India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశ జనాభాలో ఓబీసీల సంఖ్య 50 శాతానికి మించి ఉన్నందున, మొత్తం పార్లమెంటు స్థానాలలో 50 శాతం ఓబీసీలకు కేటాయించాలని బీసీ సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు భోగి రమణ డిమాండ్ చేశారు. డాబాగార్డెన్స్లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్లో ఛలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈనెల 12,13 తేదీలలో న్యూఢిల్లీలో ఓబీసీ మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఉందని తెలిపారు.
విశాఖలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఆడియో మెట్రికన్, ఫిజియోథెరపిస్ట్ తదితర 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైనవారు పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో మార్చ్ 17లోపు దరఖాస్తు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు www.visakhapatnam.ap.gov.in చూడాలన్నారు.
భీమిలి జూనియర్ కాలేజీలో ఇంటర్ ఇన్విజిలేటర్ గా ఉన్న డి.మాధవరావు(55) పరీక్షా కేంద్రంలోనే గుండెపోటుతో మృతి చెందాడు. రేకవానిపాలెం ఎంపీపీ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న ఆయనకు ఇంటర్ ఇన్విజిలేషన్ విధులు అప్పగించారు. ఈమేరకు సోమవారం ఉ.8గంటలకు పరీక్షా కేంద్రంలో ఆయన కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
విశాఖలోని ఓ హోటల్లో <<15698756>>మహిళ ఉరి<<>> వేసుకున్న ఘటనలో నిందితుడిని త్రీటౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఉంటున్న పిళ్ల శ్రీధర్ (53)USAలో ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నారు. అక్కడ ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె ఫిబ్రవరి 14న విశాఖ వచ్చింది. మార్చ్ 6న హోటల్ మేఘాలయలో కలవాలని అతను బలవంతం చేశాడు. హోటల్లో శ్రీధర్ ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని దీంతో ఆమె ఉరి వేసుకుందని విచారణలో తేలింది.
విశాఖలోని వ్యవసాయ, వాణిజ్య శాఖ అధికారులు సోమవారం నాటి కూరగాయ ధరలను విడుదల చేశారు. వాటి వివరాలు టమోటా కేజీ రూ.14 , ఉల్లిపాయలు కేజీ రూ.28 , బంగాళాదుంపలు కేజీ రూ.15, వంకాయలు రూ.22/24/32, బెండకాయలు రూ.44, మిర్చి రూ.24, బరబాటి రూ.36, క్యారెట్ రూ.24, బీరకాయలు రూ.50, వెల్లుల్లి రూ.60/80/90గా నిర్ణయించారు.
విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరపుతుంటాడని పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు సంబంధిత అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా SI సునీత ఆదివారం PMపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలువురు రౌడీ షీటర్స్ను సత్ప్రవర్తనతో వ్యవహరించాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) వినతుల స్వీకరణ కార్యక్రమం 10వ తేదీ నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా గత కొన్ని వారాల నుంచి రద్దైన సంగతి తెలిసిందే. కోడ్ ముగిసిన క్రమంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ద్వారకానగర్లో ఓ యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రమీల(20) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం ఉదయం రూములో ఉరివేసుకుని చనిపోయింది. యువతి తండ్రి రామినాయుడు ద్వారకానగర్లోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వీరి సమాచారం మేరకు ద్వారకానగర్ ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
సమాజంలో మహిళలు ఎప్పుడూ మహారాణులు గానే నిలుస్తారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితా అన్నారు. ఆదివారం ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు గంగాభవాని, కార్యదర్శి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో హోం మంత్రి అనిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఎప్పుడో మహారాణులుగా నిలుస్తారన్నారు.
Sorry, no posts matched your criteria.