Srikakulam

News August 30, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

నరసన్నపేట: సాఫ్ట్ వేర్ టూ సినీ ఫీల్డ్
సంతబొమ్మాళిలో ఇద్దరిని కాటేసిన పాము
విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా నిలవాలి: రామ్మోహన్
జిల్లాలో పలు చోట్ల తెలుగు భాషా దినోత్సవం
లావేరులో 8 బైక్‌లు సీజ్
విద్యుత్ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
సోంపేట: బస్సు దిగుతూ జారిపడి హెచ్ఎం మృతి
ఎల్.ఎన్ పేట: జడ్పీ ఉన్నత పాఠశాలలో దొంగల హాల్‌చల్
ఎచ్చెర్ల: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

News August 29, 2025

సాఫ్ట్‌వేర్ టూ సినీ ఫీల్డ్.. నరసన్నపేట యువకుడి విజయ గాథ

image

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నరసన్నపేట(M) కోమర్తికి చెందిన అట్టాడ సృజన్ నిరూపించారు. సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాలపై మక్కువతో డైరెక్టర్ అయ్యారు. నాలుగేళ్ల క్రితం ఆనంద్ దేవకొండ హీరోగా ‘పుష్పక విమానం’ సినిమాకు కథ రాయడంతోపాటు దర్శకత్వం వహించారు. తన డైరెక్షన్‌లో ఇటీవల విడుదైన ‘కన్యాకుమారి’ సినిమాలో శ్రీకాకుళం అందాలను చాలా బాగా చూపించారు. సృజన్ తండ్రి అట్టాడ అప్పలనాయుడు ప్రముఖ కవి.

News August 29, 2025

విద్యుత్ అధికారులతో సమీక్షించిన మంత్రి అచ్చెన్న

image

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమీక్ష జరిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సమస్య రాకుండా చూడాలన్నారు. కరెంటు సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

News August 29, 2025

కంచిలి: రైలు ప్రయాణికులకు గమనిక

image

బ్మహపురం నుంచి సోంపేట మీదుగా విశాఖకు వెళ్లే ప్యాసింజర్ రైలు అనివార్య కారణాలతో మంగళవార, గురువారం, శుక్రవారం మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 4:20 గంటలకు బరంపురం నుంచి విశాఖపట్నం ప్రయాణించే ప్యాసింజర్ రైలు సర్వీసును నియంత్రించడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News August 29, 2025

రణస్థలం: యాక్సిడెంట్‌లో 20 ఏళ్ల యువకుడి మృతి

image

రణస్థలం మండలం సీతంవలస సమీపంలో గురువారం ద్విచక్ర వాహనం బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. జెఆర్‌పురం ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం..కేటీఎం బైక్‌పై ఇద్దరు యువకులు జెఆర్‌పురం నుంచి లావేరు అతివేగంగా వెళ్తుండగా వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. యాక్సిడెంట్‌లో బైక్ నడుపుతున్న ప్రభాస్ (20)మృతి చెందాడు. రాంబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News August 29, 2025

ఎచ్చెర్ల: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

ఎచ్చెర్ల హైవేపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకపాలెం నుంచి అల్లినగరం జిల్లా పరిషత్ హై స్కూలుకి వెళ్తున్న ఆటో డివైడర్ ని ఢీ కొని బోల్తా పడింది. ఘటనలో ఏడో తరగతి విద్యార్థి కొప్పిలి మనోజ్(13) మృతి చెందాడు. ఆటోలో మొత్తం ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. మిగిలిన వారికి చిన్న గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News August 29, 2025

ఆదిత్యుని ఆలయం మూసివేత

image

వచ్చే నెల 7న సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని మూసివేస్తామని ఆలయ ఈవో ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజున స్వామి వారికి నిత్యార్చనాలు, నివేదన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు దేవాలయాన్ని మూసివేసి, 8న ఉదయం తెరిచి సంప్రోక్షణం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 8న ఉ. 7:30 నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.

News August 29, 2025

ప్రయాణికులకు అలర్ట్..ఖుర్దా రోడ్ వరకే ఆ రైలు

image

శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ల మీదుగా ప్రయాణించే గుణుపూర్(GNPR)- కటక్(CTC) రైలు ఈ నెల 31న ఖుర్దా రోడ్ వరకే నడపనున్నట్లు రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రాక్ పనులు జరుగుతున్నందున..ఈ నెల 31న నెం.68434 GNPR- CTC మెము ఖుర్దా రోడ్ వరకు, అదే విధంగా నెం.68433 CTC- GNPR మెమో కటక్‌కు బదులుగా ఖుర్దా రోడ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు.

News August 29, 2025

SKLM: 30న ఉద్యోగ మేళాకు ఇంటర్వ్యూలు

image

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా జరగనుంది. ఆగస్టు 30న ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు జిల్లాఉపాధి కల్పనా అధికారి సుధ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ ఇండియా, గోడ్రెజ్ ఇండియా, డివిస్ లాబ్స్, సీల్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రైవేట్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

News August 29, 2025

టెక్కలి: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!

image

టెక్కలి పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం రాత్రి పలు దళిత సంఘాల ప్రతినిధుల సమక్షంలో ప్రేమ జంట ఒక్కటయ్యింది. స్థానికుల వివరాల మేరకు టెక్కలికి చెందిన కిరణ్మయి, విశాఖకు చెందిన శివ శంకర వరప్రసాద్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇరువురు విషయాన్ని వారి ఇంటిలో చెప్పిన నిరాకరించారు. దీంతో వీరిద్దరూ దళిత సంఘాల ప్రతినిధులు బోకర నారాయణరావు, యడ్ల గోపీ తదితరులు సమక్షంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యింది.