Visakhapatnam

News August 10, 2024

విశాఖ: ప్రోటోకాల్.. జెండా ఎగురవేసేది వీరే

image

అనకాపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖలో మంత్రి అనగాని సత్యప్రసాద్, అల్లూరి జిల్లాలో కలెక్టర్ దినేశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండాలు ఎగురవేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

News August 9, 2024

రామకృష్ణాపురం క్వారీ చెరువులో పడి వ్యక్తి మృతి

image

ఆరిలోవ శివారు ప్రాంతం రామకృష్ణాపురంలో క్వారీ చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం కొందరు వ్యక్తులు గంజాయి తాగి అటుగా వెళుతున్న బ్లూ కోర్ట్ పోలీసులను చూసి పరుగులు తీసి చెల్లాచెదురయ్యారు. ఈ నేపథ్యంలో చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. మృతుడు హెచ్బీ కాలనీకి చెందిన సాయినాథ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 9, 2024

ఆదివారం కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు

image

విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఇక ఆదివారం కూడా అందుబాటులో ఉంటుందని రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. డిసెంబర్ 10వ తేదీ నుంచి ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. అయితే మంగళవారం ఈ సర్వీసు అందుబాటులో ఉండదని కూడా స్పష్టం చేశారు.

News August 9, 2024

రాంబిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

రాంబిల్లి మండలంలోని సెజ్ కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.రాయవరం నుంచి లారస్ ఫార్మా కంపెనీకి వెళ్తున్న ఎంప్లాయిస్ బస్సు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొంది. ప్రమాదంలో పెంటకోట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 9, 2024

విశాఖ: లంచాలకు పాల్పడే వారిపై క్రమ శిక్షణ చర్యలు

image

కేజీహెచ్‌లో లంచాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద హెచ్చరించారు. శుక్రవారం కేజీహెచ్‌లో మాట్లాడుతూ.. ఇకపై లంచాలకు తావు లేదన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 0891-2590100, 2590102 నంబర్‌లకు ఫిర్యాదు చేయాలన్నారు.

News August 9, 2024

అనకాపల్లి: రన్నింగ్ RTC బస్సులోకి పాము

image

మాకవరపాలెం నుంచి నర్సీపట్నం వెళ్తున్న RTC బస్సులోకి నాగు పాము ప్రవేశించడంతో ప్రయాణీకులు భయాందోళన చెందారు. బస్సు బయలుదేరిన కాసేపటికే మాకవరపాలెం సమీపంలో వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో తుప్పల్లో ఉన్న పాము బస్సులోకి ప్రవేశించింది. అది గమనించిన ప్రయాణీకులు భయాందోళన చెందడంతో వారిని వేరే బస్సులో తరలించినట్లు ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. భయాందోళనతో ఓ ప్రయాణీకుడు ఆ పామును కొట్టినట్లు తెలుస్తోంది.

News August 9, 2024

విశాఖ: ఈనెల 11 నుంచి రైళ్ల పునరుద్ధరణ

image

విశాఖ నుంచి నడిపే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఈనెల 11వ తేదీ నుంచి సింహాద్రి, రత్నాచల్, ఉదయ్, గుంటూరు-రాయగడ, విశాఖ- తిరుపతి డబుల్ డెక్కర్, విశాఖ-మచిలీపట్నం ఎక్స్ ప్రెస్‌లను పునరుద్ధరించనున్నారు. 50 రోజులుగా ఈ రైళ్లను నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని పరిశీలించిన రైల్వే అధికారులు ఈ రైళ్ళను పునరుద్ధరించాలని నిర్ణయించారు.

News August 9, 2024

విశాఖలో ఎన్నికల వలన జీవోపై మాట్లాడలేకపోతున్న: CBN

image

విశాఖలో MLC ఎన్నికల కారణంగా G.0 నెం.3, ఉద్యోగాలపై మాట్లాడలేకపోతున్నానని CM చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెస్తామన్నారు. రూ.10 కోట్లతో అల్లూరి జిల్లాలో టూరిజం అభివృద్ధి, రూ.500 కోట్లతో పాడేరు మెడికల్ కాలేజీ పూర్తి చేస్తామన్నారు. రూ.50 కోట్లతో జిల్లాలో 3ప్రధాన రహదారుల కారిడార్‌ నిర్మిస్తామన్నారు.

News August 9, 2024

ఇగ్నో ప్రవేశాల గడువు పెంపు

image

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జులై 2024 విద్యా సంవత్సరానికిగాను వివిధ దూరవిద్యా కోర్సులతో పాటు ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన గడువును పెంచినట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ జి.ధర్మారావు వెల్లడించారు. అన్ని సర్టిఫికెట్, డిప్లమో, పీజీ డిప్లమో, డిగ్రీ, అన్ని పీజీ కోర్సుల్లో చేరటానికి ఆగస్టు 14 వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఈ ప్రవేశాలను ఆన్‌లైన్ ద్వారా పొందాలి.

News August 9, 2024

డెంగ్యూతో చేరితే మలేరియాకు చికిత్స.. విశాఖలో యువకుడు మృతి

image

డెంగ్యూతో ఆసుపత్రిలో చేర్పించిన తమ కుమారుడు వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయాడని విశాఖకు చెందిన తిప్పిన రమణారెడ్డి, రాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధనుష్ రెడ్డి డెంగ్యూ జ్వరంతో అక్కయ్యపాలెంలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. మలేరియా జ్వరానికి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పరిస్థితి విషమించింది. దీంతో వేరే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందేలోపే మరణించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.