India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీపీఎం నేత కామ్రేడ్ బిజికే మూర్తి గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నేటి తెల్లవారుజామున మృతి చెందారని సీపీఎం నాయకులు గోవిందరావు తెలిపారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. సీపీఎం నాయకులు ఆయనకి సంతాపం తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీపీఎం నేత కామ్రేడ్ బిజికే మూర్తి గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నేటి తెల్లవారుజామున మృతి చెందారని సీపీఎం నాయకులు గోవిందరావు తెలిపారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. సీపీఎం నాయకులు ఆయనకి సంతాపం తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని కోసమాలలో వింత ఆచారం పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని దేవాంగుల వీధిలో కనుమరోజు భోగి జరుపుకోవడం వీరి ప్రత్యేకత. తర తరాలనుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారమని తెలిపారు. ఈ వీధిలో నేత కార్మికులు ఎక్కువగా ఉండటంతో పండగ రోజు కూడా నేత వస్త్రాలు నేయడంలో బిజీగా ఉంటారు. కాబట్టి భోగి రోజు సాధ్యంకాక కనుమ రోజు భోగి జరుపుకోవడం ఆచారంగా వస్తుందన్నారు.
సోంపేట బస్ స్టేషన్, హోటళ్లు, కిరాణా షాపులలో బుధవారం సోంపేట సీఐ మంగరాజు ఆధ్వర్యంలో పోలీసు జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా, నిషేధిత వస్తువుల కోసం ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీలలో పలువురు పోలీసు సిబ్బంది ఉన్నారు.
శ్రీకాకుళం మండలంలో అరసవల్లి గ్రామంలో ఉండే శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి సినీ నటుడు సాయి కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. స్వామిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ యర్రంశెట్టి భద్రాజీ, శ్రీస్వామి వారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.
వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.
టెక్కలి హైవేపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దసాన గ్రామానికి చెందిన జి. అప్పారావు <<15148221 >>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఈయన విశాఖలో కూలి పనులు చేస్తూ కుటుంబంతో జీవనం సాగించేవాడు. పండగకు సోదరిని పిలిచేందుకు ఆదివారం గ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా HYD వెళ్తున్న బస్సు ఢీకొంది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో సోమవారం జరిగిన కొట్లాట ఘటనలో ఇరువర్గాలకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన జీ.చిట్టిబాబు, ఎస్.విశ్వనాథం మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో వారు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ ఏ.విజయ్ కుమార్ తెలిపారు.
శ్రీకాకుళం పాత్రునివలసలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థిని అదృశ్యమైంది. కళాశాలకు ఈ నెల 11 నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటికి వస్తానని చెప్పి రాలేదని తండ్రి శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాము తెలిపారు.
Sorry, no posts matched your criteria.