Srikakulam

News June 27, 2024

జలుమూరులో 20 తులాల బంగారు చోరీ

image

జలుమూరు మండలంలోని నగరి కటకంలో జరిగిన చోరీలో 20 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురి అయ్యాయని బాధితుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలకు వెళితే స్థానికంగా ఉన్న రేజేటి శ్రీనివాసరావు తన కుమారుడు హైదరాబాదులో అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు కలిసి వెళ్లాడు. తిరిగి బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చేసేసరికి చోరీ జరిగినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 27, 2024

పది అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో శ్రీకాకుళం 19వ స్థానం

image

కాసేపటి క్రితం పది అడ్వాన్స్‌డ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం బాలబాలికలు 2,218 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,338 మంది పాసయ్యారు. మొత్తం 60.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో శ్రీకాకుళం 19వ స్థానం కైవసం చేసుకుంది.

News June 26, 2024

మద్యంపై కూటమి వసూళ్లపర్వం!: వైసీపీ

image

యూబీ కంపెనీ నెలకు రూ.1.50 కోట్లు కట్టాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ‘ఇవ్వలేమని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఫ్యాక్టరీపై దాడి చేశారు. మద్యం బయటికి వెళ్లకుండా అడ్డగించారు. మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుల అండతో పచ్చ ముఠా బెదిరింపులకు దిగుతోంది’ అని వైసీపీ ‘X’లో ట్వీట్ చేసింది.

News June 26, 2024

పది అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో శ్రీకాకుళం 19వ స్థానం

image

కాసేపటి క్రితం పది అడ్వాన్స్‌డ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం బాలబాలికలు 2,218 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,338 మంది పాసయ్యారు. మొత్తం 60.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో శ్రీకాకుళం 19వ స్థానం కైవసం చేసుకుంది.

News June 26, 2024

శ్రీకాకుళం: నిరుద్యోగులకు శుభవార్త

image

జూన్ 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధా బుధవారం తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఐటిఐ, బలగ రోడ్‌లో ఉదయం 10గంటలకు ఐటీఐ, టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన 18 నుంచి 40 సంవత్సరాలలోపు గల యువత ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని ఆమె తెలిపారు. WWW.NCS.GOV.IN, www.empolyment.ap.gov.in వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News June 26, 2024

స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తోలాపి విద్యార్థి

image

పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన అన్నెపు శేషాద్రి నాయుడు 150 మార్కులతో ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈయన తండ్రి ధర్మారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తోలాపి సర్పంచ్ రాధాకృష్ణ, ఉప సర్పంచ్ శ్రీనివాసరావు, ఎంపీటీసీ కళ్యాణి, జనసేన ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు, గ్రామ ప్రజలు శేషాద్రి నాయుడును అభినందించారు.

News June 26, 2024

శ్రీకాకుళం: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో మే-2024లో నిర్వహించిన MSC నాలుగవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 26, 2024

శ్రీకాకుళం: పలు రైళ్లను రద్దు చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే

image

ట్రాఫిక్ బ్లాక్ కారణంగా శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే రెండు ప్యాసింజర్ రైళ్లను రేపు గురువారం రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. *పలాస- విశాఖపట్నం 07471 నంబరు గల రైలు * విశాఖపట్నం- పలాస 07470 నం. గల రైలు * గుణుపూర్- విశాఖపట్నం 08521 నంబరు గల రైలు * విశాఖపట్నం- గుణుపూర్ 08522 నంబరు గల రైలు రద్దు చేశారు.

News June 26, 2024

శ్రీకాకుళం: ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 12వ స్థానం

image

కాసేపటి క్రితం ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి 7,113మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,047 మంది పాసయ్యారు. జిల్లాలో 43శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోనే శ్రీకాకుళం 12వ స్థానంలో నిలిచింది. అలాగే ఒకేషనల్‌ గ్రూప్‌లో 341 విద్యార్థులు రాయగా 187మంది పాసయ్యారు. దీనిలో 55శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది.

News June 26, 2024

నేడు ఓటేయనున్న శ్రీకాకుళం ఎంపీ

image

పార్లమెంట్‌లో నేడు లోక్‌సభ స్పీకర్ ఎలక్షన్ ​జరగనుంది. శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటేయనున్నారు.