India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చన్నారు.
బ్యాంకు సముదాయాలు, బ్యాంకులు, నగదు లావదేవీలు జరిగే (ATM) కేంద్రాలు వద్ద భద్రత ప్రమాణాలు పాటిస్తూ, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి బ్యాంకు అధికారులను సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి బ్యాంకు ప్రవేశ ద్వారం దగ్గర నియమించిన గార్డు అప్రమత్తంగా ఉండాలని, ఆయనకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
పలాస మండలం ఈదురాపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శాసనపురి నవ్య(30) శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు కాశీబుగ్గ సూదికొండ ప్రాంతంలోని ప్రభత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనపై కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికలు వివరాల ప్రకారం.. బైక్-లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే పనిలో స్థానికులు ఉన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, శ్యామ్ ప్రసాద్కి బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్తో అండగా ఉంటూ క్యాడర్కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.
షిల్లాంగ్లో జరుగుతున్న నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమ్మిట్-2 లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం హాజరయ్యారు. పౌర విమానయాన శాఖ కార్యదర్శి వుమ్లున్ మంగ్ వుల్నామ్ అధికారులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. గిరిశిఖర ప్రాంతాల్లో సైతం విమాన సేవలు విస్తరించడానికి, ఈశాన్య భారతం యొక్క అపారమైన సామర్థ్యాన్ని పెంపొందించడంపై చర్యలు తీసుకుంటామన్నారు.
నరసన్నపేట పట్టణంలో అతిగా మద్యం తాగి ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. పోలాకి మండలం జిల్లేడు వలస గ్రామానికి చెందిన లబ్బ శ్రీనివాసరావు (34) గత రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి స్థానిక పల్లిపేట జంక్షన్ వద్ద మృతి చెంది ఉండడానికి గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పోస్టుమెట్రిక్ స్కాలర్ షిప్కి సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ తెలిపారు. కళాశాలలో చదువుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞానభూమి వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలన్నారు.
పత్తి కొనుగోళ్లపై వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. పత్తి రైతులకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు ఉండాలని అన్నారు. ఆయన వెంట కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు ఉన్నారు.
సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాతపట్నం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. మురళీకృష్ణ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, టీటీడీ అధ్యక్షులు బిఆర్ నాయుడుతో పాటు పలు సంస్థల అధినేతలపైన తప్పుగా మాట్లాడినందుకు ఫిర్యాదు చేసినట్లు కలమట తెలిపారు. ఫిర్యాదును ఎస్ఐ లావణ్యకు అందజేశారు. టీడీపీ నాయకులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.