Srikakulam

News September 24, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

✦కొత్తమ్మతల్లి శోభాయాత్రను ప్రారంభించిన కలెక్టర్
✦SKLM: మీ ప్రతిభతో ప్రధాని మోదీని కలవొచ్చు
✦ఎచ్చెర్ల: రోడ్డు అధ్వాన్నం.. ప్రయాణం నరకప్రాయం
✦జిల్లాలో కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
✦ సోంపేట నుంచి విజయవాడకు భవానీ దీక్షపరులు సైకిల్ యాత్ర
✦ కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఆలయంలో అపచారం

News September 24, 2025

SKLM: మీ ప్రతిభతో ప్రధాని మోదీని కలవచ్చు

image

కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం మేర యువ భారత్ ఆధ్వర్యంలో ‘యువ నాయకులు (క్వీజ్) ప్రసంగ పోటీలు’ జరగనున్నాయి. వీటికి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులు అర్హులని మేర యువ భారత్ డిప్యూటీ డైరక్టర్ వెంకట్ ఉజ్వల్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలవారు https://www.MYBharat.gov.in వెబ్‌సైట్‌లో అక్టోబర్ 30లోగా నమోదు చేయాలన్నారు. ఎంపికైన వారు ప్రధాని మోదీ‌ని కలవచ్చునన్నారు.

News September 24, 2025

శ్రీకాకుళం: ప్రయాణికులకు గమనిక

image

దసరా పండుగ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిధిలోని నాలుగు డిపోల నుంచి దూర ప్రాంతాలకు 480 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 29 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ బస్సులు నడుస్తాయని ఆయన చెప్పారు. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా, సాధారణ ఛార్జీలు ఉంటాయన్నారు.

News September 24, 2025

SKLM: బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

image

బాల్య వివాహాలు జరిపిస్తే మత పెద్దలకు కఠిన చర్యలు తప్పవని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి హరిబాబు అన్నారు. బుధవారం శ్రీకాకుళం న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో బాల్య వివాహాలపై మత పెద్దలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలియజేశారు. బాలికలను బాగా చదివించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.

News September 24, 2025

SKLM: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

image

వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండటంతో రానున్న 4 రోజులు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 50కి.మీ వేగంతో గాలులు విస్తాయన్నారు. 08942-240557ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

News September 24, 2025

SKLM: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

image

వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండటంతో రానున్న 4 రోజులు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 50కి.మీ వేగంతో గాలులు విస్తాయన్నారు. 08942-240557ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

News September 24, 2025

SKLM: RTCలో అప్రెంటిస్‌కు దరఖాస్తులు

image

ITI పాస్ అయిన అభ్యర్థులు RTCలో అప్రెంటిస్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 25లోగా డీజిల్, మెకానికల్, ట్రేడ్లలో ఉత్తీర్ణులైన వారు https://www.apprenticeshipindia.gov.on వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 10న విజయనగరం RTC ట్రైనింగ్ సెంటర్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.

News September 24, 2025

ఎచ్చెర్ల: ‘ఈ నెల 25 నుంచి అంబేడ్కర్ యూనివర్సిటీకి దసరా సెలవులు’

image

ఎచ్చెర్లలో గల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలకు ఈ నెల 25 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 9వ తేదీన తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సమాచారాన్ని కళాశాలల యాజమాన్యం, విద్యార్థులు గమనించాలని సూచించారు.

News September 23, 2025

పోలాకి: పిడుగుపడి మహిళ మృతి

image

పోలాకి మండలం ఉర్జాం గ్రామానికి చెందిన కణితి పద్మావతి (55) మంగళవారం పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పొలంలో గాబు తీస్తున్న సమయంలో సమీపంలో పిడుగు పడడంతో మృతి చెందిందని మృతురాలు భర్త కృష్ణారావు తెలిపారు. మృతురాలికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పద్మావతి మృతితో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

News September 23, 2025

SKLM: DSCలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్య గమనిక

image

DSC‌లో ఎంపికైన అభ్యర్థులకు 25న విజయవాడలో సీఎం నియామక పత్రాలను అందజేయమన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం డీఈవో రవిబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. 24న ఉదయం 6 గంటలకు, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు అభ్యర్థులు చేరుకోవాలని, 37 ప్రత్యేక బస్సుల్లో విజయవాడు చేరుకుంటారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.