India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రైల్వే ఆధునీకరణలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నారు. కొక్రాఝర్ – చర్లపల్లి (05674) స్పెషల్ రైలు శనివారం సాయంత్రం పెందుర్తి (17:58), దువ్వాడ (19:30) స్టేషన్లకు చేరుకుంటుంది. 20 కోచ్లతో నడిచే ఈ అత్యాధునిక రైలు సామాన్య ప్రయాణికులకు హైదరాబాద్ వెళ్లేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది

ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు విశాఖ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 133 పరీక్షా కేంద్రాల్లో 28,983 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 456 స్కూల్స్ నుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. 8 స్కూల్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్స్ స్క్వాడ్స్ పర్యవేక్షణ చేయనున్నాయి.

విశాఖలో అత్యాధునిక అమ్యూజ్మెంట్ పార్క్ రిసార్ట్ అభివృద్ధి కోసం మెసర్స్ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్తో పర్యాటక శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం ముంబాయిలో జరిగిన IAAPI ఎక్స్పో-2026 మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఒప్పందం అయ్యింది. 100 గదుల సామర్థ్యం కలిగిన విలాసవంతమైన రిసార్ట్ ఉంటుందని, సుమారు 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో మంత్రి లోకేశ్ గురువారం విశాఖలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ అన్నారు. 1967లో పారిస్ కేంద్రంగా ఏర్పాటైన తమ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 3.4లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 2లక్షల మంది వరకు ఒక్క భారత్లోనే ఉన్నట్లు తెలిపారు. (క్యాప్ జెమినీ సంస్థ $23.9 బిలియన్ల వార్షికాదాయం సాధిస్తోంది).

విశాఖలో క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో మంత్రి నారా లోకేశ్ గురువారం భేటీ అయ్యారు. విశాఖలో ఐటీ డెవలప్మెంట్ సెంటర్, జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు. నగరం ఐటీ, డేటా సెంటర్ హబ్గా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 20 వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో క్లౌడ్, బీపీఎం సేవల కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ తెలిపారు.

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేశ్ గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విధాల అండగా ఉంటామని ప్రజలకు మంత్రి భరోసా ఇచ్చారు. అయితే విశాఖలో క్యాప్ జెమిని ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ నేడు భేటీ కానున్నారు.

AUలో PHD చేస్తున్న పరిశోధక విద్యార్థులు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సరైన స్టైఫండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. UGC మార్గదర్శకాల ప్రకారం అనేక జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతినెలా స్టైఫండ్ అందుతోంది. కేరళ, తమిళనాడులో నెలకు రూ.15 వేల వరకు ఇస్తున్నారు. అయితే AUలో మాత్రం తగిన మద్దతు లేకపోవడంతో పరిశోధనపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

విశాఖలో పౌర సమస్యల పరిష్కారానికి ‘వైజాగ్-1’ మొబైల్ యాప్ను రూపొందించామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన వివరించారు. వార్డు, సచివాలయ డేటాను విశ్లేషించి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందిస్తామని అన్నారు. ఏఐ చాట్బాట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసి సర్వీస్ నంబర్ ఇస్తామన్నారు. దీంతో కలెక్టర్ను సీఎం చంద్రబాబు అభినందించారు.

విశాఖలో ప్రముఖ IT సంస్థ క్యాప్జెమిని కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు ముందు తాత్కాలిక కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికోసం సెంట్రల్ పార్కు రోడ్డులోని భవనాన్ని అద్దెకు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మధురవాడ IT హిల్స్, కొమ్మాది, ఆనందపురం ప్రాంతాల్లో 25-30 ఎకరాల భూమిని పరిశీలిస్తున్నారు. ఈ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ నేడు భేటీ కానున్నారు.

సైబర్ నేరాల బాధితులకు రిఫండ్ అందించడంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో 1,240 మంది బాధితులకు రూ. 22.47 కోట్లు రిఫండ్ చేయగా, 558 మంది నిందితులను అరెస్ట్ చేశారు. లోన్ యాప్ కేసుల్లో రూ. 60 లక్షల క్రిప్టో స్వాధీనం చేసుకున్నారు. మోసపోతే తక్షణమే 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
Sorry, no posts matched your criteria.