India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉపాధి, శిక్షణ కల్పిస్తున్నట్లు సీఈవో ఇంతియాజ్ ఆర్షేడ్ బుధవారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 15వ తేదీలోపు ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సముదాయంలో ఉన్న ఆఫీసులో సంప్రదించాలని కోరారు. ఐటిఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
విశాఖ జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు బుధవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ఇళ్లు మంజూరై ఇంకా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లకు సాయం అందిస్తామన్నారు. యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి మూడో శనివారం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై చర్చించారు. నిర్వహణపై బుధవారం ఉదయం తన ఛాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జన్మనిచ్చిన తల్లికి తండ్రి కొనిచ్చిన స్కూటర్పై దేశమంతా తిప్పి చూపించాడు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవాలయ దర్శనాలు చేపించాడు మైసూర్కు చెందిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్. తన తల్లి చూడారత్నమ్మ కోరిక మేరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఆలయాలకు స్కూటర్ పైనే తిప్పాడు. తల్లికిచ్చిన మాట కోసం ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. వీరిద్దరూ బుధవారం విశాఖ చేరుకున్నారు.
విశాఖనగరంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విచ్చలవిడిగా లభిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఒడిశా నుంచి రైలు మార్గంలో ఖైని, గుట్కా, పాన్ మసాలాలు విశాఖకు చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధురవాడ, ఆరిలోవ, వెంకోజిపాలెం, మద్దిలపాలెం ప్రాంతాలలో ఏ దుకాణంలో చూసిన ఇవి విరివిగా లభిస్తున్నాయి. ఆహారభద్రత అధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
వైసీపీ కార్పొరేటర్గా పోటీ చేసిన దొడ్డి రమణతో పాటు మరో ముగ్గురు అకారణంగా దూషించి మతిస్థిమితం లేని తన కుమార్తెపై దాడి చేశారని ఓ మహిళ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 64వ వార్డుకు చెందిన దొడ్డి రమణ, మంత్రి మంజుల వెంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వహిస్తున్నారు. దేవాలయంలో హుండీ పోగా.. దార రమణమ్మ కొడుకు దొంగలించాడంటూ గతనెల 28న దాడి చేసినట్లు ఫిర్యాదు చేయడంతో సీఐ పార్థసారథి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ 13 రైతు బజార్లో బుధవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.16, ఉల్లి రూ.23, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ.38, మిర్చి రూ.30, బెండ రూ.42, బీరకాయలు రూ.48 , క్యారెట్ రూ.22/26, బీట్రూట్ రూ.24, బీన్స్ రూ.50, గ్రీన్ పీస్ రూ.54, గుత్తి వంకాయలు రూ.36, కీర రూ.22, గోరు చిక్కుడు రూ.34, నిమ్మకాయలు రూ.100, ఉసిరి కాయలు(హైబ్రిడ్) రూ.100, పొటల్స్ రూ.90గా నిర్ణయించారు.
గాజువాక సమీపంలో గల నాతయ్యపాలెం డైరీ వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఎలక్ట్రికల్ పోల్ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో కే.కోటపాడుకు చెందిన బొత్స కామేశ్వరరావు(37) తీవ్ర గాయాలవ్వగా స్థానికుల వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడ్డ మరో మహిళ దొడ్డి సత్యవతి చికిత్స పొందుతోంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీవీఎంసీ పరిధిలో రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయినవారు TDR పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు మంగళవారం తెలిపారు. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అధికారులు నిబంధనల ప్రకారం దరఖాస్తు పరిశీలించి TDRపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. పూర్తి వివరాలకు జోనల్ కార్యాలయాలలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లను సంప్రదించాలన్నారు.
కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 ఆగస్టులో కొండవీటి శివ అనే వ్యక్తి మరొక వ్యక్తిని కర్రతో కొట్టి గాయపరిచాడు. ఆ ఘటనలో గాయపడిన వ్యక్తి వైద్యం తీసుకుంటూ కొద్ది రోజులకు మరణించాడు. ఈ కేసుపై మంగళవారం జిల్లా సెకండ్ ఏడీజే కోర్టులో వాదనలు ముగిశాయి. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి గాయత్రి దేవి తీర్పునిచ్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.