Visakhapatnam

News March 21, 2025

విశాఖ అధికారులతో జూమ్ కాన్ఫిరెన్స్

image

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.సి.డి.సి.డి.సర్వే, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, మాతా, శిశు మరణాల రేటు తగ్గింపు, గర్భిణీల టీ.టీ-1, టీ-టీ-2 డోసులు, జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. DMHO జగదేశ్వరరావు ఉన్నారు.

News March 21, 2025

జీవీఎంసీకి పన్ను చెల్లించిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం

image

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జీవీఎంసీకి ఈ ఏడాది పన్నును చెల్లించింది. మార్చి 31వ తేదీకి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో శుక్రవారం జీవీఎంసీ గాజువాక జోన్ అధికారులకు పన్ను మొత్తం రూ.3,41,47,156 స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెల్లించింది. గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి, అసిస్టెంట్ కమిషనర్ రామ్ నారాయణ, ఆర్‌ఐ శివకు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు శుక్రవారం చెక్కు అందజేశారు.

News March 21, 2025

విశాఖలో ఇంగ్లిష్ పరీక్షకు 78 మంది గైర్హాజరు

image

విశాఖలో శుక్రవారం పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 28,609 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 28,531 మంది హాజరైయారు. 78 మంది పరీక్షకు హాజరు కాలేదు. అయితే బుధవారం 72 పరీక్ష కేంద్రాలను డీఈవో ప్రేమకుమార్, స్క్వాడ్ బృందాలు సందర్శించారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

News March 21, 2025

విశాఖ మేయర్ పీఠం కదలనుందా? 

image

విశాఖ మహా నగర మేయర్ హరివెంకటకుమారిపై ఆవిశ్వాసం తప్పేలా లేదు. ఈ క్రమంలో కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కూటమి బలం ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి70కి చేరుకుంది. మరికొన్ని రోజులలో TDP, జనసేనలో కార్పొరేటర్లు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. TDP ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాస్ కలెక్టర్ &జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేదేంద్రప్రసాద్‌ని కలిసి అవిశ్వాస తీర్మాన లేఖ ఇవ్వనున్నట్టు సమాచారం.

News March 21, 2025

ఓవర్ హీట్: విశాఖ జూలో ఉపసమన చర్యలు

image

వేసవి ఉష్ణోగ్రతలు మండుతున్న నేపథ్యంలో జూలో వన్యప్రాణులు ఎండ వేడిమి తిట్టించుకునేందుకు జూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చింపాంజీలు, టైగర్స్, లయన్, జీబ్రా, జిరాఫీలు, ఎలిఫెంట్స్, వివిధ రకాల పక్షులు మొదలైన వాటికి ఎండవేడిమి తట్టుకునేలా, వాటర్ స్ప్రింకలర్స్ ఏర్పాటు చేశారు. లోపల ఫ్యాన్లు, ఎయిర్ కండిషన్లు, కస్ కస్ మ్యాట్లు, తాటాకు పందిర్లు పెట్టారు. వేడి నుంచి ఉపశమనం కలిగేందుకు ఇవి దోహదపడుతున్నాయి.

News March 21, 2025

విశాఖ – భద్రాచలం ప్రత్యేక బస్సులు

image

శ్రీరామ నవమి సందర్భంగా విశాఖపట్నం నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయని ఆయన తెలిపారు. భక్తుల కోరిక మేరకు ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ నుంచి రాజమండ్రి మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు.

News March 21, 2025

విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలో ఇంటర్ విద్యార్థి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. GRP పోలీసుల వివరాల ప్రకారం.. కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న అంబటి రేవంత్ కుమార్‌ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షలు సరిగా రాయలేదంటూ మనస్తాపం చెందాడు. ఈక్రమంలోనే బుధవారం అర్ధరాత్రి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 21, 2025

జీవీఎంసీలో మారనున్న పార్టీల బలాబలాలు

image

జీవీఎంసీలో పార్టీల బలాబలాలు మారనున్నాయి. 97 వార్డుల్లో అత్యధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌గా హరి వెంకట కుమారి ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో జీవీఎంసీపై ప్రభావం పడింది. 9 మంది కార్పొరేటర్ టీడీపీలో చేరగా.. ఒక కార్పొరేటర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కూటమి బలం పుంజుకుంది. కాగా అవిశ్వాస తీర్మాన అంశం తెరపైకి వచ్చింది.

News March 21, 2025

విశాఖలో అడ్మిషన్స్‌కు ఆహ్వానం

image

భీమిలి, ఆనందపురం, పద్మనాభం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి బాలికలకు అడ్మిషన్స్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు పథక సమన్వయకర్త చంద్ర శేఖర్ గురువారం తెలిపారు. 6వ తరగతిలో 120 సీట్లు,11వ తరగతిలో 120 సీట్లు, 7వ తరగతిలో 2 సీట్లు,12వ తరగతిలో 23 సీట్లకు ఆన్ లైన్‌లో మార్చ్ 22నుంచి ఏప్రిల్ 11లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డు ఉన్న బాలికలు మాత్రమే అర్హులు.

News March 21, 2025

విశాఖలో ఆశీల వసూళ్లకు బహిరంగ వేలం

image

జీవీఎంసీ జోన్ -3 పరిధిలో 2025-26 సంవత్సరానిగాను పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోన్-3వ జోనల్ కమిషనర్ శివప్రసాద్ గురువారం తెలిపారు. జోన్-3లో మార్కెట్లు, లుంబిని పార్క్ ప్రవేశానికి, పార్కింగ్ టికెట్ వసూలు చేసేందుకు వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆశీలుమెట్ట జీవీఎంసీ జోన్ -3 జోనల్ కార్యాలయంలోని హాజరు కావాలన్నారు.