Visakhapatnam

News March 14, 2025

దువ్వాడ మీదుగా నహార్‌లగూన్‌కు స్పెషల్ ఎక్స్‌ప్రెస్

image

హోళీ పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దువ్వాడ మీదుగా చర్లపల్లి – నహార్‌లగూన్‌కు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07046/47) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. ఈ రైళ్లు మార్చి 15, 22, 29న నడుస్తాయన్నారు. మళ్లీ మార్చి 18, 25, ఏప్రిల్ 1వ తేదీలలో నహార్‌లగూన్ నుంచి బయలుదేరి దువ్వాడ మీదుగా చర్లపల్లి చేరతాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News March 13, 2025

అవయవ దానానికి ముందుకు రావాలి: కలెక్టర్

image

బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను దానం చేసి ఆదర్శవంతంగా నిలవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు నిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్‌లో వాక్ థాన్ అన్ ఆర్గాన్ డొనేషన్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానంతో 8 మంది రోగులకు అవసరమైన అవయవాలు అమర్చవచ్చన్నారు. గత సంవత్సరం అవయవ దానం ద్వారా 210 మందికి అమర్చారని గుర్తు చేశారు.

News March 13, 2025

విశాఖ: హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు

image

ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయన్న నెపంతో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లకు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని విశాఖకు చెందిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. స్కూల్ యాజమాన్యాలు ఫీజులపై ఈ సమయంలో ఒత్తిడిని పెంచడం సమంజసం కాదన్నారు. ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులు పరీక్షలు రాయవచ్చన్నారు.

News March 13, 2025

పద్మనాభం: భూములు పరిశీలించిన జేసీ మాయూర్ అశోక్

image

పద్మనాభం మండలంలోని కృష్ణాపురం, రెడ్డిపల్లి గ్రామాల్లో పారిశ్రామిక (ఎంఎస్ఎంఈ) పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను గురువారం జాయింట్ కలెక్టరు మయూర్ అశోక్ పరిశీలించారు. తహసీల్దారు కె.ఆనందరావుతో కలిసి ఆయా గ్రామాల్లోని భూములను పరిశీలించారు. వాటి రికార్డులు, భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని అవకాశాలు కుదిరితే ఈ భూములను ఏపీఐఐసీకి బదలాయించి పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలన్నారు.

News March 13, 2025

విశాఖ: పరీక్ష బాగా రాయలేదని విద్యార్థిని సూసైడ్

image

ఫిజిక్స్ పరీక్ష సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటుచేసుంది. సర్క్యూట్ హౌస్ సమీపంలో నివాసముంటున్న ఓ విద్యార్థిని ఫిజిక్స్ పరీక్ష రాసింది. ఇంటికి వచ్చి పరీక్ష బాగా రాయలేదని బాధపడగా ఆమె తల్లి ఓదార్చి నిద్రపోయింది. బుధవారం ఉదయం ఆమె నిద్రలేచి చూసేసరికి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 13, 2025

‘జన్మభూమి’ ఎక్కేవారికి అలర్ట్ 

image

విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్(12805/06)ను సికింద్రాబాద్ వెళ్లకుండా దారి మళ్లించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి విశాఖలో బయలుదేరి సికింద్రాబాద్, బేగంపేట్ వెళ్లకుండా చర్లపల్లి మీదుగా లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 26 నుంచి లింగంపల్లిలో బయలుదేరి సికింద్రాబాద్, బేగం‌పేట్ రాకుండా చర్లపల్లి మీదుగా విశాఖ రానుంది.

News March 13, 2025

విశాఖ రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖలోని వ్యవసాయ మరియు వాణిజ్య శాఖ అధికారులు గురువారం నాడు కూరగాయ ధరలను విడుదల చేశారు. వాటి వివరాలు( రూ/కేజీ)లలో టమాటా రూ.15, ఉల్లిపాయలు రూ.23/28 ,బంగాళాదుంపలు రూ.16, వంకాయలు రూ.34/40/46, బెండకాయలు రూ.46, మిర్చి రూ.28, బరబాటి రూ.36, గోరుచిక్కుడు రూ.36, బీట్రూట్ రూ.20, బీన్స్ రూ.52, కీర రూ.26, దేవుడి చిక్కుడు రూ.64, మునగ రూ.56, అరటికాయలు రూ.38, క్యారెట్ రూ.22/32గా నిర్ణయించారు.

News March 13, 2025

విశాఖ: క్రికెట్ బెట్టింగ్‌లో మరో ఇద్దరు అరెస్ట్

image

విశాఖ సీపీ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో మధురవాడకు చెందిన కోపనాతి తేజ సాయి(27), రాంబిల్లికి చెందిన దూళి తలుపులు(34)ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. వీరు మధ్యవర్తిగా క్రికెట్ లావాదేవీలు జరపుతుంటారని, ఇంకొందరు బుకీల సమాచారం సేకరించి వారినీ అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు.

News March 13, 2025

విశాఖ: సైబర్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ 

image

విదేశాలలో చైనాకు సంబంధించిన ఫేక్ కంపెనీలలో పని చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఎంతోమందిని మోసం చేసి డబ్బులు దోచుకున్న వ్యక్తి విశాఖ పోలీసులకు చిక్కాడు. అనకాపల్లికి చెందిన నిందితుడు చొప్పా ఉమా మహేశ్‌ను సైబర్ పోలీసులు బుధవారం ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అనకాపల్లి వచ్చి తిరిగి వెళ్తుండగా చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. దీని వెనుక ఉన్న ముఠాను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

News March 13, 2025

సలహాలు, సూచ‌న‌లు ఇవ్వండి: విశాఖ కలెక్టర్

image

ఈఆర్వో, డీఈవో, సీఈవో స్థాయిలో పరిష్కారంకాని ఏవైనా సమస్యలపై భారత ఎన్నికల సంఘానికి నేరుగా సూచ‌న‌లు ఇవ్వొచ్చ‌ని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ‌, ప్రాంతీయ‌ రాజ‌కీయ పార్టీల‌కు ఆహ్వానం తెలుపుతూ ఎన్నిక‌ల సంఘం వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ వివరించారు. రాజ‌కీయ పార్టీల‌కు విడివిడిగా ఎన్నిక‌ల సంఘం లేఖలు పంపినట్లు పేర్కొన్నారు.