Srikakulam

News November 26, 2024

పలాస: ఉరేసుకుని జవాన్ భార్య ఆత్మహత్య

image

పలాస మండలం ఈదురాపల్లిలో మీరజాక్షి (21) అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మెళియాపుట్టి(M) టకోయిగాతలవలస గ్రామానికి చెందిన మీరజాక్షికి 7 నెలల క్రితం ఈదురాపల్లి చెందిన జవాన్ వినోద్‌తో వివాహమైంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారం క్రితం ఇదే గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ జవాన్ భార్య సూసైడ్ చేసుకున్నారు.

News November 26, 2024

త్రిపురాన విజయ్ నేపథ్యం ఇదే..!

image

శ్రీకాకుళం జిల్లా యువకుడు IPLకు ఎంపికైన విషయం తెలిసిందే. టెక్కలికి చెందిన త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్య దంపతుల కుమారుడు విజయ్‌కు మొదటి నుంచి క్రికెట్ ఆసక్తి. ఈక్రమంలో పలు పోటీల్లో సత్తాచాటాడు. సోమవారం జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.30లక్షల బేస్ ప్రెస్‌‌కు దక్కించుకుంది. విజయ్ తండ్రి వెంకటకృష్ణరాజు సమాచారశాఖ ఉద్యోగి, తల్లి లావణ్య గృహిణి. విజయ్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

News November 26, 2024

మందస: ముగిసిన యుటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు

image

సామాజిక అంతరాలను రూపుమాపేదే విద్య అని యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. మందస మండలం హరిపురంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు సోమవారంతో ముగిశాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా, ప్రజలకు ఇబ్బంది వచ్చిన ప్రతి సందర్భంలోనూ వారిని ఆదుకోవడానికి యుటీఎఫ్ కార్యకర్తలు పని చేస్తారని తెలిపారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.

News November 25, 2024

SKLM: డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వగా ఆ గడువు 25వ తేదీతో ముగుస్తుంది. రూ.500 అపరాధ రుసుముతో 27 వరకు, రూ.1500 అపరాధ రుసుముతో ఈనెల 28 వరకు అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 12వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

News November 25, 2024

సీతంపేట: విషాదం మిగిల్చిన వనభోజనం

image

సీతంపేట మండలం అడలి వ్యూ పాయింట్ వద్ద ఆదివారం వన భోజనానికి వెళ్లిన ఒక కుటుంబం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వారు వెళ్తున్న బైక్ అదుపు తప్పి లోయలో పడింది. బైక్ మీద ఉన్న దుప్పాడ భారతి(33) (విద్య కమిటీ ఛైర్మన్) మృతి చెందారు. భర్త దుర్గారావు, చిన్నారులు మేఘన, పల్లవికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News November 25, 2024

SKLM: అయ్యప్పస్వామి భక్తులకు ప్రత్యేక రైలు

image

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి నేరుగా శబరిమల (కొల్లం) వరకు ప్రత్యేక రైలును డిసెంబరు 1 నుంచి జనవరి 19 తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తుందని, రైలు ప్రారంభించడంపై సంతోషంగా ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రైలు మంజూరు చేసినందుకు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులందరికీ సురక్షితంగా, శుభప్రదమైన యాత్ర జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.

News November 25, 2024

శ్రీకాకుళం: హాల్ టికెట్లు ఇవ్వకుంటే చర్యలు-కలెక్టర్

image

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల పేరుతో పరీక్షలు సంబంధించిన హాల్ టికెట్లు అందించలేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కచ్చితంగా అందజేయాలని కళాశాలలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుందని అన్నారు.

News November 24, 2024

శ్రీకాకుళం: హాల్ టికెట్లు ఇవ్వకుంటే చర్యలు-కలెక్టర్

image

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల పేరుతో పరీక్షలు సంబంధించిన హాల్ టికెట్లు అందించలేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కచ్చితంగా అందజేయాలని కళాశాలలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుందని అన్నారు.

News November 24, 2024

ఆడలి ఘాట్ వద్ద ప్రమాదం.. మహిళ మృతి

image

సీతంపేట మండలం ఆడలి వ్యూ పాయింట్ సందర్శించి తిరిగి వస్తున్న కుటుంబం వేలం గూడ ఘాట్ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. గాయాలైన వ్యక్తిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని సీతంపేట ఎస్ఐ అమ్మనరావు దర్యాప్తు చేపడుతున్నారు.

News November 24, 2024

IPL వేలంలో మన శ్రీకాకుళం కుర్రాడు.!

image

ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మన శ్రీకాకుళం జిల్లా ఆటగాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.