహించగా.. నిరుద్యోగ యువత 365 మంది హాజరయ్యారు. ఇందులో 29 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు ఆమె తెలిపారు.

News July 26, 2024

కీలుబొమ్మలా సర్పంచ్ వ్యవస్థ: శ్రీకాకుళం ఎమ్మెల్యే

image

గత ప్రభుత్వ హయాంలో సర్సంచ్‌ వ్యవస్థను జగన్ కీలుబొమ్మగా మార్చారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ధ్వజమొత్తారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా లభించిన సర్పంచ్ అధికారాలను వైసీపీ ప్రభుత్వం కాల రాసిందన్నారు. అంతే కాకుండా సర్పంచ్‌ల అనుమతి లేకుండా వందల కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం మంచి నీళ్లలా ఖర్చు చేసిందన్నారు. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

News July 26, 2024

ఎచ్చెర్ల IIITలో కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం: బాలాజీ

image

ఎచ్చెర్లలోని IIITలో నేడు కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ బాలాజీ తెలిపారు.
నేడు 515 మందికి, శనివారం 521 మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 100 మంది అధ్యాపకులతో 15 బృందాలు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టామన్నారు.

News July 26, 2024

పాతపట్నం: ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి

image

పాతపట్నంలోని శివశంకర్ కాలనీ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడిన ఈ ఘటనలో డ్రైవర్ బచ్చల గోపి (37) మృతి చెందాడు. పాతపట్నం నుంచి పర్లాకిమిడి వెళ్తుండగా రోడ్డుపై కుక్కలు రావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. తలకు గాయాలైన గోపిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 26, 2024

సరుబుజ్జిలి: అగ్రికల్చర్ అసిస్టెంట్ సస్పెండ్

image

సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కే.దుర్గారావు విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఏవో బొడ్డేపల్లి పద్మనాభం గురువారం తెలిపారు. మద్యం సేవించి విధులకు హాజరు కావడం విత్తనాలు, ఎరువుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.