Srikakulam

News July 1, 2024

శ్రీకాకుళం వ్యాప్తంగా 1,43,008 మందికి పెన్షన్లు అందజేత

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 8.40 గంటలకు 1,43,008 మందికి పెన్షన్లు అధికారులు అందజేశారు. జిల్లా మొత్తం 3,19,702 పెన్షన్లు కాగా ఇప్పటికే జిల్లా అధికారులు సచివాలయ సిబ్బందితో నేరుగా పెన్షన్ల అందజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శతశాతం పెన్షన్లు పంపిణీ పనిలో ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే పెన్షన్లు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News July 1, 2024

శ్రీకాకుళం: పింఛన్ల పంపిణీ పై ఆరా తీసిన జిల్లా కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆన్‌లైన్‌లో పరిశీలించారు. సోమవారం ఉదయం స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారో పరిశీలించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పింఛను అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి రోజే శత శాతం పూర్తి కావాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

News July 1, 2024

శ్రీకాకుళం: రీ కౌంటింగ్ దరఖాస్తుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో రీ కౌంటింగ్, వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది. జూన్ 27న దరఖాస్తులు ప్రారంభం కాగా జులై 1వ తేదీతో గడువు ముగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1338 మంది విద్యార్థులు ఈ 10వ తరగతి సప్లిమెంటరీలో ఉత్తీర్ణత సాధించారు. వీరందరూ నేడు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

News July 1, 2024

శ్రీకాకుళం: ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!

image

కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీలో 7మంది విద్యార్థులకు ఏడుగురు టీచర్లు పని చేస్తున్నారు. గత ప్రభుత్వ పాఠశాలల విలీనంతో ఇక్కడ 3 నుంచి 10వ తరగతి నడుస్తోంది. గతేడాది 22 మంది ఉండేవారు. వారిలో పది విద్యార్థులు నలుగురు వెళ్లిపోగా 18 మంది మిగిలారు. ప్రస్తుతం 11 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో అన్ని తరగతులు కలిపి మొత్తం ఏడుగురు మిగిలారు. వారికి ఏడుగురు టీచర్లు బోధిస్తున్నారు.

News July 1, 2024

నేటి నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు

image

ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. జూలై 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. అనంతరం 8 నుంచి 12 వరకు ఆప్షన్ల ఎంపిక పూర్తిచేయాలి. 13న మార్పులకు అవకాశం ఉంటుంది. 16న అభ్యర్థులకు సీట్లను అధికారులు కేటాయించనున్నారు. 17వ తేదీన క్లాస్ వర్క్ ప్రారంభమవుతుంది.

News July 1, 2024

ఎచ్చెర్ల : నేటి నుంచి ఈఏపీసెట్ కౌన్సిలింగ్

image

ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈఏపీసెట్ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమవుతుందని సహాయ కేంద్ర జిల్లా సమన్వయకర్త జి.దామోదర్‌రావు ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ స్ట్రీమ్‌కు జులై 1నుంచి 7తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు కౌన్సిలింగ్ రుసుం చెల్లించాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1200 ఎస్సీ, ఎస్టీలు 600 చెల్లించాలని పేర్కొన్నారు.

News July 1, 2024

శ్రీకాకుళం: పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

image

శ్రీకాకుళం మండలం పెద్దపాడు గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సమూన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన చేతుల మీదగా లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. కలెక్టర్ స్వయంగా పెన్షన్ అందజేయడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, పింఛన్ల పంపిణీ సిబ్బంది పాల్గొన్నారు.

News July 1, 2024

నేడే పెన్షన్ పంపిణీ.. ఎంత ఇస్తారంటే !

image

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 3,19,702 మంది లబ్ధిదారుల ఉన్నారు. వీరికి రూ.213 కోట్ల మీద నిధులు మంజూరయ్యాయి. సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ముందుగా ప్రకటించిన అదనపు మొత్తం రూ.1,000 చొప్పున రూ.3,000, జూలై నెల రూ.4,000 కలిపి మొత్తం రూ.7,000 బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ పంపిణీ చేయనున్నారు.

News July 1, 2024

పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కుమార్తెకు ఉత్తమ కలెక్టర్ అవార్డు

image

పాతపట్నం మాజీ MLA రెడ్డి శాంతి కుమార్తె రెడ్డి వేదిత (ఐఎఎస్) ఆదివారం ఉత్తమ కలెక్టర్ అవార్డును అందుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ పట్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పక్కాగా అమలు చేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్) సూచీల ఆధారంగా ఈ అవార్డును అందజేశారు.

News July 1, 2024

శ్రీకాకుళం డీవీఈవోగా శివ్వాల తవిటినాయుడు

image

శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ విద్య నూతన డీవీఈవోగా(పూర్తి అదనపు బాధ్యతలు) పాలకొండకు చెందిన శివ్వాల తవిటినాయుడు ఆదివారం నియమితులయ్యారు. ప్రస్తుతం బూర్జ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆయన పనిచేస్తున్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణ అధికారిగానూ, పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల స్పెషల్ ఆఫీసర్ గానూ విధులు నిర్వర్తించారు.