Srikakulam

News November 2, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ 3, 5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ జి.పద్మారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్, నవంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు 3వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. జిల్లాలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలను నియమించారు.

News November 2, 2024

శ్రీకాకుళం జిల్లా మీదుగా స్పెషల్ ట్రైన్

image

శ్రీకాకుళం జిల్లా మీదుగా విశాఖ-దానాపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రైస్ (08520) రైలును నవంబర్ 4న నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగనుంది. శ్రీకాకుళం రోడ్డుకు ఉదయం 11 గంటలకు, పలాస స్టేషన్‌కు మ.12:30 గంటలకు రానుంది. దానాపూర్-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ ప్రైస్ (08519) రైలు నవంబర్ 5న బయలుదేరి ఇది పలాస స్టేషన్‌కి ఉ.11:52కి, శ్రీకాకుళం రోడ్డుకు మ.12:57కి రానుంది.

News November 2, 2024

SKLM: జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

image

శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం జిల్లా అభివృద్ధిపై చర్చలు జరిపారు. జిల్లాకు కావాల్సిన నిధులు, పెండింగ్ పనులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు జిల్లా అభివృద్ధికి పలు సూచనలు చేశారు. సీఎంతో పాటుగా మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

News November 1, 2024

టెక్కలి లేదా పలాస ఎయిర్ పోర్టు నిర్మాణం: సీఎం చంద్రబాబు

image

శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు సమీపంలో సుమారు 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఈదుపురం సభలో ఆయన మాట్లాడుతూ.. టెక్కలి లేదా పలాస ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. చంద్రబాబు ప్రకటనతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News November 1, 2024

ఇచ్ఛాపురం: సీఎం సభలో జిల్లా కూటమి నేతల సందడి

image

ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలోని ఈదుపురం గ్రామంలో శుక్రవారం జరిగిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కూటమి నేతలు సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌తో పాటు ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, ఎన్.ఈశ్వరరావు, జనసేన, బీజేపీ నాయకులు సీఎం సభకు హాజరయ్యారు.

News November 1, 2024

ఇచ్చాపురం చేరుకున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చాపురం చేరుకున్నారు. మండలంలోని ఈదుపురం గ్రామంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబును కోరారు‌. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

News November 1, 2024

దీపావళి వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

image

శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం రాత్రి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడతమలోని తన నివాసం వద్ద కుటుంబీకులతో పండగ పూట సరదాగా గడిపారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ లక్ష్మీ కటాక్షంతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ‘X’ లో పోస్ట్ చేశారు.

News November 1, 2024

నేడు శ్రీకాకుళం జిల్లాకు CM చంద్రబాబు రాక

image

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. సూపర్‌-6 పథకాల్లో ఒకటైన దీపం పథకాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురం గ్రామంలో ఆయన ప్రారంభించనున్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లను లబ్ధిదారులకు అందించనున్నారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు. అలాగే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. కాగా ఇప్పటికే కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు.

News November 1, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. పరీక్షలు నవంబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ ప్రారంభం కాగా నవంబర్ 2వ తేదీతో ముగియనున్నాయి.

News October 31, 2024

నరసన్నపేట: గడ్డయ్య చెరువులో పడి ఒకరు మృతి

image

నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక దేశవానిపేట వద్ద ఉన్న గడ్డయ్య చెరువులో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సిహెచ్ దుర్గ ప్రసాద్ వివరాలు ప్రకారం.. బుధవారం రాత్రి స్నానానికి బగ్గు సూర్యనారాయణ (45) చెరువులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అయితే రాత్రి కావడంతో అటువైపు ఎవరూ వెళ్లలేదు. కుటుంబ సభ్యులు గురువారం చెరువులో చనిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు.