Visakhapatnam

News March 11, 2026

వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

image

వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి 24 రోజుల ముందే 78.464 మిలియన్ టన్నుల లోడింగ్ లక్ష్యాన్ని అధిగమించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 16.5 శాతం వృద్ధి. ఈ చారిత్రాత్మక విజయం అని.. టీమ్ వాల్తేరును డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అభినందించారు. కస్టమర్ కేంద్రీకృత విధానాలు, సమన్వయంతోనే ఈ అసాధారణ మైలురాయి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

News March 11, 2026

మధురవాడ జోన్‌లో అక్రమ నిర్మాణాలపై ఏసీబీ అధికారుల ఆరా

image

మధురవాడ జోన్ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారుల తనిఖీలు బుధవారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి దాడుల్లో స్వాధీనం చేసుకున్న దస్త్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనలు, ఆమోదించిన ప్లాన్‌లకు భిన్నంగా ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News March 11, 2026

విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖలో మంగళవారం సాయంత్రం జరిగింది. గోస్తాని గేటు ప్రధాన రహదారి పక్కన హై వోల్టేజ్ స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హార్బర్ పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి హై వోల్టేజ్ స్తంభం ఎక్కుతుండగా నేవీ సిబ్బంది గమనించి దిగిపోమని హెచ్చరించినప్పటికీ మరింత మీదకు వెళ్లడంతో వైర్లు తగిలి ప్రమాదానికి గురైనట్లు చెప్పారు.

News March 11, 2026

విశాఖలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం..

image

విశాఖలోని భవన నిర్మాణ అనుమతులు, BPS, లేఅవుట్ల క్రమబద్ధీకరణలో అవినీతి ఆరోపణలపై ACB దర్యాప్తు ముమ్మరం చేసింది. మధురవాడ, పెందుర్తి, గాజువాక జోన్ల పరిధిలో ఫిర్యాదులు అందడంతో మంగళవారం సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. గడువు తర్వాత నిర్మించిన భవనాలు, నిర్మాణంలో ఉన్న వాటికి క్రమబద్ధీకరణ దరఖాస్తులు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై నేడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.

News March 11, 2026

పాలకవర్గ గడువు ముగియకముందే స్టాండింగ్ కమిటీ సమావేశం

image

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఈనెల 13న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అజెండా సిద్ధం చేసి సభ్యులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం. గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని అంశాలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

News March 11, 2026

విశాఖ నీటి భద్రతకు వ్యూహాత్మక ప్రణాళిక

image

అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు భవిష్యత్ నీటి భద్రత కోసం సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అవసరమని VER సీఈవో యువరాజ్ అన్నారు. GVMC ఆధ్వర్యంలో నోవోటెల్‌లో జరిగిన ‘క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లానింగ్ ఫర్ వాటర్ సెక్టార్’ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న జనాభా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నీటి వనరులను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ సూచించారు.

News March 11, 2026

విశాఖ: ఎన్నికలపై సందిగ్ధత

image

విశాఖలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని సుమారు 64 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ ప్రక్రియ ప్రారంభమైతే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల సవరణ, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇవి పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది.

News March 11, 2026

విశాఖలో బార్ లైసెన్సులకు ఆసక్తి చూపని వ్యాపారులు

image

విశాఖలో బార్ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. GVMC పరిధిలో మిగిలిన 25 బార్ల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఏడాదికి రూ.95 లక్షల లైసెన్స్ ఫీజుతో పాటు దరఖాస్తుతో రూ.5 లక్షల నాన్‌రిఫండబుల్ డీడీ తప్పనిసరి కావడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మద్యం దుకాణాల పోటీ, భవన అద్దెలు, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటంతో వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

News March 11, 2026

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ డైరెక్టర్‌గా సుబాసిస్ సేన్ గుప్తా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సుభాసిస్ సేన్ గుప్తా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన దుర్గాపూర్‌లోని సెయిల్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత డైరెక్టర్ పురుషోత్తం పదవీ విరమణ నేపథ్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో 12 మందిలో ఆయనను ఎంపిక చేశారు. వచ్చే నెలలో సుభాసిన్ సేన్ గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు.

News March 11, 2026

మార్చి 21నుంచి కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర

image

పెద వాల్తేరులో వేంచేసిన కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు మార్చ్ 21నుంచి ఏప్రిల్ 21వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పలు విభాగాల అధికారులతో మహారాణి పేట డిప్యూటీ తహశీల్దార్ సనపల చైతన్య ఆధ్వర్యంలో అలయ ఈఓ సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులకు భీమిలీ RDO పలు సూచనలు చేశారు. క్యూ లైన్ నిర్వహణ, శానిటేషన్, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాల పలు సూచనలు చేశారు.