India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తల్లి మృతిని గ్రహించలేక బిడ్డ అమ్మ కోసం వెతుకులాట చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఇటీవల అనకాపల్లి జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా బారువకు చెందిన సత్యనారాయణ భార్య నిర్మల మృతి చెందింది. అదే ఘటనలో ఆమె కుమార్తె ప్రవల్లికను ఒక యువతి కాపాడింది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి తల్లిని కోల్పోయింది. తల్లి మృతి చెందిన విషయం తెలియక ఆ చిన్నారి అయోమయపు చూపులు స్థానికులను కలచివేసింది.
గార మండలం మోగదాలపాడుకు చెందిన మత్స్యకారుడు పుక్కళ్ల సిద్ధార్థ (సర్దార్) (44) చేపలు వేట కోసం గుజరాత్లోని పోరుబందరు వెళ్లి అదృశ్యమయ్యారు. ఏప్రిల్ 8వ తేదీన వేట పూర్తైన తరువాత రూమ్కి రాలేదని బోట్ డ్రైవర్ గురుమూర్తి మంగళవారం తెలిపారు. అప్పటి నుంచి వెతికామని ఆయన కానరాలేదన్నారు. సిద్ధార్థకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కోటబొమ్మాళి గ్రామంలోని విద్యుత్ నగర్లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. మృతుడు బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన కోరాడ వాసుగా గుర్తించామన్నారు. SBI వెనుక ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఉరివేసుకున్నాడని అందిన సమాచారంతో పరిశీలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, మృతికి కారణాలు తెలయాల్సి ఉందని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలోని 2015, 2016, 2017,2018, 2019 ఎడ్మిట్ డిగ్రీ విద్యార్థులకు 2,4,6 సెమిస్టర్ పరీక్షలకు స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ను నేడు యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పరీక్షలు జూన్ 10వ తేదీ నుంచి జరుగుతాయని, పరీక్ష ఫీజు మే 17వ తేదీ లోపు చెల్లించవచ్చని తెలిపారు.
శ్రీకాకుళం కేంద్రంలో రాగోలులో సైనిక్ భవన్ నిర్మాణం సోమవారం జరిగింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భూమి పూజలకు హాజరై శంకుస్థాపన చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ సైనకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం-4 లో చదువుతున్న విద్యార్థిని చెన్నంశెట్టి జ్యోతికి ఇంటర్మీడియట్ MLTలో 984 మార్కులు సాధించినట్లు సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, శ్రీకాకుళం డివిజన్ అధికారి జి.చంద్రమౌళి సోమవారం తెలిపారు. హాస్టల్ నుంచి ఇంటర్ సెకండియర్లో 13మందికి 900 కు పైగా, ఫస్ట్ ఇయర్లో 11 మంది విద్యార్థులకు 450కి పైగా మార్కులు వచ్చాయన్నారు.
శ్రీకాకుళం రూరల్ మండలం గనగళ్లవానిపేట మొగ వద్ద నాగావళి నదిలో పడవపై నుంచి జారిపడి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే గనగళ్లవానిపేట గ్రామానికి చెందిన పుక్కళ్ల గణేశ్ (40) ఆదివారం చేపల వేటకు పడవపై వెళ్లి ఆయన జారిపడ్డాడు. ఎడమ చేతికి తాడు కట్టుకొని ఉండడం వలన వల లాగడంతో ఒడ్డుకు చేరలేక నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ శ్రీకాకుళం రూరల్ ఎస్సై రాము కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక సోమవారం నిర్వహించడం లేదని జిల్లా కెవి మహేశ్వర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం రద్దు చేశామని పేర్కొన్నారు. కావున ప్రజలంతా గమనించాలని కోరారు.
వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలను ఆదివారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 33 మంది సభ్యులతో పీఏసీని ఏర్పాటు చేశారు. పీఏసీ కన్వీనర్గా, సజ్జల రామకృష్ణారెడ్డి, కోఆర్డినేటర్లు తదితరులను నియమించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పీఏసీ మెంబర్గా ప్రకటించారు.
శ్రీకాకుళంలోని జడ్పీ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక రేపు సోమవారం నిర్వహించడం లేదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేశామని చెప్పారు. ప్రజలంతా గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.