Srikakulam

News June 22, 2024

శ్రీకాకుళం: లవ్ మ్యారేజ్.. వివాహిత కిడ్నాప్

image

వివాహిత కిడ్నాప్ ఘటనపై కేసు నమోదుచేసినట్లు వన్‌టైన్ SI శ్యామల రావు తెలిపారు. వివరాలు.. శ్రీకాకుళంలోని మంగువారితోటకు చెందిన జి.తేజేశ్వరరావు పొన్నాడకు చెందిన వల్లంగి పల్లవి ప్రేమ పెళ్లిచేసుకున్నారు. మంగువారితోటలో నివాసముంటున్నారు. కాగా ఈ నెల 20న సుశీల కొంతమందితో తేజేశ్వరరావు ఇంటికి వెళ్లి పల్లవిని తీసుకెళ్లిపోయింది. దీంతో తేజేశ్వరరావు తన భార్యను కిడ్నాప్ చేశారని ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

News June 22, 2024

శ్రీకాకుళం: 502 మందికి ప్రవేశాలు

image

శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ మేరకు శుక్రవారం 1400 నుంచి 1642 మధ్య ర్యాంకు విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 474 మందికి 230 మంది హాజరయ్యారు. ఇందులో 113 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఇప్పటివరకు 502 మందికి ప్రవేశాలు కల్పించారు. శనివారం 1874 నుంచి 2083 మధ్య కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

News June 22, 2024

శ్రీకాకుళం: అచ్చెన్న ఆరోసారి.. అశోక్ 3వ సారి

image

శ్రీకాకుళం జిల్లా MLAలు శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో శ్రీకాకుళం MLA శంకర్, పాతపట్నం MLA గోవిందరావు, పలాస MLA శిరీష, ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టెక్కలి నుంచి గెలిచిన అచ్చెన్నాయుుడు ఆరోసారి, ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ హ్యాట్రిక్ MLAగా అసెంబ్లీకెళ్లారు. కాగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మన్యం జిల్లాలో, రాజాం విజయనగరంలో కలిసిన విషయం తెలిసిందే.

News June 22, 2024

శ్రీకాకుళం: డిప్లొమా, ITI పాసైన వారికి ముఖ్య గమనిక

image

2021, 22, 23, 24 సంవత్సరాలలో డిప్లొమా, ITI పాసైనవారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నైపుణ్య శిక్షణ & ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 28లోపు రిజిస్టర్ చేసుకోవాలని APSSDC సూచించింది. ఎంపికైనవారికి 45 రోజులపాటు ఉచిత శిక్షణ అందించి తిరుపతిలోని శ్రీసిటీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంది. పూర్తి వివరాలకు APSSDC వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది.

News June 21, 2024

పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా..

image

పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కల్పనా సంస్థ సంయుక్త సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. శ్యాంబాబు తెలిపారు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండి, పాలిటెక్నిక్, బీటెక్, డిగ్రీ అర్హతలు గల అభ్యర్థులు ముందుగా gdcplkd.ac.in వెబ్‌సైట్లో పేరు నమోదు చేసుకొని పాస్ ఫోటో, బయోడేటా, అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

News June 21, 2024

అభివృద్ధికి జట్టుగా పని చేద్దాం: ఎంపీ రామ్మోహన్

image

శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలుగా ఎన్నికై శుక్రవారం శాసనసభలో ప్రమాణస్వీకారం చేసిన నాయకులకు ఎంపీ రామ్మోహన్ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఒక జట్టులా కృషిచేద్దామంటూ రామ్మోహన్నాయుడు జిల్లా నుంచి ఎన్నికైన వారికి X (ట్విటర్)లో ట్వీట్ చేశారు.

News June 21, 2024

శ్రీకాకుళం మహిళలకు వసతి భోజనంతో శిక్షణ

image

ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 25 నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళల కోసం టైలరింగ్‌లో 30 రోజుల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనుంది. శిక్షణాకాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయని సంస్థ డైరెక్టర్ కల్లూరు శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. వివరాలకు మండల కేంద్రంలో ఉన్న శిక్షణ సెంటర్లో సంప్రదించాలని కోరారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య మహిళలు అర్హులని అన్నారు.

News June 21, 2024

శ్రీకాకుళం: MA పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన MA కోర్సుల పీజీ నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 21, 2024

SLKM: దర్శకుడు అవుతారా? ఎస్పీ GOODNEWS

image

జూన్ 26 తేది అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించేలా 3నిమిషాల నిడివిగల లఘు చిత్రాన్ని చిత్రీకరించి 6309990940 (PRO) జూన్ 25 తేది ఉదయానికి వాట్సాప్ ద్వారా పంపించాలని జిల్లా ఎస్పీ జీ.ఆర్ రాధిక శుక్రవారం కోరారు. వచ్చిన లఘు చిత్రాలను ఎంపిక చేసి రూ.5 వేలు, 3 వేలు నగదు బహుమతి అందజేస్తామన్నారు.

News June 21, 2024

శ్రీకాకుళం: వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు గడువు పెంపు

image

తొగరం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు గడువు పెంచినట్లు ప్రిన్సిపల్ పైడి వెంకటరావు గురువారం తెలిపారు. విద్యార్థులు కోర్సుల్లో చేరేందుకు ఈనెల 30 వరకు అవకాశం ఉందని చెప్పారు. 2002 ఆగస్టు 31 నుంచి 2009 ఆగస్టు 31 మధ్యలో జన్మించి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. www.angrau.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.