Srikakulam

News January 10, 2025

పాలకొండ: అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్య

image

వీరఘట్టం మండలం సంత నర్సిపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. స్థానికుల కథనం మేరకు ఇంత రామకృష్ణ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలియడంతో పాలకొండ సీఐ చంద్రమౌళి, వీరఘట్టం ఎస్సై కళాధర్ శుక్రవారం ఉదయం పోలీస్ సిబ్బందితో వెళ్లి ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

News January 10, 2025

శ్రీకాకుళం: నేటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జనవరి 19 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. దీనితో విద్యార్థులు ఊళ్లకు పయనమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 3 లక్షల 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు కచ్చితంగా సెలవులు అమలు చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 10, 2025

SKLM: దొంగలు వస్తారు..జాగ్రత్త

image

శ్రీకాకుళం పట్టణ ప్రజలకు రెండో పట్టణ సీఐ పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండగకు గ్రామాలకు వెళ్లే పట్టణ ప్రజలు మీ విలువైన బంగారు ఆభరణాలు నగదు తీసుకుని వెళ్లాలని అన్నారు. లేకుంటే బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సీఐ చెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్ పరిధిలోని గురువారం ప్రచారం రథాల ద్వారా పట్టణ ప్రజలను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.

News January 9, 2025

శ్రీకాకుళం : రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

image

శ్రీకాకుళం జిల్లా అన్ని పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాతి సెలవులు 10వ తేదీ నుంచి 19 వరకు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు . అనంతరం పాఠశాలలు తిరిగి 20వ తేదీన తెరుచుకుంటాయన్నారు. రివిజన్ కోసం SSC,  ఇంటర్మీడియట్ విద్యార్థులకు హోమ్ వర్క్ ఇవ్వాలని ప్రిన్సిపాల్‌లకు సూచించారు.

News January 9, 2025

SKLM: అగ్నివీర్ వాయుసేన పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారత వాయుసేన 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ ద్వారా క్లరికల్, టెక్నికల్ క్యాడర్‌లలో అగ్నివీర్ వాయుసేన పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదలైందని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ, డిప్లొమా (పాలిటెక్నిక్) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. జనవరి 27, 2025 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్: https://agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News January 9, 2025

పాతపట్నం: లగేజ్ వ్యాన్ ఢీ.. వ్యక్తి మృతి 

image

పాతపట్నం మండలం కొరసవాడ శ్మశాన వాటిక సమీపాన గురువారం మధ్నాహ్నం స్కూటీ- లగేజీ వ్యాన్ ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన  మారెడ్ల కృష్ణారావు (53) గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.  

News January 9, 2025

శ్రీకాకుళం: ఇంటికి వెళ్దాం.. పండగ చేద్దాం

image

సంక్రాంతి సెలవుల నేపధ్యంలో గురువారం శ్రీకాకుళం జిల్లాలో వసతిగృహాల విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. శుక్రవారం నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో టెక్కలిలో మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలురు, బాలికల వసతిగృహ విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో వసతిగృహాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మళ్లీ పండుగ అనంతరం విద్యార్థులు వసతిగృహాలకు రానున్నారు.

News January 9, 2025

రేపు ప్రభుత్వ కార్యాలయాలలో ప్లాంటేషన్ ప్రారంభం

image

ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రమంత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో 315 ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించామని వివరించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.

News January 9, 2025

ఇచ్ఛాపురం: ప్రజా సంకల్ప యాత్రకు 6 ఏళ్లు

image

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 6 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పాదయాత్ర 2017 నవంబర్ 6 నుంచి 341 రోజుల పాటు సాగింది. 2019 జనవరి 9లో ముగిసింది. ఈ పాదయాత్ర 2019 ఏపీ శాసనసభ ఎన్నికల ముందు ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపునకు గుర్తుగా వైసీపీ శ్రేణులు ఒక స్తూపం నిర్మించారు. గురువారం ఇచ్ఛాపురం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్తూపం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు.

News January 9, 2025

తిరుపతి ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

image

తిరుపతిలో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులు మృతి కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఘటన దురదృష్టకరమన్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.