India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. సూపర్-6 పథకాల్లో ఒకటైన దీపం పథకాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురం గ్రామంలో ఆయన ప్రారంభించనున్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందించనున్నారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు. అలాగే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. కాగా ఇప్పటికే కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. పరీక్షలు నవంబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ ప్రారంభం కాగా నవంబర్ 2వ తేదీతో ముగియనున్నాయి.
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక దేశవానిపేట వద్ద ఉన్న గడ్డయ్య చెరువులో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సిహెచ్ దుర్గ ప్రసాద్ వివరాలు ప్రకారం.. బుధవారం రాత్రి స్నానానికి బగ్గు సూర్యనారాయణ (45) చెరువులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అయితే రాత్రి కావడంతో అటువైపు ఎవరూ వెళ్లలేదు. కుటుంబ సభ్యులు గురువారం చెరువులో చనిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు.
రేపే జిల్లాకు CM చంద్రబాబు రానున్నారు. హెలికాప్టర్లో 12:40 గంటలకు ఇచ్ఛాపురానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.గంట వరకు ప్రజా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. 1:05 నుంచి 1:50 వరకు ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు పంపిణీ చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2:45 నుంచి 3:45 గంటల వరకు భోజన విరామం అనంతరం 3:45 గంటలకు శ్రీకాకుళం R&B గెస్ట్ హౌస్కి చేరుకొని 8:30 వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న విషయం విదితమే. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేశారు. భద్రతా అంశాలను జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో రేపు 1వ తేదీ సామాజిక పింఛన్లతో పాటు ఉచిత గ్యాస్ పంపిణీని ప్రారంభించనున్నారు. దీనితో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ సాయిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలో తాజ్ మహల్ సెట్టింగ్తో ఆయన ఆర్ట్ డైరెక్టర్గా మంచిపేరు తెచ్చుకున్నారు. అలాగే తెలంగాణ యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణ చీఫ్ డిజైనర్గానూ పనిచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సన్నిహితుడు కావడంతో ఆయనకు ఆ పార్టీ కోటాలో బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు.
జలుమూరు మండలం లింగన్నాయుడుపేట గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ చెన్నైలో మృతి చెందిన ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు మంగళవారం చెన్నైలో విధులు నిర్వహిస్తున్న కోర్ను గోవిందరావు(39) అనారోగ్యంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానిక సిబ్బంది అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందారు. బుధవారం ఆయన మృతదేహాన్ని స్థానిక గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను నేడు విడుదల చేశారు. ఈ పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుం లేకుండా నవంబరు 11వ తేదీ వరకు చెల్లించవచ్చని యూనివర్సిటీ డీన్ తెలిపారు. అదేవిధంగా తెలిపారు. సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు నవంబర్ 18 నుంచి 23వ నుంచి వరకు, సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 28 నుంచి జరుగుతాయని నుంచి తెలిపారు.
టెక్కలి సబ్ కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉంటున్న సంపతిరావు దివ్య(28) అనే వివాహిత బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ఆమె కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతుంది. భర్త శ్రావణ్ కుమార్ టెక్కలి తహశీల్దార్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనపై ఎస్సై రాము కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారం ఉదయం పలాసలోని నివాసంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని మెడికవర్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అప్పలరాజు చికిత్స పొందుతున్నారు. మంగళవారం నివాసంలో కింద పడడంతో గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సీదిరి అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు
Sorry, no posts matched your criteria.