Srikakulam

News November 10, 2024

శ్రీకాకుళం జిల్లా TODAY TOP NEWS

image

* శ్రీకాకుళం: కిసాన్ మేళాను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
* మెలకువలు పాటిస్తే కేసులను ఛేదించవచ్చు: SKLM SP
* శ్రీకాకుళం సుడా ఛైర్మన్‌గా రవికుమార్
* ఆమదాలవలస: 25ఏళ్లుగా ఇంట్లో పాము
* రాష్ట్రంలో నియంత పాలన: కృష్ణదాస్
* సోంపేట: పోస్ట్ ఆఫీస్‌లోనే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్
* ఇచ్చాపురం: వైసీపీ సీనియర్ నేత మృతి
* సీతంపేటలో అగ్ని ప్రమాదం.. ఇళ్లు దగ్ధం

News November 9, 2024

శ్రీకాకుళం: మెలకువలు పాటిస్తే కేసులను చేధించవచ్చు: SP

image

సైబర్ నేరాల నియంత్రణ, నేరాలకు సంబంధించిన కేసులను చేధించడానికి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో సరైన మెలకువలు పాటిస్తే కేసులను ఛేదించటం చాలా సులుభం అవుతుందని అన్నారు.

News November 9, 2024

శ్రీకాకుళంలో నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే..

image

ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను కూటమి ప్రభుత్వం శనివారం ఉదయం విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 1. TDP నేత రోణంకి కృష్ణంనాయుడుని కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. 2.JSP నేత నుంచి పాలవలస యశస్విని తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా, కోరికాన రవికుమార్‌ను శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది.

News November 9, 2024

కంచిలి: బస్సు కిందపడి బాలుడి మృతి.. ఎలా జరిగిందటే

image

కంచిలి మం.ముండల గ్రామంలో శుక్రవారం ఉదయం బస్సు వెనుక చక్రం కిందపడి బాలుడు(3) దివ్యాంశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. నిన్న తల్లి పెద్ద కొడుకు శ్రీయాన్స్‌ను పాఠశాల పంపేందుకు బస్టాండ్‌ వచ్చి బస్సు ఎక్కించింది. ఇంతలో తానూ ఎక్కుతానంటూ దివ్యాంశ్ వచ్చాడు. గమనించని డ్రైవర్ ముందుకు తీయడంతో టైర్ల కిందపడి చనిపోయాడు. దీంతో తల్లి, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి తండ్రి ఉపాధి కోసం వలస వెళ్లారు.

News November 9, 2024

శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP NEWS

image

* శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 900 సీసీ కెమెరాలు: SP
* కోటబొమ్మాళి: టీడీపీ ప్రభుత్వం 400 మందిని తొలగించింది: పేరాడ తిలక్
* శ్రీకాకుళం జిల్లాకు ఇద్దరు డీఎస్పీల నియామకం
* ధాన్యం సేకరించిన 48 గంటల్లో నగదు జమ: మంత్రి అచ్చెన్న
* చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తాం: SP
* కంచిలిలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు
* ITEP 2వ సెమిస్టర్ టైం టేబుల్ విడుదల

News November 9, 2024

శ్రీకాకుళం: ఫిర్యాదుల నమోదు కోసం టోల్ ఫ్రీ నంబర్

image

మాదక ద్రవ్యాల వినియోగం, వాటికి సంబంధించిన ఫిర్యాదుల నమోదు, అలాగే డి-అడిక్షన్ కేంద్రాల సేవలకు టోల్ ఫ్రీ నెంబర్ 14446 పని చేస్తోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం జరిగిన (ఎన్‌సీఓఆర్‌డీ) సమావేశంలో తెలిపారు. రిమ్స్ ఆసుపత్రిలో డి-అడిక్షన్ సెంటర్‌ అందుబాటులో ఉందన్నారు. దాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.

News November 8, 2024

రహదారి ప్రయాణంలో భద్రతే జీవితానికి రక్షణ: శ్రీకాకుళం కలెక్టర్

image

రహదారి ప్రయాణంలో భద్రతే జీవితాలకు రక్షణగా నిలుస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కమిటీ ఛైర్మన్‌గా, జిల్లా ఎస్పీ కెవి.మహేశ్వర రెడ్డి, కమిటీ మెంబర్ కన్వీనర్, డీటీసీ విజయ సారథి తదితరులు హాజరయ్యారు.

News November 8, 2024

శ్రీకాకుళం: ‘పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి’

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన సమావేశం జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆమె పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ ప్రాజెక్టు అధికారి సుధాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపడుతున్న వివిధ పనులను వివరించారు. 

News November 8, 2024

గంజాయి కేసులో 108మంది అరెస్ట్: శ్రీకాకుళం SP

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి, కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 37కేసులు నమోదు చేశామని, 108 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News November 8, 2024

చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తాం: ఎస్పీ

image

పలాస కాశీబుగ్గ డివిజనల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం బాధితుల నుంచి ఎస్పీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తామని అర్జీదారులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.

error: Content is protected !!