Srikakulam

News April 16, 2025

SKLM: అశ్లీల స్ట్రీమింగ్ ముఠా అరెస్ట్

image

నిషేధిత వెబ్‌సైట్‌లపై లైవ్ న్యూడ్ వీడియోలు ప్రసారం చేస్తున్న సిక్కోలుకు చెందిన ఇద్దరిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఐజీ రవికృష్ణ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం, గుంతకల్లుకు చెందిన ముగ్గురు నిందితులు గణేశ్, జ్యోత్స్న, లౌయిస్ అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 3 కేసులు నమోదు చేశారు. ముఠా మరెంత మంది బాధితులను టార్గెట్ చేసిందన్న విషయంపై విచారణ సాగుతోంది.

News April 16, 2025

సమ్మర్ హలిడేస్.. ప్రకృతి అందాలకు సిక్కోలు నెలవు

image

వేసవి సెలవుల్లో కుటుంబసమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు సిక్కోలు జిల్లాలో ప్రకృతి అందాలెన్నో ఉన్నాయి. జిల్లాలో ఉద్దానం ప్రాంతంలోని జీడి, మామిడి, పనస తోటలు కేరళను తలపిస్తాయి. బారువ బీచ్, లైట్‌హౌస్, హిరమండలం గొట్టాబ్యారేజ్, శాలిహుండం బౌద్ధ స్తూపాలు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మనాథుడి దేవస్థానాలు, మూలపేట పోర్టు, కళింగపట్నం బీచ్ లైట్ హౌస్ ఇలా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి.

News April 16, 2025

తెలంగాణలో కొత్తూరు వాసి ఆకస్మిక మృతి

image

కొత్తూరు మండలానికి చెందిన కూన చిరంజీవులు(57) తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా శ్రీరాంపురం ఏరియా డీజీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న తర్వాత స్నేహితులతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన భోజనం ముగించుకుని సేద తీరేందుకు కుర్చీలో కూర్చుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

News April 16, 2025

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 180 పోస్టులు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 180 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 71 SGT(ప్రాథమిక స్థాయి), 109 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

News April 16, 2025

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 180 పోస్టులు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 180 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 71 SGT(ప్రాథమిక స్థాయి), 109 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

News April 15, 2025

SKLM: పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, పరిపాలనాపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో భూ పరిపాలన, తాగునీటి సరఫరా, ఐసీడీఎస్, గ్రామ సచివాలయాల పనితీరు వంటి కీలక అంశాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News April 15, 2025

శ్రీకాకుళం: ఏపీ మోడల్ పాఠశాల పరీక్షల తేదీ మార్పు

image

ఏపీ మోడల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలు తేదీ ఏప్రిల్ 21కి మార్పు జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 20వ తేదీన “ఈస్టర్” పండగ ఉండటం వలన తేదీ మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గల 13 మోడల్ పాఠశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్ 21కి పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు.

News April 15, 2025

శ్రీకాకుళం: జిల్లాలో 857 చలివేంద్రాలు ఏర్పాటు

image

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు జిల్లాలో 857 చలివేంద్రాలు మంగళవారం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 912 గ్రామ పంచాయతీల్లో ఈ చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సర్వే ప్రకారం ఈ చలివేంద్రాలలో 137 ప్రభుత్వ శాఖల ద్వారా, 693 స్థానిక సంస్థల ద్వారా, 27 స్వచ్చంద సంస్థల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి మానిటరింగ్ అధికారిని నియమించి పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 15, 2025

శ్రీకాకుళం: మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ

image

మెగా డీఎస్సీ (ఎస్జీటీ & స్కూల్ అసిస్టెంట్‌- అన్ని సబ్జెక్టులు) పరీక్షలకు సిద్ధమవుతున్న జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ)ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఆన్‌లైన్ శిక్షణను అందిస్తోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో ఉండే ఈ శిక్షణకు టెట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.

News April 15, 2025

శ్రీకాకుళం: రాగల మూడు గంటలు అప్రమత్తం

image

రాగాల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ మంగళవారం తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేటప్పుడు పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.