Srikakulam

News January 12, 2026

SKLM: విద్యుత్ సమస్యలపై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

image

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలపై AP విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి27వరకు ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం SE నాగిరెడ్డి కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విచారణలు హైబ్రిడ్ విధానంలో యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందన్నారు. టెక్కలి పలాస డివిజన్ కార్యాలయాల నుంచి పాల్గొనవచ్చన్నారు.

News January 12, 2026

శ్రీకాకుళం: నాలుగు సార్లు MLA.. రెండు సార్లు మంత్రి!

image

జిల్లాలో ప్రభావవంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందిన గుండ అప్పల సూర్యనారాయణ తన రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేకమైన ముద్ర వేశారు. 1985లో TDP నుంచి శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. అప్పటి నుంచి 2004 వరకూ వరుసగా 4 సార్లు శ్రీకాకుళం MLAగా గెలుపొందుతూ వచ్చారు. 1987లో కరువు శాఖ మంత్రిగా, 1989లో బీసీ, ఎస్సీ, సాంఘిక సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు.

News January 12, 2026

పలాసలో భయపెట్టిస్తున్న గన్ కల్చర్‌

image

పలాస‌లో మరోసారి గన్ కల్చర్‌తో అలజడి రేగింది. ఈనెల 9న పలాస రైల్వే టూ వీలర్ పార్కింగ్ స్థల టెండర్ విషయంలో గన్, కత్తులతో కొందరు బెదిరింపులకు పాల్పడగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 NOVలో ఓ టీడీపీ నేత హత్యకు గన్స్‌తో వచ్చిన సుపారీ గ్యాంగ్ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలు 1978-80ల నాటి క్రైమ్‌ను ప్రజలకు గుర్తు తెస్తున్నాయి. అప్పట్లోనూ నాటు తుపాకులు, కత్తులతో దాడులు చేసి ముగ్గురిని హతమార్చారు.

News January 12, 2026

కాశీబుగ్గ: చిన్న తిరుపతి వెంకన్నకు కష్టాలు తప్పవా?

image

తిరుపతిలోని వేంకటేశ్వురుడి దర్శనం జరగనందున ఆవేదన చెంది కాశీబుగ్గలో ఏకంగా ఆ శ్రీనివాసుడికి ధర్మకర్త పండా గుడి కట్టారు. భక్తుల దర్శనాలు జరుగుతున్న క్రమంలో..గతేడాది NOV1న తొక్కిసలాటలో 9 మంది మృతి చెందగా ఆలయాన్ని మూసేశారు. పునఃప్రారంభానికి శరవేగంగా పనులవుతున్నాయి. ఇంతలోనే భారీ <<18834092>>చోరీ<<>> జరిగింది. పూజలందుకోవాల్సిన వెంకన్నకు కష్టాలు తప్పడం లేదని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.

News January 12, 2026

అంతర్జాతీయ బ్యాడింటన్ పోటీలకు అంపైర్‌గా కవిటి వాసి

image

కవిటి గ్రామానికి చెందిన తుంగాన శరత్ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు అంపైర్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 13-18 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే పోటీలకు ఆయన అంపై‌ర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఎంపికకు సంబంధించి రాష్ట్ర, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ల నుంచి ఆదివారం అధికారిక ఉత్తర్వులు అందినట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జయరాం తెలిపారు.

News January 12, 2026

శ్రీకాకుళం: జనరల్ బోగీలతో ప్రత్యేక రైలు..ఈ నెల18 వరకే ఛాన్స్

image

సంక్రాతి వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల12-18 వరకు జనసాధారణ్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వాల్టేర్ డివిజన్ సీనియర్ డీసీ పవన్ కుమార్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-విజయవాడ(08567-68) ట్రైన్ విశాఖలో ఉదయం 10గం.లకు బయలుదేరి సాయంత్రం 4గం.టలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ-విశాఖ మధ్య సాయంత్రం 6.30. గంలకు ప్రారంభమై అర్ధరాత్రి12.30 గం.ల వరకు నడవనుంది.

News January 12, 2026

శ్రీకాకుళం: UTF రాష్ట్ర కార్యదర్శిగా కిషోర్ కుమార్

image

ఏపీ ఐక్య టీచర్ ఫెడరేషన్ (యూటీఎఫ్ )రాష్ట్ర కార్యదర్శిగా శ్రీకాకుళానికి చెందిన కిషోర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరులో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఈయనను ఎంపిక చేశారు. గత కొన్నేళ్లుగా కిషోర్ కుమార్ టీచర్ల సమస్యలపై పనిచేస్తున్నారు. వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఉపాధ్యాయ ఉద్యమానికి అంకితమై, యూటీఎఫ్ అభివృద్ధికి విశేషంగా కృషి చేయడంతో మూడోసారి ఎన్నుకున్నారు.

News January 12, 2026

EEMT–2026 రిజల్ట్స్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌ర్‌గా సిక్కోలు విద్యార్థి

image

ఎడ్యుకేషనల్ ఎపిఫనీ (Educational Epiphany) సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 27 న నిర్వహించిన EEMT–2026 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఆదివారం ఆ సంస్థ కన్వీనర్ పుట్టం రాజు శ్రీరామచంద్ర మూర్తి అధికారికంగా ప్రకటించారు. 10వ తరగతిలో టెక్కలి మండలం సీతాపురం జడ్పీ హెచ్ పాఠశాల విద్యార్థి సకలభక్తుల భరత్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని హెచ్.ఎం పద్మావతి నిన్న తెలియజేశారు. విద్యార్థిని అభినందించారు.

News January 12, 2026

SKLM: నేడు ప్రజా ఫిర్యాదులు నమోదు

image

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను నేరుగా, ఆన్‌లైన్‌లోని Meekosam.ap.gov.inలో సమర్పించుకోవాలన్నారు. అర్జీలు సమర్పించిన వారు వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.

News January 12, 2026

SKLM: నేడు ప్రజా ఫిర్యాదులు నమోదు

image

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను నేరుగా, ఆన్‌లైన్‌లోని Meekosam.ap.gov.inలో సమర్పించుకోవాలన్నారు. అర్జీలు సమర్పించిన వారు వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.