Visakhapatnam

News August 21, 2024

వ్యభిచారం నుంచి విశాఖ యువతికి విముక్తి

image

వ్యభిచార కూపం నుంచి విశాఖ యువతులకు విముక్తి లభించిన ఘటన తూ.గో జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. తూ.గో జిల్లా కొవ్వూరులోని రాజీవ్ కాలనీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో సీఐ విశ్వం దాడి చేశారు. అక్కడ వ్యభిచారం నడిపిస్తున్న లక్ష్మిని అరెస్ట్ చేశారు. అలాగే విశాఖ, రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు యువతలను ఆమె చెర నుంచి విడిపించారు.

News August 21, 2024

విశాఖ: మంత్రితో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భేటీ

image

మంత్రి కొల్లు రవీంద్రతో విశాఖ సర్క్యూట్ హౌస్‌లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి భేటీ అయ్యారు. జిల్లాలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.

News August 20, 2024

రేపు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవు

image

వివిధ సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌కి సెలవు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా సెప్టెంబర్ 14న రెండవ శనివారం రోజున వర్సిటీ పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఏయూలో జరగాల్సిన పలు పరీక్షలను వర్సిటీ అధికారులు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా క్యాంపస్‌కి సైతం సెలవు ప్రకటించారు.

News August 20, 2024

AU: రేపటి పరీక్షలు వాయిదా

image

వివిధ సంఘాల భారత్ బంద్‌కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం జరగాల్సిన యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో ఏయూ వెబ్‌సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. విద్యార్థులు దీనిని గమనించాలని ఆమె సూచించారు.

News August 20, 2024

VSKP: 24న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

image

విశాఖ జడ్పీ భవనంలో ఈనెల 24వ తేదీన ఒకటి నుంచి ఏడు వ‌ర‌కు స్థాయీ సంఘాల సమావేశాలను నిర్వహించనున్నట్లు సీఈవో ఎం.పోలినాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన సమావేశాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.

News August 20, 2024

అలా చేసి ఉంటే చిన్నారులు బతికే వాళ్లు..!

image

పుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురు చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. శనివారం రాత్రే ఆశ్రమంలోని పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆదివారం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపేయగా అక్కడ చనిపోయారు. ఆశ్రమానికి దగ్గరలో 50 పడకల ఆసుపత్రి ఉంది. వారిని శనివారం రాత్రే అక్కడికి తీసుకెళ్లి ఉంటే బతికే వాళ్లని, సకాలంలో వైద్యం అందకపోవడంతోనే చనిపోయారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

News August 20, 2024

VSKP: చిన్నారుల మృతి.. ఆయనపై హత్య కేసు

image

ఉమ్మడి విశాఖ జిల్లా కోటవురట్ల(M) కైలాసపట్నంలోని అనాథ ఆశ్రమంలో ముగ్గురు చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. పాయకరావుపేట(M) అరట్లకోటకు చెందిన పాస్టర్ కిరణ్ కుమార్ ఈ ఆశ్రమం నడుపుతున్నాడు. అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఆయనపై హత్య కేసు నమోదు చేశారు. పైఫొటోలో కనపడుతున్న చిన్న రేకుల షెడ్డులోనే దాదాపు 97 మంది పిల్లలతో ఆశ్రమం నిర్వహిస్తుండగా.. దీనికి అనుమతులు లేవని సమాచారం.

News August 19, 2024

BREAKING: కైలాసపట్నం అనాథాశ్రమం సీజ్

image

కోటవురట్న మండలం కైలాసపట్నంలో అనాథాశ్రమాన్ని అధికారులు సోమవారం సీజ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ తహశీల్దార్ జగదీశ్, ఏఎస్ఐ గంగరాజు, రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. అనాథాశ్రమం నిర్వాహకుడు ఎం.కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విషాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.

News August 19, 2024

అనధికార హాస్టల్ మూసివేయాలి: సీఎం చంద్రబాబు

image

కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథశ్రమంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ముగ్గురు విద్యార్థుల మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అనధికార హాస్టల్ మూసివేయాలని ఆయన ఆదేశించారు. చిన్నారుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు. అస్వస్థతకు గురైన చిన్నారుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పారు.

News August 19, 2024

26 నుంచి పోర్టు స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

image

విశాఖ‌ పోర్టు స్టేడియంలో ఆగ‌స్టు 26 నుంచి సెప్టెంబ‌ర్ 05వ తేదీ వ‌ర‌కు జ‌రిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ప‌క్కా ఏర్పాట్లు చేయాల‌ని వివిధ విభాగాల అధికారుల‌ను జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మీ ర్యాలీ విజయవంతం అయ్యేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.