Srikakulam

News July 18, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

➤ రేపు జిల్లాకు రానున్న కేంద్ర మంత్రి రామ్మోహన్
➤ ఆవు పొట్టలో 70 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
➤ వినుకొండ ఘటన రాజకీయ హత్యే: ధర్మాన కృష్ణ దాస్
➤ శ్రీకాకుళం ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌కు దరఖాస్తులు ఆహ్వానం
➤ 9 నెలల్లో శ్రీకాకుళం స్టేడియం పనులు పూర్తి: అచ్చెన్న
➤ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి: మంత్రి అచ్చెన్న
➤ రాజేశ్ వీర జవాన్ పార్థీవ దేహం కోసం ఎదురుచూపులు
➤ జిల్లా ఎస్పీ రాధికకు ఆత్మీయ వీడ్కోలు

News July 18, 2024

శ్రీకాకుళం: రేపు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

image

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 9.40 గంటలకు ఇచ్ఛాపురం చేరుకొని స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని, మున్సిపల్ కార్యాలయంలో 10.30 గంటలకు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం పలు కార్యక్రమాలు పాల్గొంటారన్నారు.

News July 18, 2024

శ్రీకాకుళం: ఈ నెల 21న గ్రూప్-2 మాక్ టెస్ట్ 

image

ఎర్రన్న విద్యాసంకల్పం ద్వారా ఈ నెల 21న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. జిల్లా కేంద్రంలో విద్యాధరి డిగ్రీ కళాశాల, టెక్కలి విశ్వజ్యోతి కళాశాల, పలాస మదర్ థెరిసా పాఠశాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు https://bit.ly/YVSexam లింక్ ద్వారా పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 

News July 18, 2024

శ్రీకాకుళం జిల్లాలో 85.74 శాతం ప్రవేశాలు

image

ఉన్నత విద్యా మండలి ఇంజినీరింగ్ కళాశాల్లో సీట్ల అలాట్మెంట్‌ను బుధవారం ప్రకటించింది. ఏపీ ఈఏపీ సెట్-2024 ఎంపీసీ స్ట్రీమ్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఈ నెల ఒకటి నుంచి 13 వరకు ఆన్ లైన్‌లో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు ఇంజినీరింగ్ కళాశాల్లో 2154 సీట్లు ఉండగా 1847 సీట్లకు (85.74%) ప్రవేశాలు జరిగాయి. 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో సీట్లను భర్తీ చేశారు.

News July 18, 2024

టెక్కలిలో నోటాకు ఓటెత్తారు

image

2024 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలిలో నోటాకు రాష్ట్రంలోనే అత్యధికంగా 3.79% ఓట్లు పడ్డాయి. మొత్తంగా 7,342 మంది నోటాకు ఓటేశారు. ఈవీఎంలలో 3,660 మంది, పోస్టల్ బ్యాలెట్లలో 3,682 మంది నోటాకు జై కొట్టారు. పోలైన 1,93,713 ఓట్లలో అచ్చెన్న 55.71% ఓట్లు సాధించి టెక్కలిలో గెలిచారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన నివేదికలో వెల్లడించింది.

News July 18, 2024

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన పంట

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో ఎల్ఎన్ పేట, తదితర మండలాల్లో వంద ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభంలోనే ఇలా జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనం వేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదని, మొక్కదశలో ఉన్న పంట పొలాలు నీట మునగటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 18, 2024

రాష్ట్ర వైశ్య సంఘంలో జిల్లా వాసులకు చోటు ఇవ్వాలి: రాజేశ్

image

పార్వతిపురం జిల్లా వైశ్య సభ్యులకు రాష్ట్ర స్థాయి వైశ్య సంఘంలో చోటు కల్పించాలని టీడీపీ బీసీ సాధికారిక జిల్లా కో-ఆర్డినేటర్ కోరాడ రాజేశ్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు వైశ్యులకు చేరాలన్నా, జిల్లా వైశ్య కుటుంబాలు సమస్యలు చెప్పాలన్నా రాష్ట్ర కమిటీలో జిల్లా వైశ్య సభ్యులకు చోటు కల్పించాలన్నారు. వైశ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు.

News July 17, 2024

విశాఖ రేంజ్ డీఐజీని కలిసిన శ్రీకాకుళం ఎస్పీ

image

విశాఖపట్నం రేంజ్ నూతన డీఐజీగా బుధవారం బాధ్యతలు చేపట్టిన గోపీనాథ్ జెట్టిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు భేటీ అయ్యి శ్రీకాకుళంలోని పలు విషయాలను ఎస్పీ మహేశ్వర రెడ్డిని డీఐజీ అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీకి సూచించారు. ఎస్పీ వెంట జిల్లాలో పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.

News July 17, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం

image

సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మూలపేటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. 1,800 ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రభుత్వానికి ఏఏఐ వర్గాలు తెలిపాయి. ఆ శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో వేగంగా ఆచరణలోకి రావొచ్చనే చర్చలు ఊపందుకున్నాయి.

News July 17, 2024

శ్రీకాకుళం జిల్లాకు రేపు భారీ వర్షసూచన

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడా వర్షాలు పడతాయని కూర్మనాథ్ చెప్పారు.