India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఘన విజయం సాధించిన కోనేరు హంపిని మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కార్యలయం ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. కోనేరు హంపి గెలుపు దేశానికి గర్వకారణమన్నారు. రెండోసారి ప్రపంచ టైటిల్ను సాధించిన ఆమె ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. మహిళలు హంపిను ఆదర్శంగా తీసుకోని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
భామిని మండలం ఆస్పిరేషనల్ బ్లాక్ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని శనివారం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. నీతి ఆయోగ్ ప్రతి త్రైమాసికంలో సూచికల సాధనను విశ్లేషిస్తుంది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన బ్లాకులను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలోనే భామిని ఆస్పిరేషనల్ బ్లాక్ అగ్రస్థానంలో నిలవడంతో ప్రోత్సాహకంగా రూ.1.50 కోట్లు పొందిందని కలెక్టర్ తెలిపారు.
భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్లో అరుదైన రికార్డును అతి చిన్న వయసులో కైవసం చేసుకున్న విశాఖకు చెందిన నితీష్ నేటి యువ క్రీడాకారులకు ఆదర్శమని మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు కొనియాడారు. నితీష్ కుమార్ ప్రతిభకు, ఒత్తిడిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మనో ధైర్యానికి నిదర్శనమన్నారు. సోషల్ మీడియా వేదికగా ద్వారా శనివారం నితిష్ను అభినందించారు.
ఈ నెల 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి జిల్లా ప్రజలకు ఎస్పీ మహేశ్వర రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి బహిరంగ ప్రదేశాలలో రహదారులపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించరాదన్నారు. 31వ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ప్రజలు ఎవరూ రహదారులపై తిరగరాదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ బృందాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు జనవరి 3న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి. శ్రీధర్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు కార్యలయం నుంచి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు 6వ స్థాయి, 11.30 గంటలకు 3వ స్థాయి, మధ్యాహ్నం 12.30 గంటలకు 5వ స్థాయి సంఘం సమావేశం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 2, 4, 1, 7 స్థాయి సంఘాల సమావేశాలు జరగనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
కడప జిల్లాలో ఒక రైతు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం ఆరా తీశారు. రైతు కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. రైతు కుటుంబం మృతికి గల కారణాలు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ చేపట్టిన పోరుబాటకు ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ల నాయకత్వంలో ధర్నాలు చేపట్టారు. కాగా.. జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమానికి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ ముఖం చాటేశారు. పలువురు నేతలు కూడా గైర్హాజరయ్యారు.
విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే ఆ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వీరఘట్టం మండలంలో సంచలనంగా మారింది. తమ పిల్లలపై వికృత చేష్టలకు పాల్పడిన ఆ గురువు తెర్లి సింహాచలంకు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ చిత్రంలో ఉన్న ఆ కామాంధుడు ఇతనే.. ఈ వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వీరఘట్టం మండలం నడుకూరు సమీపంలో ఉన్న గురుబ్రహ్మ పాఠశాల ప్రిన్సిపల్ తెర్లి సింహాచలంపై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి కళాధర్ తెలిపారు. పాఠశాలలో చదువుతున్న 4, 5,6వ తరగతి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
ఎచ్చెర్ల ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్ పరేడ్ మైదానాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు PMT,PET పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రవేశం,వెళ్లే మార్గాలను ఎస్పీ పరిశీలించి, ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు అవసరమైన కౌంటర్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.