India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలకు ఈ నెల 22న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు DRDA PD కిరణ్ కుమార్ తెలిపారు. RTC కాంప్లెక్స్ వెనక నెహ్రూ యువ కేంద్రంలో ఉ.9 నుంచి సా.4.30 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. రిలేషన్షిప్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్, బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ పోస్టులకు B.Com/MBA అర్హత, 18-28 ఏళ్ల వయసు, ఆసక్తి గలవారు హాజరు కావాలన్నారు. 16,000 నుంచి 25,000 జీతం మని, మన జిల్లాలోనే పనిచేయాలన్నారు. SHARE IT
పీ.ఎం సూర్య ఘర్ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో అధిగమించాలని, పీ.ఎం సూర్య ఘర్ పై అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పంచాయతీ సెక్రటరీలు భాద్యత వహించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ మందిరంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. పంచాయతి సెక్రటరీ, ట్రాన్స్కో సమన్వయంతో పనులు వేగవంతం చేసి ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రభుత్వానికి రావలసి ఉన్న వివిధ రకాల పన్నులు కోట్లాది రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని వాటిని వసూలు చేసేందుకు అధికారులు కసరత్తు చేయాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఒక రణస్థలంలో పంచాయతీలోని మున్సిపాలిటీలకు దీటుగా పన్నుల బకాయిలు ఉన్నాయని వీటి పై దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీల బలోపేతానికి ఇవే ఆధారం అన్నారు.
ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా DEO ఎస్.తిరుమల చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. సర్ప్లెస్గా మిగిలిన ఉపాధ్యాయులను అవసరం ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు CSE వెబ్సైట్ ఎనేబుల్గా ఉందన్నారు. మండల స్థాయిలో ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ నేడు మంగళవారం, డివిజన్ స్థాయిలో కౌన్సెలింగ్ రేపు బుధవారం నిర్వహిస్తామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5శాతం మంది మాత్రమే మహిళా పైలెట్లు ఉండగా, మన దేశంలో 15శాతం మంది ఉండటం గమనార్హమని కేంద్ర పార విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఉమెన్ ఏవియేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా పైలెట్ల సంఖ్యను 25 శాతానికి పెంచడమే తన లక్ష్యమని ప్రకటించారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడిగించినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి (DEO) తిరుమల చైతన్య సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 26వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 02, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 9, రూ.500 రుసుంతో డిసెంబర్ 16 ఆఖరి తేదీ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి పాత జాతీయ రహదారిపై ఎల్ మాక్స్ సినిమా థియేటర్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బైక్ను కంటైనర్ ఢీకొనడంతో వంశీ(23) అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన కృష్ణ(27) బరంపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఇచ్ఛాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చన్నారు.
బ్యాంకు సముదాయాలు, బ్యాంకులు, నగదు లావదేవీలు జరిగే (ATM) కేంద్రాలు వద్ద భద్రత ప్రమాణాలు పాటిస్తూ, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి బ్యాంకు అధికారులను సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి బ్యాంకు ప్రవేశ ద్వారం దగ్గర నియమించిన గార్డు అప్రమత్తంగా ఉండాలని, ఆయనకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
పలాస మండలం ఈదురాపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శాసనపురి నవ్య(30) శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు కాశీబుగ్గ సూదికొండ ప్రాంతంలోని ప్రభత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనపై కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.