Visakhapatnam

News September 7, 2024

అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీసాల సుబ్బన్న

image

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీసీసీ నూతన కమిటీలకు పిలుపునిచ్చింది. ఆంధ్ర కాంగ్రెస్ సిఫార్సు చేసిన కమిటీలకు ఏఐసీసీ ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలోనే 25 జిల్లాల డీసీసీలు, 13మంది వైస్ ప్రెసిడెంట్లు, 37 మంది జనరల్ సెక్రటరీలు, 10 మంది సిటీ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించింది. దీనిలో AKP జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మీసాల సుబ్బన్న నియమితులయ్యారు.

News September 7, 2024

విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

image

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఈ అల్ప పీడనం కొనసాగుతున్నదని, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈనెల తొమ్మిదవ తేదీకి ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం వివరించారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

News September 7, 2024

విశాఖ: మోదీ, చంద్రబాబు, పవన్ ఆకృతుల్లో వినాయకులు

image

విశాఖపట్నం 37వార్డులో వినాయకచవితి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ఆకట్టుకున్నాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆకృతుల్లో వినాయకులను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ విగ్రహాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

News September 7, 2024

విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులు

image

విశాఖ విమానాశ్రయం నుంచి కొత్తగా మరో 4 ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం సర్వీసులను నడపనుంది. సెప్టెంబర్ 21న విశాఖ హైదరాబాద్ సర్వీస్ ప్రారంభం కానుంది. తర్వాత అక్టోబర్ 27న విశాఖ విజయవాడ సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. అదేరోజు విశాఖ హైదరాబాద్ సర్వీస్ కూడా ప్రారంభిస్తారు. అలాగే విశాఖ అహ్మదాబాద్ కు వారానికి మూడు రోజుల కొత్త సర్వీసులు నడపనున్నట్లు ఏపీ ఏటీఏ ఇన్‌ఛార్జులు కుమార్ రాజా, డీఎస్ వర్మ తెలిపారు.

News September 7, 2024

సరుకు రవాణాలో సత్తా చాటుతున్న విశాఖ పోర్టు

image

సరుకు రవాణాలో విశాఖ పోర్టు సత్తా చాటుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. గత ఏడాది 35 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయడానికి 163 రోజులు పట్టగా ఈ ఏడాది 149 రోజుల్లో ఈ లక్ష్యాన్ని చేరుకున్నట్లు పోర్ట్ ట్రస్ట్ అథారిటీ ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ఈ ఏడాది 90 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

News September 7, 2024

కేజీహెచ్‌లో లేజర్ ఆపరేషన్లు

image

విశాఖ కేజీహెచ్‌లో లేజర్ ఆపరేషన్లు అందుబాటులోకి రానున్నాయి. కోత లేకుండా లేజర్ విధానంలో సకాలంలో శత్రు చికిత్సలు నిర్వహించేలా కేజీహెచ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో విమ్స్ ఆసుపత్రికి లేజర్ వైద్య పరికరాలు అందజేశారు. వీటిని వినియోగించకపోవడంతో కలెక్టర్ అనుమతితో విమ్స్ డైరెక్టర్ రాంబాబు కేజీహెచ్‌లో వీటిని అందజేశారు. దీంతో కేజీహెచ్‌లో లేజర్ ఆపరేషన్లు జరగనున్నాయి.

News September 6, 2024

విశాఖ- మహబూబ్‌నగర్ SF ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

విశాఖ- మహబూబ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12861) ఈరోజు విశాఖపట్నం నుంచి సాయంత్రం 6:40కు బయలుదేరవలసి ఉండగా 5 గంటలు ఆలస్యంగా నడవనుంది. రాత్రి 11:40కు బయలుదేరే రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ట్రైన్ రేపు మధ్యాహ్నం 2:20కు మహబూబ్ నగర్ చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 6, 2024

విశాఖలో డీజీ యాత్ర సేవలను ప్రారంభించిన మంత్రి

image

విశాఖ విమానాశ్రయంలో డీజీ యాత్ర పేరుతో రూపొందించిన బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం సేవలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ శ్రీభరత్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ తరహా సేవలు ఇప్పటికే వారణాసి, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, విమానయాన శాఖ అధికారులు పాల్గొన్నారు.

News September 6, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు కొరత

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు కొరత తీవ్రతరమవుతోంది. ఒకటో నంబరు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను చాలా రోజుల క్రితమే పూర్తిగా మూసేశారు. గత 15 రోజుల నుంచి కొన్ని రోజులు బీఎఫ్‌-2, మరికొన్ని బీఎఫ్‌-3 నడుపుకుంటూ వస్తున్నారు. గత రెండు రోజుల నుంచి బీఎఫ్‌-2 కూడా షట్‌డౌన్‌ చేశారు. ఇప్పుడు బీఎఫ్‌-3 ఒక్కటి నడపడానికి కూడా బొగ్గు పూర్తిగా లేదు. కేవలం 36 గంటలు దానిని నడపడానికి సరిపడా బొగ్గు మాత్రమే ఉంది.

News September 6, 2024

విశాఖ: వందేభారత్ రైలు రద్దు

image

విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలును నేడు(శుక్రవారం) రద్దు చేస్తున్నట్లు డీసీఎం సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-విశాఖ(20707), విశాఖ-సికింద్రాబాద్(20708), విశాఖ-సికింద్రాబాద్(20833), సికింద్రాబాద్-విశాఖ(20834) రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రయాణీకులు గమనించాలని కోరారు.