India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం పట్టణ ప్రజలకు రెండో పట్టణ సీఐ పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండగకు గ్రామాలకు వెళ్లే పట్టణ ప్రజలు మీ విలువైన బంగారు ఆభరణాలు నగదు తీసుకుని వెళ్లాలని అన్నారు. లేకుంటే బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సీఐ చెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్ పరిధిలోని గురువారం ప్రచారం రథాల ద్వారా పట్టణ ప్రజలను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా అన్ని పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాతి సెలవులు 10వ తేదీ నుంచి 19 వరకు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు . అనంతరం పాఠశాలలు తిరిగి 20వ తేదీన తెరుచుకుంటాయన్నారు. రివిజన్ కోసం SSC, ఇంటర్మీడియట్ విద్యార్థులకు హోమ్ వర్క్ ఇవ్వాలని ప్రిన్సిపాల్లకు సూచించారు.
భారత వాయుసేన 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ ద్వారా క్లరికల్, టెక్నికల్ క్యాడర్లలో అగ్నివీర్ వాయుసేన పోస్టులకు నోటిఫికేషన్ను విడుదలైందని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ, డిప్లొమా (పాలిటెక్నిక్) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. జనవరి 27, 2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్: https://agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
పాతపట్నం మండలం కొరసవాడ శ్మశాన వాటిక సమీపాన గురువారం మధ్నాహ్నం స్కూటీ- లగేజీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన మారెడ్ల కృష్ణారావు (53) గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
సంక్రాంతి సెలవుల నేపధ్యంలో గురువారం శ్రీకాకుళం జిల్లాలో వసతిగృహాల విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. శుక్రవారం నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో టెక్కలిలో మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలురు, బాలికల వసతిగృహ విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో వసతిగృహాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మళ్లీ పండుగ అనంతరం విద్యార్థులు వసతిగృహాలకు రానున్నారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రమంత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో 315 ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించామని వివరించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 6 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పాదయాత్ర 2017 నవంబర్ 6 నుంచి 341 రోజుల పాటు సాగింది. 2019 జనవరి 9లో ముగిసింది. ఈ పాదయాత్ర 2019 ఏపీ శాసనసభ ఎన్నికల ముందు ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపునకు గుర్తుగా వైసీపీ శ్రేణులు ఒక స్తూపం నిర్మించారు. గురువారం ఇచ్ఛాపురం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్తూపం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు.
తిరుపతిలో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులు మృతి కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఘటన దురదృష్టకరమన్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం మండలంలో బుధవారం రాత్రి 10:56 గంటల సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్ప ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు.
మెళియాపుట్టి పరిసర ప్రాంతాల్లో బుధవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై తీస్తున్న సినిమా చిత్రీకరణ మండలంలోని కరజాడలో బుధవారం జరిగింది. హీరో, హీరోయిన్లుగా గోపాల్ రెడ్డి, శృతి, ప్రధాన పాత్రల్లో డా.కుమార్ నాయక్, ఆశిష్ చోటు ఉన్నారని సినిమా దర్శకుడు శివశంకర్ తెలిపారు. వీరితో పాటు నిర్మాత స్వాతి ఉన్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, ఒడియా మూడు భాషల్లో విడుదల కానుంది.
Sorry, no posts matched your criteria.