Srikakulam

News July 22, 2024

శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

కళాశాలకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామానికి చెందిన గరుగు పవన్ కుమార్(17) కళాశాలకు వెళ్లకుండా ఇంట్లో ఫోన్లో ఆటలు ఆడుకుంటున్నారని మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మరణించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎచ్చెర్ల పోలీసులు తెలిపారు.

News July 22, 2024

శ్రీకాకుళం: ‘ఆధార్ క్యాంపులు అందరు వినియోగించుకోవాలి’

image

ఆధార్ స్పెషల్ క్యాంపులు అందరు వినియోగించుకోవాలి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆధార్ స్పెషల్ క్యాంపులను ఈనెల 23 నుంచి 27 తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందరూ ఆధార్ స్పెషల్ క్యాంపులు వినియోగించుకోవాలన్నారు. 

News July 22, 2024

శ్రీకాకుళం: వర్షాల కారణంగా పలు రైళ్ల దారి మళ్లింపు

image

కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గంలో భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు దారి మళ్లించారు. నం.18514 విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ప్రెస్, నం.18513 కిరండూల్ -విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు అరుకు మీదుగా వెళ్లేవి. వీటిని ముందస్తు జాగ్రత్తగా రాయగడ, విజయనగరం మీదుగా ఈనెల 24 వరకు కొనసాగిస్తారు. రైళ్లు కిరండూల్ వరకు వెళ్లకుండా దంతేవాడ నుంచి రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

News July 22, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు గమనిక.. ఫలితాల విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ ఏయూ విశ్వవిద్యాలయం పరిధిలో న్యాయవిద్య LLB 3,6,7 సెమిస్టర్‌ల ఫలితాలను ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫలితాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అనంతరం మూడో సెమిస్టర్‌లో 20 మంది, ఆరో సెమిస్టర్‌లో 18 మంది, 7 సెమిస్టర్‌లో 21 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

News July 22, 2024

శ్రీకాకుళం: ITIలో రెండో విడత కౌన్సిలింగ్

image

శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ITIలో మొదటి విడత కౌన్సిలింగ్‌లో మిగిలిన సీట్లకు రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ సుధాకర్ రావు తెలిపారు. ఈ మేరకు అర్హులైన 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీని కోసం ముందుగా https://iti.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 826 ప్రవేశాలు జరగగా 2782 సీట్లు ఉన్నాయి.

News July 22, 2024

జలుమూరులో భారీ చోరీ.. రూ.9లక్షల నగదు అపహరణ

image

జలుమూరు మండలం సురవరంలో ఆదివారం చోరీ జరిగింది. సురవరం గ్రామానికి చెందిన శివప్రసాద్ వృత్తిరీత్యా శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. ఆయన తల్లి గ్రామంలో ఉండేది. ఆమె ఇటీవల హైదరాబాద్‌లోని చిన్నకుమారుడి వద్దకు వెళ్లింది. శివప్రసాద్ ఆదివారం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా తలుపులు తెరచి ఉండటాన్ని గుర్తించారు. బీరువాలోని రూ.9 లక్షల నగదు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News July 21, 2024

మందస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం జిల్లా మందస-బారువ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎస్.కె షరీఫ్ ఆదివారం తెలిపారు. అతని వయసు సుమారుగా 20-25 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 94406 27567 నంబర్‌ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 21, 2024

ఇచ్ఛాపురం: డెంగ్యూ జ్వరంతో బీటెక్ విద్యార్థి మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం దానంపేటకు చెందిన తిప్పన విగ్నేష్ (21) డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. ఇటీవల డెంగ్యూ జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరిన విగ్నేష్ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ సైనిక్ ఉద్యోగికి రమణారెడ్డికి ఒక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు.

News July 21, 2024

గుజరాత్‌లో సిక్కోలు వాసి మృతి

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామానికి చెందిన వలస కూలీ గండుపల్లి జగన్(45) శనివారం సాయంత్రం గుజరాత్ రాష్ట్రం కాండ్లలో మృతి చెందారు. ఇటీవల జీవనోపాధి కోసం కుటుంబంతో సహా గుజరాత్ రాష్ట్రం వెళ్లిన జగన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News July 21, 2024

శ్రీకాకుళం రైతుల ఆందోళన

image

కుండపోత వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని మండలాల్లో ఖరీఫ్‌ సాగు ప్రారంభించారు. మొత్తం సాగు విస్తీర్ణం 1,68,662 హెక్టార్లుకాగా.. ఇప్పటికే 88,552 హెక్టార్లలో పంటలు వేశారు. అందులో వరి సాగు ఎక్కువ. ఈ ఏడాది ఇప్పటి వరకు 80,286 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. దమ్ముపట్టి ఉడుపులకు 5,144 హెక్టార్లలో ఆకుమడులు పెంచుతుండగా.. మరో 1,987 హెక్టార్లలో దమ్ములు పూర్తయ్యాయి.