India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్వతీపురం మండలం నర్సిపురం శివారులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వంగరలో కొట్టిశకు చెందిన లొలుగు. రాంబాబు(41), మోక్ష శివం (7) కుటుంబంతో బైక్పై రామభద్రపురంలోని అత్తవారింటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో లారీ బలంగా ఢీకొనడంతో రాంబాబు, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్న కుమారుడు, భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
శ్రీకాకుళంలో ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ జరగనుంది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత పేర్కొన్నారు.
సమీక్షకురాలిగా, సామాజికవేత్తగా రాణిస్తున్న యువ రచయిత్రి, కోస్టా సచివాలయం మహిళా పోలీస్ అమ్మోజీ బమ్మిడి ఐదోసారి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు తెలుగు అసోసియేషన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు గురువారం అమ్మోజీకి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. జనవరి 21న విజయవాడలో ప్రముఖుల చేతుల మీదుగా అమ్మోజీ తెలుగుతేజం అవార్డుతోపాటు రూ.10 వేలు అందుకోనున్నారు. ఆమె “అమ్మూ” కలం పేరుతో రచనలు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీపీఎం నేత కామ్రేడ్ బిజికే మూర్తి గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నేటి తెల్లవారుజామున మృతి చెందారని సీపీఎం నాయకులు గోవిందరావు తెలిపారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. సీపీఎం నాయకులు ఆయనకి సంతాపం తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీపీఎం నేత కామ్రేడ్ బిజికే మూర్తి గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నేటి తెల్లవారుజామున మృతి చెందారని సీపీఎం నాయకులు గోవిందరావు తెలిపారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. సీపీఎం నాయకులు ఆయనకి సంతాపం తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని కోసమాలలో వింత ఆచారం పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని దేవాంగుల వీధిలో కనుమరోజు భోగి జరుపుకోవడం వీరి ప్రత్యేకత. తర తరాలనుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారమని తెలిపారు. ఈ వీధిలో నేత కార్మికులు ఎక్కువగా ఉండటంతో పండగ రోజు కూడా నేత వస్త్రాలు నేయడంలో బిజీగా ఉంటారు. కాబట్టి భోగి రోజు సాధ్యంకాక కనుమ రోజు భోగి జరుపుకోవడం ఆచారంగా వస్తుందన్నారు.
సోంపేట బస్ స్టేషన్, హోటళ్లు, కిరాణా షాపులలో బుధవారం సోంపేట సీఐ మంగరాజు ఆధ్వర్యంలో పోలీసు జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా, నిషేధిత వస్తువుల కోసం ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీలలో పలువురు పోలీసు సిబ్బంది ఉన్నారు.
శ్రీకాకుళం మండలంలో అరసవల్లి గ్రామంలో ఉండే శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి సినీ నటుడు సాయి కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. స్వామిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ యర్రంశెట్టి భద్రాజీ, శ్రీస్వామి వారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.
వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.
Sorry, no posts matched your criteria.