Visakhapatnam

News August 30, 2025

ఆనందపురంలో ITBP కానిస్టేబుల్ ఆత్మహత్య

image

ఆనందపురం (M) పందలపాకలోని IPBP హెడ్‌క్వార్టర్స్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు (D) డోన్(M)నికి చెందిన జీ.నరేంద్ర నాథ్ (32) 15 నెలలుగా ఆనందపురం 56వ బెటాలియన్ యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం హెడ్‌క్వార్టర్స్‌లోని మామిడి చెట్టుకు ఉరివేసుకొని చనిపోయినట్లు బెటాలియన్ ఇన్‌ఛార్జ్ సూరజ్ ప్రకాష్ జోషి పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 30, 2025

మారికవలసలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మారికవలస జాతీయ రహదారిపై శనివారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కృష్ణాపురం సంజయ్ గాంధీ కాలనీకి చెందిన పాడి సురేంద్ర‌రావుగా స్థానికులు గుర్తించారు. పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News August 30, 2025

విశాఖలో యుద్ధ విమాన మ్యూజియం మూసివేత

image

విశాఖ బీచ్ రోడ్డులోని TU-142 యుద్ధ విమాన మ్యూజియం సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు. నిర్వహణ పనుల కారణంగా సెప్టెంబర్ 1 నుంచి 2వ తేదీ వరకు సందర్శకులను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 3 నుంచి మ్యూజియం యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని VMRDA కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ తెలిపారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని కోరారు.

News August 30, 2025

విశాఖ జీవీఎంసీలో ఉద్యోగులకు పదోన్నతులు

image

జీవీఎంసీలో సీనియర్ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఏడుగురికి పదోన్నతి లభించింది. వారికి జీవీఎంసీ పర్యవేక్షకులుగా పదోన్నతి పత్రాలను మేయర్ పీలా శ్రీనివాసరావు అందించారు. సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. జీవీఎంసీలో పనిచేసే అర్హత కలిగిన ఉద్యోగులందరికీ రాబోయే రోజుల్లో పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణ మూర్తి పాల్గొన్నారు.

News August 30, 2025

నేడు దుర్గ్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు

image

దుర్గ్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18529)ను నేడు రద్దు చేస్తునట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 6.33 గంటలకు దుర్గ్ నుంచి బయలుదేరి రేపు ఉదయం 10.30 గంటలకు విశాఖ చేరుతుంది. పలు కారణాల దృష్ట్యా రైలును రద్దు చేస్తున్నామని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరారు.

News August 30, 2025

విశాఖ: మీకు ఎస్ఎంఎస్ వచ్చిందా?

image

రైట్ టు ఎడ్యుకేషన్ (R.T.E.) చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో విద్యాభ్యాసానికి లాటరీ ద్వారా 1784 మంది విద్యార్థులను ఎంపిక చేసామని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ చంద్రశేఖరరావు తెలిపారు. ఈ విద్యార్థులు ఆగస్టు 30లోపు కుల, ఆదాయ, పుట్టిన, ఆధార్, దివ్యాంగ ధ్రువపత్రాలు సమర్పించి పాఠశాలల్లో చేరాలన్నారు. లేకపోతే అడ్మిషన్లు పెద్ద అవుతాయన్నారు. తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపామన్నారు.

News August 30, 2025

ఆదివారం కూడా బిల్లులు చెల్లించేందుకు అవకాశం: ఎస్ఈ

image

విశాఖ జిల్లాలో ఏపీ ఈపీడీసీఎల్ విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు 31వ తేదీన ఆదివారం కూడా పనిచేస్తాయని పర్యవేక్షక ఇంజనీర్ శ్యాంబాబు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను విద్యుత్ రెవిన్యూ కార్యాలయాలు, ఉపవిద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు, రాజీవ్ ఈపీడీసీఎల్ కౌంటర్లు, ఏటీపీ సెంటర్లలో చెల్లించవచ్చన్నారు. ఈపీడీసీఎల్ వెబ్ సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని అన్నారు.

News August 29, 2025

క్రీడాకారులకు మూడు శాతం స్పోర్ట్స్ కోటా: మంత్రి లోకేశ్

image

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా ఇవ్వనున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారత మహిళా క్రికెటర్లతో నిర్వహించిన ముఖాముఖీలో మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామన్నారు. క్రీడల్లో బాలికలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.‌ పాఠశాలల్లో ప్లే గ్రౌండ్‌ల కొరత ఉందన్నారు.‌ 43 వేల పాఠశాలలు ఉన్నా తగినంతమంది పీఈటీలు లేరన్నారు.

News August 29, 2025

పిల్లలను యూట్యూబ్, పబ్జిలకు దూరంగా ఉంచాలి: లోకేశ్

image

క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ జయంతిని సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సమావేశాల్లో క్రీడల అభివృద్ధిపై చర్చిస్తున్నామన్నారు.‌ పిల్లలను యూట్యూబ్, పబ్జీలకు దూరంగా ఉంచి, క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్నారు.

News August 29, 2025

సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికే రుషికొండ సందర్శన: రాజు

image

సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికి రుషికొండ భవనాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఋషికొండ భవనంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సచివాలయ భవనాలకు ఇచ్చిన రేటు కంటే తక్కువ రేటుకే రుషికొండ భవనాలు నిర్మించామన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణపై చిత్తశుద్ధి ఉంటే శనివారం జరిగే జనసేన సభలో తీర్మానం చేయాలన్నారు.