Visakhapatnam

News August 24, 2024

వారం రోజుల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలో గల అన్ని పరిశ్రమలలో వారం రోజుల్లోగా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్ లో పరిశ్రమల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్మికుల, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమలను నిర్వహించాలన్నారు. నిర్వాహకులు లోటుపాట్లను గుర్తించి సరి చేయాలన్నారు. వచ్చే నెల 30వ తేదీలోగా అన్ని చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.

News August 24, 2024

దువ్వాడలో వందే భారత్‌కు హాల్ట్ కల్పించాలి: ఎంపీ

image

దువ్వాడ రైల్వే స్టేషన్ లో వందే భారత్ కు హాల్ట్ సౌకర్యం కల్పించాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ విజ్ఞప్తి చేశారు. విశాఖ డిఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వాల్తేరు డివిజన్ పరిధిలో రైల్వే ప్రాజెక్టులు, లైన్ల అభివృద్ధి, కొత్త రైళ్ల ప్రతిపాదనలపై చర్చించారు. విశాఖ-బెంగళూరు మధ్య వారానికి మూడుసార్లు రైళ్లు నడపాలన్నారు. ఈ సమావేశానికి డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ అధ్యక్షత వహించారు.

News August 24, 2024

ప్ర‌జా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలి: జెడ్పీ ఛైర్ పర్సన్

image

ప్ర‌జా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జల్లపల్లి సుభద్ర ఉమ్మడి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్థాయి సంఘం సమావేశంలో శనివారం ఆమె మాట్లాడారు. అచ్యుతాపురం ఎషెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులకు వైద్యులు అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News August 24, 2024

పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంలో కార్మికుడు మృతి

image

పరవాడ ఫార్మాసిటీలో ఈ నెల 23న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఝార్ఖండ్‌కు చెందిన రొయ్య అంగీరా(22) మృతి చెందాడు. సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులకు ఏ విధమైన న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

News August 24, 2024

నేడు హౌరా-ఎర్నాకులం ట్రైన్ రీ షెడ్యూల్

image

శనివారం హౌరాలో బయలుదేరే రైలు (22877) హౌరా-ఎర్నాకులం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ 4:10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనుంది. మధ్యాహ్నం 14:50 గంటలకు బదులుగా 19:00 గంటలకు హౌరాలోని బయలుదేరుతుంది. భువనేశ్వర్, విజయనగరం మీదుగా దువ్వాడ స్టేషన్‌కు రేపు ఉదయం 9:05 చేరనుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు కోరారు.

News August 24, 2024

నేడు బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రీ షెడ్యూల్

image

SMV బెంగళూరు నుంచి రేణిగుంట, విజయవాడ మీదుగా నడుస్తున్న SMV బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్ (12864) శనివారం 10:35 గంటలకు బయలుదేరడానికి బదులుగా 14:00 గంటలకు బయలుదేరనుంది. విశాఖకు రేపు ఉదయం 8:00 గంటలకు చేరుకోవచ్చు కావున ప్రయాణికులు ఈ మార్పును గమనించగలరని రైల్వే అధికారులు కోరారు.

News August 24, 2024

సింహాచలం: ఈనెల 30న సామూహిక వరలక్ష్మి వ్రతం

image

సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈనెల 30వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే వరలక్ష్మి వ్రతం పూర్తిగా ఉచితమని పేర్కొన్నారు. భక్తులకు ఆ రోజు కొండ దిగువ నుంచి కొండపై వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు కుంకుమ, జాకెట్, ప్రసాదం ఉచితంగా అందిస్తామన్నారు. స్వామివారి దర్శనం కూడా ఉచితంగా కల్పిస్తామన్నారు.

News August 24, 2024

విశాఖ: మహిళా రిజర్వేషన్ బోగీలు ఎక్కితే కేసు

image

రైళ్లలో మహిళలు, దివ్యాంగులకు రిజర్వ్ చేసిన బోగీలలో ఇతర ప్రయాణికులు ఎక్కితే ఆర్‌పీఎఫ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆ బోగీలలో ఎక్కిన 100 మందిని అదుపులోకి తీసుకొని ఆర్పీఎఫ్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. బోగీలలో కాలు మోపేందుకు కూడా అవకాశం లేకపోవడంతో మహిళల, దివ్యాంగుల బోగీలలో ఎక్కుతున్నారు.

News August 24, 2024

అచ్యుతాపురం: ఎసెన్షియా కంపెనీ తాత్కాలికంగా మూసివేత

image

అచ్యుతాపురం సెజ్‌లోని ప్రమాదం జరిగిన ఎసెన్షియా కంపెనీని యాజమాన్యం తాత్కాలికంగా మూసివేసింది. లోపల ప్రమాదంలో దెబ్బతిన్న భవనాల పునర్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి శకలాలను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నం అయ్యారు. దీనిని 2019 ఏప్రిల్‌లో ప్రారంభించారు. రూ.200 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. ఇక్కడ మైగ్రేన్, క్యాన్సర్ నివారణ మందులు తయారవుతాయి. 400 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.

News August 24, 2024

270 మంది స్టీల్ ప్లాంట్ అధికారులకు షోకాజ్ నోటీసులు

image

స్టీల్ ప్లాంట్‌లో 270 మంది ఇంజినీరింగ్ ఇన్‌ఛార్జ్‌ అధికారులకు యాజమాన్యం శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న కాంట్రాక్ట్ పనుల్లో పాల్గొంటున్న ఒప్పంద కార్మికుల విధులకు, కాంట్రాక్టర్ సమర్పించిన హాజరు సరిపోకపోవడంతో ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తెలుస్తోందని ఆ నోటీసులో యాజమాన్యం పేర్కొంది. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది.