India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా హుబ్లీ(UBL), కతిహార్(KIR) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి 30 వరకూ ప్రతి బుధవారం UBL- KIR(నెం.07325), ఏప్రిల్ 12 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం KIR- UBL(నెం.07326) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో శ్రీకాకుళం రోడ్, పలాస, విజయనగరం, దువ్వాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
డా. బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి& ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలైనట్లు ప్రిన్సిపల్ ఎస్.రంగమణి వెల్లడించారు. పరీక్ష ఏప్రిల్ 13 ఆదివారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 5వ తరగతిలో ఉన్న 640 సీట్లకు 1216 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్లో ఉన్న 800 సీట్లకు 1318 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు చెప్పారు.
గ్యాస్ ధరల పెంపు సామాన్యుడి తలపై గుది బండలా మారింది. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఏకంగా రూ. 50 పెరగడంతో.. రూ. 878.50 కి చేరింది. మన శ్రీకాకుళం జిల్లాలో 6.92 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పెంచిన ధరతో నెలకు రూ. 3.46 కోట్లకు పైగా ప్రజలపై భారం పడనుంది. వాణిజ్య పనులకు ఉపయోగించే గ్యాస్ సిలిండరుపై రూ. 40 పెరిగింది.
ఎచ్చెర్లలో ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారని ఎచ్చెర్ల ఎస్.ఐ సందీప్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చెరుకూరి తిరుపతమ్మ (21), బేపల అనూష (18) లు ఎచ్చెర్లలోని శక్తి సదన్ మహిళా ప్రాంగణంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామం సమయం నుంచి కనిపించడం లేదన్నారు. ఆచూకీ తెలిసిన వారు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ నెంబర్ 63099 90816కు సమాచారం అందజేయాలని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని రోడ్డు రైల్వేలకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశం అయ్యారు. ఈ మేరకు మంగళవారం విశాఖపట్నంలో జాతీయ రహదారులు & రైల్వే DRM Waltair అధికారులతో కీలక నిర్ణయాలపై చర్చించారు. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పనులు వేగవంతం చేసి ప్రజలకు సకాలంలో అందించడానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు.
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాబోయే మే 10న జిల్లా స్థాయిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనునట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ సమీపంలో సూది కొండ వద్ద గుర్తుతెలియని యువకుడు రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ హరినాథ్ మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 20 నుంచి 25 ఉంటుందన్నారు. నీలం రంగు షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 89850 21143 నంబర్ను సంప్రదించాలన్నారు.
పార్లమెంట్లో రిజర్వేషన్ వర్గీకరణపై చర్చ జరిగే వరకు వర్గీకరణను రాష్ట్రపతి నిలుపుదల చేయాలని ఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఆదివారం పేట జంక్షన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. హేతుబద్దత లేని అశాస్త్రీయమైన వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని వారంతా డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఆక్వా ఫీడ్, సీడ్ ధరలు పెరగడంతో కుదేలైన ఆక్వా రైతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపంలో మరో పిడుగు పడింది. దిగుమతి సుంకాలు 27శాతానికి పెంచడంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై పన్ను భారం పడింది. ఈ దెబ్బతో రైతుకి ధర తగ్గిపోయింది. జిల్లా నుంచి ఎక్కువ శాతం అమెరికాకే ఎగుమతి అవుతుండగా.. 4వేల హెక్టార్లలో సాగు జరుగుతోంది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వేల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.
జిల్లా ప్రజలందరికీ ఆధార్ సేవలు సులభంగా అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలోని 732 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి 5 సచివాలయాలకు ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 146 ఆధార్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.