Srikakulam

News November 22, 2024

నాగావళి, వంశధార కోతల నియంత్రణపై డిప్యూటీ సీఎం స్పీచ్

image

నాగావళి, వంశధార నదీ ప్రాంతాల్లో తీర ప్రాంత కోతల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం చెన్నైలోని జాతీయ తీర ప్రాంత పరిశోధన కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. జాతీయ బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించిందని, అధ్యయన రిపోర్ట్ రాగానే ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటుందన్నారు.

News November 22, 2024

గార: పుట్టిన రోజు వేడుకలకు వచ్చి.. అనంత లోకాలకు

image

పుట్టిన రోజు చేసుకోవాల్సిన ఇంట్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గురువారం వమరవిల్లి ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు గొర్లె కృష్ణారావు (25) తన బంధువు కుమార్తె బర్త్ డే కోసం షాపింగ్‌కి వెళ్లి వస్తుండగా స్కూటీ అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 22, 2024

శ్రీకాకుళంలో నిరుద్యోగులకు జాబ్ మేళా

image

శ్రీకాకుళంలోని APSRTC కాంప్లెక్స్ దగ్గర ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో నిరుద్యోగ యువతకు ముత్తూట్ మైక్రోఫీల్డ్ సంస్థ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో ఎంపికైతే శ్రీకాకుళంలోనే ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. పోస్టులను బట్టి ఇంటర్, బీకాం, ఎంబీఏ విద్యా అర్హత కలిగి ఉండాలి. వయసు 18-26 ఏళ్లు పూర్తయిన వారు ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. > share it

News November 21, 2024

SKLM: రేపు ప్రజా ఫిర్యాదులు స్వీకరణ రద్దు: ఎస్పీ

image

కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదులు స్వీకరణ పరిష్కార కార్యక్రమం రేపు (శుక్రవారం) కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వలన నిర్వహించడం లేదని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిసర ప్రాంత ప్రజలు పై విషయాన్ని గమనించి ప్రజా ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమానికి కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు రావద్దని ఎస్పీ పేర్కొన్నారు.

News November 21, 2024

పీయూసీ కమిటీలో కూన రవికుమార్‌కు ఛాన్స్..!

image

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పీయూసీ ఛైర్మన్‌గా ఎన్నికైయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారని పేరుంది. 2024 ఎన్నికల్లో కూన రవికుమార్ తమ్మినేని సీతారాం పైన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో ఛైర్మన్‌గా పేరు ప్రతిపాదనలో నిలిచింది. రేపు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ ఎన్నిక జరగనుంది.

News November 21, 2024

SKLM: గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించాలి

image

ప్రణాళికాబద్ధంగా జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గృహ నిర్మాణశాఖ అధికారులకు స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, ప్రగతిపై కలెక్టరేట్‌లో గురువారం సమావేశంలో నిర్వహించారు. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలో 100 రోజుల వ్యవధిలో 5 వేల గృహాలు, ఏడాదిలోపు 35 వేల గృహాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.

News November 21, 2024

గార: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూటీ.. ఒకరు మృతి 

image

గార మండలం వమరవిల్లి ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాన్ని స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలకు వెళితే స్థానిక మండలం తోనంగి గ్రామానికి చెందిన కృష్ణారావు, గణేశ్ గురువారం మధ్యాహ్నం స్కూటీతో అతివేగంతో వెళుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ తాకిడికి విద్యుత్ స్తంభం నేలకు ఒరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందాడు.

News November 21, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటుకు వినతి.. మంత్రి ఏమన్నారంటే?

image

ఎచ్చెర్లలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈశ్వరరావు కోరారు. విశాఖకే కాకుండా ఐటీ పార్క్‌ను వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు సైతం విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఎచ్చెర్లకు దగ్గరలో అంతర్జాతీయ విమానశ్రయం, హైవే కనెక్టివిటీ, విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. టైర్2, టైర్ 3 సిటీల్లోనూ ఎకో వర్కింగ్ స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News November 21, 2024

నేడు పలాస రానున్న ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు

image

పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. వజ్రకొత్తూరు, మందస మండలాల పరిధిలో సుమారు 1,353 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. నేడు ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు రానున్నారు.

News November 21, 2024

ఒక ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్ రూ.2.04 లక్షలా: ఎమ్మెల్యే కూన

image

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్‌ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘గోద్రేజ్ కంపెనీ నుంచి కొనుగోలు చేయకుండా పక్కన పెట్టారు. ఇతర రాష్ట్రాల వారు రూ.1.30 లక్షలకే కొన్న రిఫ్రిజిరేటర్లను వైసీపీ వాళ్లు ఏకంగా రూ.2.04 లక్షలతో కొనుగోలు చేశారు. ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి. వీటిపై విచారణ చేపట్టాలి’ అని ఆయన కోరారు.

error: Content is protected !!