India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చెరకు తోటలో మంటలు అంటుకుని సుంకర పోతురాజు అనే వ్యక్తి మృతి చెందాడు. బుచ్చయ్యపేటకు చెందిన పోతురాజు తన తోటలో చెత్తకు ఆదివారం మంట పెట్టాడు. ఈ మంటలు చెలరేగి పక్కనున్న మరో చెరుకు తోటకు వ్యాపించాయి. దీంతో మంటలు ఆర్పేందుకు వెళ్లి అందులో చిక్కుకున్నాడు. ప్రమాదంలో శరీరం కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు.

పాయకరావుపేట మండలం వెంకటనగరం తీరంలో ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు, బోటు బోల్తా పడడంతో మృతి చెందాడు. రాజానగరం గ్రామానికి చెందిన గరికిన కొత్తబాబు తన కుమారుడు, మరో వ్యక్తితో కలిసి వెంకటనగరం రేవులో చేపల వేటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం పడవ బోల్తా పడడంతో కొత్తబాబు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారాన్ని ఫిషరీస్ అధికారులకు తెలియజేశామన్నారు.

దేవరాపల్లి (మం) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ డెక్క చిరంజీవి(32) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు విధినిర్వహణలో భాగంగా ములకలాపల్లి పాలకేంద్రం వద్ద విద్యుత్ స్తంభానికి కట్టిన పోస్టర్ను తొలగించాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎస్.ఐ డి.నాగేంద్ర ఘటనా స్థలానికి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

పెందుర్తి నియోజకవర్గం టీడీపీ టికెట్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం సబ్బవరంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీడీపీకి నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారని, పొత్తులో భాగంగా ఈ సీటును బండారి కేటాయిస్తే అధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. మేరకు టీడీపీ నాయకులు, బండారు అనుచరులు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

రాష్ట్రానికి జగన్, దేశానికి మోదీ రాహుకేతువులుగా తయారయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. డాబా గార్డెన్లోని ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. మోదీ అప్పులుపాలు చేసి దేశాన్ని తాకట్టు పెడితే.. రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టాడన్నారు. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశన దేశాన్ని బీజేపీ తయారుచేసిందని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోదీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారయని అన్నారు.

విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఆరు చెక్ పోస్ట్ల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశించారు. రాజకీయ సభలు, సమావేశాలకు సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 478 పోలింగ్ కేంద్రాలను స్వల్ప సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ప్రతి నియోజకవర్గానికి రెండు స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

అనకాపల్లి MP అభ్యర్థి పేరును వైసీపీ పెండింగ్ పెట్టింది. కూటమి అభ్యర్థిగా BJP నుంచి సీఎం రమేశ్ ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరగడంతో ధీటైన అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్లు సమాచారం. మాడుగుల MLA అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును MP అభ్యర్థిగా ప్రకటించి, అక్కడ నుంచి బూడి కుమార్తె, ZPTC ఈర్ల అనురాధని పోటీ పెడతారని ప్రచారం జరుగుతోంది. మరి వైసీపీ అభ్యర్థిగా ఆ బీసీ నేత ఎవరి మీరు భావిస్తున్నారు?

అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేవీ మురళీకృష్ణ శనివారం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలయ్యేలా పోలీస్ అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.పరీక్షా కేంద్రాలు వద్ద జన సమూహాలు ఉండకూడదన్నారు.

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లించినట్లు వాల్తేరు డీసీఎం ఏకె. త్రిపాఠి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 28వ తేదీ వరకు మచిలీపట్నం-విశాఖ (17219), విశాఖ- గుంటూరు- (22701), గుంటూరు-విశాఖ (22702) ఉదయ్ ఎక్స్ప్రెస్, ఏప్రిల్ 2 నుంచి 29 వరకు విశాఖ- మచిలీపట్నం (17220) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. మరికొంటిని దారి మళ్లించారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టం శెట్టి, ఎస్పీ కేవీ మురళీ కృష్ణ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనకాపల్లి వ్యాప్తంగా 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైనా రూ.50 వేల వరకు నగదు క్యారీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.