Srikakulam

News June 30, 2024

సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ప్రయాణీకుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా సత్రాగచ్చి(SRC), సికింద్రాబాద్(SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07222 SRC- SC ట్రైన్‌ను జూలై 3 నుండి సెప్టెంబర్ 29 వరకు, నెం. 07221 SC- SRC ట్రైన్‌ను జూలై 2 నుండి సెప్టెంబర్ 28 వరకు నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం, అనకాపల్లి, విజయవాడ, రాజమండ్రిలో ఆగుతాయి.

News June 30, 2024

శ్రీకాకుళం: ఆర్టీసీ ప్రయాణికులకు అలెర్ట్

image

శ్రీకాకుళం నుంచి నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్లవలసిన బస్సులు అన్ని ఆదివారం నుంచి శ్రీకాకుళం వయా రామలక్ష్మణ్ జంక్షన్ మీదగా పెద్దపాడు చేరుకుంటాయని శ్రీకాకుళం రవాణా శాఖ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సులు పెద్దపాడు, రాగోలు జంక్షన్ మీదగా శ్రీకాకుళం చేరుకుంటాయని వెల్లడించారు. ప్రయాణికులు దీనిని గమనించాలని కోరారు.

News June 30, 2024

రోడ్డు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి

image

శ్రీకాకుళం వాసి బాలకృష్ణ పొట్టకూటి కోసం మహారాష్ట్రలోని కిన్వట్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదిలాబాద్ రూరల్ మండలం చందా గ్రామంలో ఉన్న తమకు తెలిసిన వారి ఇంటికి వెళ్లి ఆదివారం కిన్వట్‌కు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ప్రమాదవశాత్తు చందా బైపాస్ వద్ద బోర్డ్‌కు ఢీకొని కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.

News June 30, 2024

శ్రీకాకుళం: ఇన్స్టంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఇన్స్టంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ చివరి ఏడాది 5 సెమిస్టర్ థియరీ సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయిన రెగ్యులర్ అభ్యర్థులకు ఇన్స్టంట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారని డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. 4, 6వ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ వరకు ఉత్తీర్ణులై ఉండాలి. జులై 5వ తేదీలోగా పరీక్ష ఫీజు రూ.1000 చెల్లించాలి. పరీక్ష జులై 9న ఉంటుంది.

News June 30, 2024

శ్రీకాకుళం: గురుకుల ఫలితాల విడుదల

image

మహాత్మాజ్యోతిబాఫులే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6 నుంచి 9వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు జిల్లా కన్వీనర్‌ తెలిపారు. mjpabcwriers.apcfss.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకుని, ర్యాంకు కార్డు పొందవచ్చని చెప్పారు. ప్రతిభ జాబితా ప్రకారం ఖాళీలను అనుసరించి కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు.

News June 30, 2024

శ్రీకాకుళం: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు సెషన్‌కు సంబంధించి మొదటి కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లలో ప్రవేశాలకు రెండో విడతలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.గోపాలకృష్ణ తెలిపారు. జులై 24 లోపు ITI.GOV.AP.IN వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జులై 25 లోపు సీతంపేట, ఇతర ఏ ప్రభుత్వ ఐటీఐలో అయినా పత్రాల పరిశీలనలో పాల్గొనాలన్నారు. జులై 27న సీతంపేటలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.

News June 30, 2024

శ్రీకాకుళం: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్ మీదుగా అగర్తల (AGTL), సికింద్రాబాద్(SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07029 AGTL- SC ట్రైన్‌ను జూలై 5 నుంచి అక్టోబర్ 4 వరకు, నెం. 07030 SC- AGTL ట్రైన్‌ను జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి.

News June 30, 2024

శ్రీకాకుళం: అంబేడ్కర్‌ యూనివర్సిటీ ఫలితాల విడుదల

image

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ ప్రథమ, బీటెక్‌ ఎనిమిదో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను వర్సిటీ ఎగ్జామినేషన్‌ డీన్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ శనివారం విడుదల చేశారు. బీపీఈడీ ప్రథమ సెమిస్టర్‌లో 250 మంది, డీపీఈడీలో 46 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. బీటెక్‌ కోర్సులో సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్‌ ఎనిమిదో సెమిస్టర్‌లో 196 ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్‌లో చూసుకోవచ్చు.

News June 30, 2024

సోంపేట:పాకిస్థానీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన వీర జవాన్

image

సోంపేట మండలం మామిడిపల్లి పంచాయతీ చిన్న మామిడిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బొడ్డు దొరబాబు వీరత్వం ప్రదర్శించారు. JK బరాముల్లా జిల్లా, ఆదిపురా గ్రామంలో నిర్వహించిన 32 రాష్ట్రీయరైఫిల్ ఆపరేషన్‌లో పాల్గొని, డ్రోన్ సహాయంతో ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతమొందించారు. ఇంతటి సాహసం చూపిన దొరబాబు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి మెడల్ అందుకున్నారు.

News June 30, 2024

శ్రీకాకుళం: ఈవీఎమ్ గోడౌన్ పరిశీలించిన కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈవీఎం యూనిట్స్‌ను స్ట్రాంగ్ రూమ్‌లలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎంల గోడౌన్ సందర్శించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవిఎమ్ గోడౌన్ పరిశీలించినట్లు తెలిపారు.