Srikakulam

News July 1, 2024

ఒడిశా బీచ్‌లో ఇచ్ఛాపురం యువకుడి మర్డర్

image

ఒడిశాలోని సున్నాపురం బీచ్‌లో ఇచ్ఛాపురం మండలం కేదారిపురానికి చెందిన ఆశి బాలును పట్టణంలోని బెల్లుపడకు చెందిన కొందరు యువకులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాలు.. ఆదివారం బాలు తన స్నేహితులతో బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారితో బాలుకు ఘర్షణ జరిగింది. అది కాస్తా వివాదంగా మారడంతో నిందితులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 1, 2024

ఇన్‌స్టంట్ ఎగ్జామ్ అర్హుల జాబితా

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ తక్షణ పరీక్ష (INSTANT EXAM)కు సంబంధించి అర్హుల జాబితా సోమవారం విడుదలయ్యాయని ఎగ్జామినేషన్స్ డీన్ తెలిపారు. అలాగే కాలేజీలకు పరీక్షలో అర్హులైన విద్యార్థుల జాబితాను పంపనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

News July 1, 2024

టెక్కలి: కుటుంబంలో అందరూ వైద్యులే: డాక్టర్స్ డే స్పెషల్

image

టెక్కలి మండలం పోలవరానికి చెందిన ఓ కుటుంబంలోని తర్వాతి తరం అంతా వైద్యులే. రాజశేఖర్, విజయ్ కుమార్, దయ సోదరులు ముగ్గురు వైద్యులు. ఇంటికొచ్చిన కోడళ్లు కూడా వైద్యులు కావడం విశేషం. రాజశేఖర్ (పీడియాట్రిక్స్), భార్య స్రవంతి (గైనకాలజిస్ట్), విజయ్(జనరల్ మెడిసిన్) భార్య రోజా(MBBS), దయ(MBBS) పూర్తి చేసి ఎండీ జనరల్ మెడిసిన్ చదువుతున్నారు. దయ, రోజా మినహా మిగిలినవారు టెక్కలి జిల్లాసుపత్రిలో సేవలు అందిస్తున్నారు.

News July 1, 2024

సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలి: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రాధిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి వారితో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.

News July 1, 2024

రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా టాప్-1

image

పింఛన్ లబ్ధిదారుల సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే టాప్‌లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 3,19,147 లబ్ధిదారులున్నారు. ఈ నేపథ్యంలో వీరికి రూ.21.17 కోట్లను ఎన్టీఆర్ పింఛన్ల కానుకగా ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 82.63% లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీని తర్వాత నెల్లూరు జిల్లా 3,13,757 మందితో 2వ స్థానంలో ఉండగా.. 1,26,813 మంది లబ్ధిదారులతో అల్లూరి జిల్లా 26వ స్థానంలో ఉంది.

News July 1, 2024

SKLM: జిల్లా వ్యాప్తంగా 21,92,15 మందికి పెన్షన్లు అందజేత

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం 12.55 గంటలకు 21,92,15 మందికి పెన్షన్లు అధికారులు అందజేశారు. జిల్లా మొత్తం 3,19,702 పెన్షన్లు కాగా అధికారులు సచివాలయ సిబ్బందితో నేరుగా పెన్షన్ల అందజేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కూటమి నాయకులతో సహా ఉద్యోగులు శతశాతం పెన్షన్లు పంపిణీ పనిలో ఉన్నారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు బాబు వచ్చాడు.. పెన్షన్ ఇచ్చాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News July 1, 2024

శ్రీకాకుళం: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులకు ఇచ్చే అవార్డులకై దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. UG, PG విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు 2 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులకు https://www.awards.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రోజులోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఎంపికైన 35 మంది అధ్యాపకులకు మెడల్, సర్టిఫికెట్‌తో పాటు రూ.50,000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

News July 1, 2024

శ్రీకాకుళం: 25,760 మంది ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు

image

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 1, 2 సంవత్సరం చదువుతున్న 25,760 మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేయనున్నామని డివైఈవో శివ్వాల తవిటినాయుడు ఆదివారం తెలిపారు. జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 13 మోడల్ స్కూల్ కాలేజీలు, 25 కేజీబీవీలు, 9 సోషల్ వెల్ఫేర్, 12 హైస్కూల్ ప్లస్, ఒక్కొక్క ఎస్టి, మహాత్మ జ్యోతిబాయి పూలే రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి.

News July 1, 2024

శ్రీకాకుళం: దోమల నివారణను అజెండాగా స్వీకరిద్దాం

image

దోమల నివారణను ఎజెండాగా స్వీకరించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని పిలుపునిచ్చారు. నగరంలోని డీఎంహెచ్ ఓ కార్యాలయం వద్ద డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. దోమలు ప్రబలకుండా కాలువల్లో స్ప్రేయింగ్ చేయాలన్నారు.

News July 1, 2024

శ్రీకాకుళం వ్యాప్తంగా 1,43,008 మందికి పెన్షన్లు అందజేత

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 8.40 గంటలకు 1,43,008 మందికి పెన్షన్లు అధికారులు అందజేశారు. జిల్లా మొత్తం 3,19,702 పెన్షన్లు కాగా ఇప్పటికే జిల్లా అధికారులు సచివాలయ సిబ్బందితో నేరుగా పెన్షన్ల అందజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శతశాతం పెన్షన్లు పంపిణీ పనిలో ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే పెన్షన్లు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.